By: ABP Desam | Updated at : 20 Dec 2022 04:00 PM (IST)
Edited By: Arunmali
ఒక్క ప్రీమియం కడితే చాలు, ప్రతి నెలా ఆదాయం!
LIC New Jeevan Shanti Policy: తెలివైన ప్రతి వ్యక్తి, డబ్బు సంపాదించే కాలం కోసం మాత్రమే కాక, సంపాదించలేని కాలం (రిటైర్మెంట్, వృద్ధాప్యం) కోసం కూడా ఇప్పట్నుంచే ప్లాన్ చేస్తాడు. సాధారణంగా, మన దేశంలో ఎక్కువ మంది ప్రజల ఆదాయం వాళ్ల 60 ఏళ్లు దాటిన తర్వాత ఆగిపోతుంది. కుటుంబ ఖర్చులు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. ముందస్తు వ్యూహం లేకపోతే అటువంటి పరిస్థితిలో గడ్డు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు మీ యవ్వన లేదా సంపాదన కాలంలోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, వృద్ధాప్యంలో డబ్బు గురించి చింతించాల్సిన అవసరం ఉండదు.
దేశంలోనే అతి పెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India- LIC) ప్రజల కోసం ఎప్పటికప్పుడు వివిధ రకాల బీమా పాలసీలను తీసుకొస్తూనే ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకోబోతున్న బీమా పాలసీ పేరు LIC న్యూ జీవన్ శాంతి పాలసీ (New Jeevan Shanti Policy). ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా, జీవితాంతం నెలనెలా పింఛను పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇవి:
LIC న్యూ జీవన్ శాంతి పాలసీ
LIC తీసుకొచ్చిన న్యూ జీవన్ శాంతి ప్లాన్ ఒక నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సింగిల్ ప్రీమియం, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఈ పాలసీలో మీకు రెండు పెట్టుబడి ఎంపికలు లభిస్తాయి. మొదటిది ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్, రెండోది డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్.
ఇంటర్మీడియట్ యాన్యుటీ ఆప్షన్లో... మీరు ప్రీమియం చెల్లించిన తర్వాత మాత్రమే పింఛను సౌకర్యం పొందుతారు.
డిఫర్డ్ యాన్యుటీ ఆప్షన్లో... పాలసీ తీసుకున్న తర్వాత, 1, 5, 10, 12 సంవత్సరాల తర్వాతి నుంచి మీకు పింఛను సౌకర్యం లభిస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా... అర్ధ వార్షిక (6 నెలలకు ఒకసారి), త్రైమాసిక (3 నెలలకు ఒకసారి) లేదా నెలవారీ ప్రాతిపదికన పింఛను పొందే సౌకర్యం ఉంది. దీనిలో మీకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకోవచ్చు.
ఈ పాలసీలో, సింగిల్ లైఫ్ & సెకండ్ జాయింట్ లైఫ్ రెండింటిలోనూ ఖాతాను తెరవవచ్చు. సాధారణంగా ఒక ప్లాన్ తీసుకున్న తర్వాత, ఆ పాలసీదారు మాత్రమే పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతాడు. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణిస్తే, డిపాజిట్ మొత్తాన్ని నామినీకి ఇస్తారు. న్యూ జీవన్ శాంతి పాలసీ సెకండ్ జాయింట్ లైఫ్ ఆప్షన్ తీసుకుంటే, దురదృష్టవశాత్తు మొదటి పాలసీదారు మరణిస్తే, రెండో వ్యక్తికి కూడా జీవితాంతం పింఛను ప్రయోజనం లభిస్తుంది. ఇద్దరూ చనిపోతే, డిపాజిట్ చేసిన మొత్తాన్ని నామినీకి ఎల్ఐసీ అందిస్తుంది.
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!
Auto Stocks to Buy: బడ్జెట్ తర్వాత స్పీడ్ ట్రాక్ ఎక్కిన 10 ఆటో స్టాక్స్ ఇవి, వీటిలో ఒక్కటైనా మీ దగ్గర ఉందా?
Stock Market News: స్టాక్ మార్కెట్లో అదానీ షేర్ల కిక్కు - సెన్సెక్స్ 377, నిఫ్టీ 150 అప్!
Cryptocurrency Prices: మిశ్రమంగా క్రిప్టోలు - బిట్కాయిన్ ఏంటీ ఇలా పెరిగింది!
Coin Vending Machines: దేశంలో తొలిసారిగా కాయిన్ మెషీన్స్, చిల్లర సమస్యలకు చెక్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ