search
×

Oyo IPO: ఓయో ఐపీఓ లేనట్లేనా మరోసారి దరఖాస్తు ఉపసంహరణ

Oyo IPO: ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ మాతృ సంస్థ ఒరావల్ స్టే ఐపీవోను ప్రారంభించడం కోసం సెబీ కి సమర్పించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను ఉపసంహరించుకుంది.

FOLLOW US: 
Share:

Oyo IPO: ఓయో(OYO) హోటల్స్ అండ్ హోమ్స్ మాతృ సంస్థ ఒరావల్ స్టే ఐపీవోను ప్రారంభించడం కోసం సెబీ(SEBI)కి సమర్పించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను ఉపసంహరించుకుంది. అంటే ఐపీఓను ప్రారంభించే ప్రణాళికలను కంపెనీ మరోసారి వాయిదా వేసుకుంది. కంపెనీ ఐపీఓ దరఖాస్తును ఉపసంహరించుకోవడం ఇది రెండోసారి. అంతకుముందు 2021లో, ఓయో ఐపీవో (IPO) కోసం దరఖాస్తు చేసింది. కానీ, తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. ఓయో ఐపీఓపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు కంపెనీ ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుండి 4 బిలియన్ డాలర్ల విలువతో ఈక్విటీని సేకరించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.   

అయితే, కంపెనీ డ్రాఫ్ట్ పేపర్‌ను ఎందుకు ఉపసంహరించుకుందో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో స్పష్టంగా పేర్కొనలేదు.  అయితే, కంపెనీ ఇప్పుడు రీఫైనాన్సింగ్ ద్వారా తన బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయాలనుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఓయో ప్రస్తుతం బాండ్ల ద్వారా 350 నుంచి 450 మిలియన్ డాలర్లు సేకరించాలనుకుంటోంది.
 
ఇది కంపెనీ ప్రణాళిక
రీఫైనాన్సింగ్ ఓయో  ఆర్థిక నివేదికలలో గణనీయమైన మార్పులకు దారితీస్తుందని బిజినెస్ స్టాండర్డ్‌లోని ఒక నివేదిక తెలిపింది. అందువల్ల, ప్రస్తుత నిబంధనల ప్రకారం రెగ్యులేటర్‌తో దాని ఫైలింగ్‌ను సవరించాల్సి ఉంటుంది.  రీఫైనాన్స్ నిర్ణయం అధునాతన దశలో ఉన్నందున, ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో ఐపీవో ఆమోదంతో కొనసాగించడంలో ఎటువంటి ప్రయోజనం లేదు. బాండ్ జారీ చేసిన తర్వాత కంపెనీ ఆమోదం కోసం పత్రాలను మళ్లీ ఫైల్ చేస్తుంది.

2021 సంవత్సరంలో మొదటిసారి దరఖాస్తు  
ఓయో(OYO) 2021 సంవత్సరంలో మొదటిసారిగా సెబీ(SEBI)కి  12 బిలియన్ డాలర్ల విలువతో ఐపీవో(IPO)ని ప్రారంభించేందుకు పత్రాలను సమర్పించింది. కానీ, తర్వాత కంపెనీ మనసు మార్చుకుని పేపర్లను వెనక్కి తీసుకుంది. దీని తర్వాత, గత ఏడాది మార్చిలో ఐపిఓ తీసుకురావడానికి కంపెనీ రెండుసార్లు డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.  Oyo CEO రితేష్ అగర్వాల్ కంపెనీ  ఇటీవలి టౌన్‌హాల్ సమావేశంలో 3 నుండి 4 బిలియన్ డాలర్లను సేకరించడం గురించి మాట్లాడారు. రుణాన్ని తిరిగి చెల్లించడానికి కంపెనీ ఈ డబ్బును ఉపయోగించవచ్చు.

Published at : 23 May 2024 06:54 PM (IST) Tags: Oyo SEBI Oyo IPO withdrawn Oyo withdraw ipo application Ritesh Agarwal oyo Oyo Hotels and Homes

ఇవి కూడా చూడండి

ఈవారం IPOకు వస్తున్న 11 కంపెనీలు, నిధుల సమీకరణే లక్ష్యంగా పోటీ

ఈవారం IPOకు వస్తున్న 11 కంపెనీలు, నిధుల సమీకరణే లక్ష్యంగా పోటీ

Mega IPO: ఫస్ట్ లిస్టింగ్‌లో దూసుకెళ్లిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ షేర్ - కొనసాగుతుందా? ఇతర వాటిలా పడిపోతుందా?

Mega IPO: ఫస్ట్ లిస్టింగ్‌లో దూసుకెళ్లిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ షేర్ - కొనసాగుతుందా? ఇతర వాటిలా పడిపోతుందా?

Nuvvunte Na Jathaga Serial july 1st: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆనంద్ సీక్రెట్ లీక్.. దేవా ప్రేమ పసిగట్టేసిన మిథున.. బేబీ దగ్గరకు ప్రేమ జంట!

Nuvvunte Na Jathaga Serial july 1st: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆనంద్ సీక్రెట్ లీక్.. దేవా ప్రేమ పసిగట్టేసిన మిథున.. బేబీ దగ్గరకు ప్రేమ జంట!

Most Awaited IPO: ఈ IPO కోసం 9 ఏళ్లుగా ఎదురుచూపులు - అతి త్వరలో సెబీ అనుమతి!

Most Awaited IPO: ఈ IPO కోసం 9 ఏళ్లుగా ఎదురుచూపులు - అతి త్వరలో సెబీ అనుమతి!

Upcoming IPO: మార్కెట్‌లోకి రానున్న రూ.15000 కోట్ల IPO, డబ్బులతో రెడీగా ఉండండి

Upcoming IPO: మార్కెట్‌లోకి రానున్న రూ.15000 కోట్ల IPO, డబ్బులతో రెడీగా ఉండండి

టాప్ స్టోరీస్

YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !

YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !

Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక

Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక

Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ

Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ