అన్వేషించండి

Gold Demand: ఈ రేట్లు ఇండియన్స్‌ను ఆపలేవు, నగల డిమాండ్‌ పెరుగుటయేగానీ విరుగుట కల్ల!

నగల అమ్మకాలను పరిశీలిస్తే.. పెరుగుతున్న బంగారం ధరలు ప్రజలను ఏమాత్రం నిరోధించలేకపోయాయి.

Gold Jewellery Demand In India 2024: బంగారంపై భారతీయులకు ఎంత మోజు ఉందో ప్రపంచం మొత్తానికీ తెలుసు. ప్రపంచ పసిడి మండలి (World Gold Council - WGC) ఎప్పటికప్పుడు రిలీజ్‌ చేసే రిపోర్ట్‌లు కూడా భారతీయుల మక్కువను చాటి చెబుతుంటాయి. WGC తాజా నివేదిక ప్రకారం, అతి పెద్ద పసిడి మార్కెట్లలో భారతదేశం ఒకటి, ఇది వేగంగా వృద్ధి చెందుతోంది. మన దేశంలో బంగారం ధరలు వేగంగా పెరగడానికి ఇదే కారణం. 

ఈ రోజు (శనివారం, 30 మార్చి 2024), దిల్లీలో 22 కేరెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ. 62,900 స్థాయికి చేరుకుంది. 24 కేరెట్ల స్వచ్ఛమైన పసిడి రేటు రూ. 68,600కు చేరింది. వాస్తవానికి ఈ రోజు రేటు రూ.280 తగ్గింది. నిన్న 24 కేరెట్ల గోల్డ్‌ రేటు రూ. 68,880 గా నమోదైంది. 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు 
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,750 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర రూ.68,450 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ.51,340 వద్దకు చేరాయి. విజయవాడ మార్కెట్‌లోనూ ‍(Gold Rate in Vijayawada) దాదాపుగా ఇవే రేట్లు అమలవుతున్నాయి. 

అతి త్వరలోనే బంగారం రూ.69,000 దాటే అవకాశం ఉందని సామాన్య జనంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే, ఆభరణాలకు డిమాండ్ తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు.

కొనుగోలుదార్లను ఆపలేకపోతున్న పసిడి రేట్లు 
2023-24 ఆర్థిక సంవత్సరంలో (FY24) బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వంటి భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదార్లు పసిడి కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున బంగారం కొని నిల్వ చేయడం ప్రారంభించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24), MCXలో బంగారం ధరలు దాదాపు 12 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 59,400 నుంచి రూ. 67,000 వేల మార్కును దాటాయి. నగల అమ్మకాలను పరిశీలిస్తే.. పెరుగుతున్న బంగారం ధరలు ప్రజలను ఏమాత్రం నిరోధించలేకపోయాయి.

పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్ బలంగా ఉంటుందని అంచనా
పండుగల సమయంలో ఆభరణాల కొనుగోళ్లు వేగంగా పెరుగుతాయని పీఎన్‌జీ జ్యువెలర్స్ (PNG Jewellers) ఎండీ & సీఈవో సౌరభ్ గాడ్గిల్ చెబుతున్నారు. ఉగాది, హోలీ, గుఢి పడ్వా, అక్షయ తృతీయ, రంజాన్‌ వంటి పండుగల సందర్భంగా కస్టమర్లు ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కూడా రాబోతోంది. అందువల్ల, ఆభరణాల డిమాండ్ ఇంకా పెరుగుతుందన్న ఆశలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బంగారాన్ని అలంకరణగా మాత్రమే కాదు, సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. అందుకే ఆభరణాలపై ఎక్కువ పెట్టుబడి పెడతారు. రూరల్‌ ఇండియా నుంచి కూడా డిమాండ్‌ ఉండొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది. అయితే, సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆభరణాల కొనుగోళ్లలో కొంత తగ్గుదల కనిపించవచ్చని కొందరు మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు.

వచ్చే త్రైమాసికంలో డిమాండ్ 10 శాతం పెరగొచ్చు!
ఖిమ్జీ జ్యువెలర్స్ (Khimji Jewellers) డైరెక్టర్ మితేష్ ఖిమ్జీ చెబుతున్న ప్రకారం, భారతీయుల నుంచి అక్షయ తృతీయ కోసం ఆభరణాల డిమాండ్‌ సిద్ధంగా ఉంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పంటలు చేతికి రావడం కూడా మొదలైంది. ఇవన్నీ కలుపుకుని, నగలకు డిమాండ్ బలంగా ఉంటుందని భావిస్తున్నారు. జనం తమ బడ్జెట్ గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాల ట్రెండ్ ఆధారంగా, గోల్డ్‌ డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని మితేష్ ఖిమ్జీ ఆశిస్తున్నారు. వచ్చే త్రైమాసికంలో డిమాండ్ 10 శాతం పెరగవచ్చని వెల్లడించారు.

మరో ఆసక్తికర కథనం: ఎక్కువ ఆదాయం ఇచ్చే ఎస్‌బీఐ పథకం, ఆదివారంతో క్లోజ్‌, త్వరపడండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget