అన్వేషించండి

GQG Partners: అదానీ షేర్లలో ₹100కు ₹100 రాబడతానంటున్న రాజీవ్‌ జైన్‌, నమ్మకమే జీవితం గురూ!

అదానీ గ్రూప్‌లోని నాలుగు కంపెనీల షేర్లను ఏకంగా రూ. 15,446 కోట్లకు కొనుగోలు చేసి, గ్రూప్‌ మొత్తానికి జవసత్వాలు అందించారు జైన్‌.

GQG Partners - Adani: రాజీవ్‌ జైన్‌ గుర్తున్నాడా?, అమెరికన్‌ పెట్టుబడి సంస్థ GQG పార్ట్‌నర్స్‌ కో-ఓనర్‌ ఈయన. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ కొట్టిన దెబ్బకు అదానీ గ్రూప్‌ షేర్లు నేలకు కరుచుకున్న సమయంలో ఆపద్బాంధవుడిలా వచ్చి అదానీకి జీవదానం చేసిన ప్రముఖ ఇన్వెస్టర్‌. ఇప్పుడు గుర్తొచ్చి ఉంటాడు.

2023 జనవరి 24, అమెరికన్‌ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్‌ తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్‌ నెత్తిన దురదృష్టం తాండవమాడింది. కొన్ని స్టాక్స్ 85 శాతం వరకు కూడా పడిపోయాయి. ఇన్వెస్టర్లలో తిరిగి నమ్మకం కలిగించేందుకు గౌతమ్‌ అదానీ, అదానీ గ్రూప్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ సమయంలో (గత నెలలో) రంగంలోకి వచ్చారు రాజీవ్‌ జైన్‌. అదానీ గ్రూప్‌లోని నాలుగు కంపెనీల షేర్లను ఏకంగా రూ. 15,446 కోట్లకు కొనుగోలు చేసి, గ్రూప్‌ మొత్తానికి జవసత్వాలు అందించారు జైన్‌. ఈ భారీ కొనుగోళ్ల తర్వాత అదానీ గ్రూప్ కంపెనీలపై ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగింది. అప్పటి నుంచి అదానీ గ్రూప్‌ షేర్లు మళ్లీ పుంజుకున్నాయి.

బ్లూంబెర్గ్ ఇంటర్వ్యూలో జైన్‌
అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అతి పెద్ద FIIsలో రాజీవ్ జైన్ ఒకరు. అదానీ గ్రూప్‌పై తాను వెచ్చించిన దాదాపు $2 బిలియన్ల విలువైన ఇన్వెస్ట్‌మెంట్‌ మీద రాజీవ్‌ జైన్‌ చాలా నమ్మకంగా ఉన్నారు. 100% కంటే ఎక్కువ లాభాన్ని ఆర్జిస్తానంటున్నారు.

"అదానీ గ్రూప్‌ షేర్లు ఐదేళ్లలో మల్టీబ్యాగర్లు కావచ్చు" అని బ్లూంబెర్గ్ ఇంటర్వ్యూలో జైన్‌ చెప్పారు. ఆయన కొన్న తర్వాత అదానీ షేర్‌ ధరలు పెరిగాయి కాబట్టి, జైన్‌ పోర్ట్‌ఫోలియోలోని అదానీ షేర్లు ఇప్పటికే లాభాలను చూపిస్తున్నాయి.

అదానీ వ్యాపారాల మీద అపార విశ్వాసం
అదానీ గ్రూప్ విలువ దాని ఆస్తుల్లో ఉందని, షేర్లలో కాదని జైన్ చెప్పారు. భారతదేశ మౌలిక వసతులను మెరుగుపరచడానికి, చైనా వంటి దేశాల నుంచి తయారీని భారత్‌లోకి ఆకర్షించడానికి అదానీ వంటి వ్యాపారవేత్తల వైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చూస్తోందని అన్నారు. అదానీ గ్రూప్‌ చేపట్టిన అనేక ప్రాజెక్టులు భారతదేశ అభివృద్ధి లక్ష్యాలతో ముడిపడి ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాల్లో విస్తరించి ఉన్నాయని చెప్పారు.

ముఖ్యంగా, అదానీ బొగ్గు గనుల వ్యాపారం, డేటా సెంటర్లు, 24 గంటలూ బిజీగా ఉండే ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అదానీ మెజారిటీ వాటాను ఆరోగ్యకరమైన వ్యాపార సంకేతాలుగా జైన్‌ చెప్పుకొచ్చారు.

"అదానీ గ్రూప్‌ కంటే ముంబై విమానాశ్రయమే ఎక్కువ విలువైందని మేము నమ్ముతున్నాం" అని జైన్ బ్లూమ్‌బెర్గ్‌తో చెప్పారు. 

హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ను చూసి భయపడలేదు
షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ $153 బిలియన్లను తగ్గింది. హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపైనా రాజీవ్‌ జైన్‌ మాట్లాడారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికను చూసి తాను భయపడలేదని జైన్ చెప్పారు.

హిండెన్‌బర్గ్ నివేదిక "10 ఏళ్ల పాతకాలం నాటి వార్తాపత్రికలా ఉంది" అని జైన్ కామెంట్‌ చేసారు. 30 సంవత్సరాల తన పెట్టుబడి వృత్తిలో, "ఒక ఖచ్చితమైన కంపెనీని తాను ఇంతవరకు చూడలేదు" అని చెప్పారు.

హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో ఒకటి ఏమిటంటే, కుటుంబానికి అనుసంధానించబడిన ఆఫ్‌షోర్ ఖాతాల లాబ్రింత్‌ను ఉపయోగించడం ద్వారా, పబ్లిక్ షేర్‌హోల్డర్‌లు కనీసం 25% స్టాక్‌ను కలిగి ఉండాలనే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అవసరాలను గ్రూప్ దాటవేస్తుంది. అదానీ ఆరోపణలను ఖండించారు.

"గ్రూప్‌ కంపెనీల్లో అదానీకి 75% కంటే ఎక్కువ వాటా ఉందన్నది హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన అంశాల్లో ఒకటి. నిజంగానే అది మోసమా? ” అని జైన్ అన్నారు. “తన వాటాల గురించి అదానీ సరిగ్గా వెల్లడించలేదు. అంతేతప్ప అది మోసం ఎలా అవుతుంది?" అని జైన్‌ ప్రశ్నించారు.

GQG పార్ట్‌నర్స్‌ పోర్ట్‌ఫోలియోలో వివిధ రంగాల కంపెనీలు ఉన్నాయి. చమురు, పొగాకు, బ్యాంకింగ్ వంటి పరిశ్రమల్లో $90 బిలియన్లకు పైగా పెట్టుబడులను ఈ కంపెనీ పెట్టింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Lenin Movie : 'లెనిన్' సరసన వెన్నెలంటి మా 'భారతి' - భాగ్యశ్రీ క్యూట్ లుక్
'లెనిన్' సరసన వెన్నెలంటి మా 'భారతి' - భాగ్యశ్రీ క్యూట్ లుక్
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Fact Check: మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
Embed widget