search
×

Stock Market Crash: యూఎస్‌ ఫెడ్‌ హాకిష్‌ కామెంట్స్‌ - భారత స్టాక్‌ మార్కెట్లు క్రాష్‌!

Stock Market Opening 16 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. బంగారం ధర తగ్గడం, హాకిష్‌ ఫెడ్‌ కామెంట్స్‌ మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు కారణమయ్యాయి.

FOLLOW US: 
Share:

Stock Market Opening 16 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ద్రవ్యోల్బణం భయాలు, ఆర్థిక మందగమనం డేటా మదుపర్లను కలవరపెట్టింది. వీటికి తోడు బంగారం ధర తగ్గడం, హాకిష్‌ ఫెడ్‌ కామెంట్స్‌ మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు కారణమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 179 పాయింట్ల నష్టంతో 17,698 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 584 పాయింట్ల నష్టంతో 59,350 వద్ద ఉన్నాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 59,934 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,585 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 59,154 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,720 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 584 పాయింట్ల నష్టంతో 59,350 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty

గురువారం 17,887 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,698 వద్ద ఓపెనైంది. 17,642 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,820 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 179 పాయింట్ల నష్టంతో 17,698 వద్ద చలిస్తోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 40,977 వద్ద మొదలైంది. 40,818 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,162 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 192 పాయింట్ల నష్టంతో 41,016 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 6 కంపెనీలు లాభాల్లో 44 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సిప్లా, సన్ ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా కన్జూమర్‌, హీరో మోటోకార్ప్‌, టెక్‌ మహీంద్రా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఆటో, బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, మెటల్‌, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు భారీగా ఎరుపెక్కాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NSE India (@nseindia)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NSE India (@nseindia)

Published at : 16 Sep 2022 11:05 AM (IST) Tags: Nse Nifty Stock Market Crash BSE Sensex Stock Market

ఇవి కూడా చూడండి

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

టాప్ స్టోరీస్

Minister Ramanaidu: మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు

Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ

Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ

Revanth Reddy: ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?

Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?