అన్వేషించండి

Akshaya Tritiya: సామాన్యులను ధనవంతులు చేసిన అక్షయతృతీయ, ఈసారి హిస్టరీ రిపీట్ అవ్వుద్దా?

Gold News: గడచిన దశాబ్దకాలంలో అక్షయతృతీయకు ఇన్వెస్టర్లు కొన్న పసిడి వారికి నిజంగా కనకవర్షం కురిపించింది. రెండు మూడు సంవత్సరాలు మినహా ప్రతి ఏటా గోల్డ్ ధరలు పెరుగుతూ వారికి సూపర్ లాభాలను అందించాయి.

Akshaya Tritiya: మరో రెండు రోజుల్లో అక్షయతృతీయ వచ్చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లోని పెద్ద విక్రయదారులు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల రెండు నెలలుగా పెరిగిన పసిడి ధరలతో కొనుగోళ్లు సన్నగిల్లటంతో చాలా వ్యాపారులు పసిడి ప్రియులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు కొనుగోలుదారుల రద్దీతో కళకళలాడిన షాపులు ప్రస్తుతం చాలా చోట్ల కళతప్పాయి. పెరిగిన రేట్లు సామాన్యుల గుండెల్లో బాంబుల్లా పేలుతున్నాయి. బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ ప్రజలు చూడని స్థాయిలకు చేరుకోవటం అటు షాపుల యజమానులను, ఇటు పసిడి ప్రియులను ఈసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

ప్రపంచంలో ఏమూలన ఉన్నా భారతీయులు తప్పకుండా జరుపుకునే పండుగల్లో అక్షయతృతీయ ప్రధానమైనది. విదేశాల్లో స్థిరపడినప్పటికీ అక్కడ స్థానికంగా బంగారాన్ని ప్రజలు కొంటుంటారు. ఎందుకంటే.. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం చాలా శుభప్రదమని నమ్ముతారు. ఈ రోజున చాలా మంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు లేదా బంగారం కొనుగోలు చేస్తారు. "అక్షయ" అంటే శాశ్వతమైనది లేదా నాశనం చేయలేనిదని అర్థం. అందువల్ల ఈ రోజున చేసే కొనుగోళ్లు లేదా పెట్టుబడులు నిలిచి ఉంటాయని భారతీయుల నమ్మకం. గత గణాంకాలను పరిశీలిస్తే ప్రజలు అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసిన బంగారం అద్భుతమైన రాబడిని ఇస్తున్నాయని వెల్లడైంది.  

గతేడాది ఏప్రిల్‌ 21న అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసిన వారికి అద్భుతమైన రాబడి వచ్చిందని కేడియా కమోడిటీస్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ కేడియా తెలిపారు. ఏప్రిల్ 21, 2023న 10 గ్రాముల బంగారం ధర రూ.59,845 వద్ద ఉంది. ప్రస్తుతం రేట్లతో పోల్చితే దాదాపు ఇన్వెస్టర్లు రూ.14,000 లాభాన్ని తెచ్చిపెట్టింది. గత 12 ఏళ్ల బులియన్ మార్కెట్ల డేటాను పరిశీలిస్తే.. 2011 నుంచి 2012 అక్షయతృతీయల మధ్య బంగారం ధర ఏడాదిలో 10 గ్రాములకు 33 శాతం అంటే రూ.7,184 పెరిగి రూ.29,030 స్థాయికి చేరింది. అయితే ఆ తర్వాత ఏడాది 2013 నాటి గోల్డ్ ధర కేవలం 2.88 శాతం మాత్రమే పెరిగింది. 2018- 2019 సంవత్సరాల్లో కూడా అక్షయతృతీయకు పసిడి కొనుగోలు చేసిన వారికి రాబడులు సానుకూలంగా ఉన్నాయి.

6 మే 2019 అక్షయతృతీయ రోజున కొనుగోలు చేసిన బంగారం ఇన్వెస్టర్లను ధనవంతులను చేసింది. ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ.31,383 వద్ద ముగిసింది. తర్వాతి సంవత్సరం అంటే ఏప్రిల్ 24, 2020న అక్షయ తృతీయ రోజు నాటికి గోల్డ్ ధర 47.41 శాతం పెరిగి రూ.46,527 రేటుకు చేరుకుంది. ప్రతి పది గ్రాములపై ​​దాదాపు రూ.15,000 రాబడిని ప్రజలు అందుకున్నారు. దీని తర్వాతి నుంచి గోల్డ్ నిరంతరం తన పెట్టుబడిదారులకు సానుకూల రాబడులను అందిస్తూనే ఉంది. గోల్డ్ 2021లో 2.47 శాతం, 2022లో 6.57 శాతం, 2023లో 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే 2024లో మాత్రం పసిడి ధరలు మెగా ర్యాలీతో పెట్టుబడిదారులను ఖుషీ చేస్తున్నప్పటికీ.. కొనుగోలుదారులను మాత్రం షాక్ కి గురిచేస్తోంది. ఈ ఏడాది 5 నెలల కాలంలో ఇప్పటి వరకు 20 శాతానికి పైగా ర్యాలీతో గొప్ప రాబడులను గోల్డ్ అందించింది. కానీ.. 2014లో 3.33 శాతం, 2015లో 6.11 శాతం, 2017లో దాదాపు 5 శాతం నష్టాలను పసిడి పెట్టుబడిదారులకు అందుకున్నారు. 

Also Read: ఫిజికల్ గోల్డ్‌ Vs గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ Vs గోల్డ్ బాండ్స్.. ఏదీ కొనటం ఉత్తమం?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget