అన్వేషించండి

Gold Prices: తెలిసిపోయింది.. బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో చెప్పిన నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman: దేశంలోని కేంద్ర బ్యాంకులన్నీ పెద్ద ఎత్తున బంగారం కొనడం వల్లనే బంగారం ధరలు పెరుగుతున్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే కంగారు పడాల్సిందేం లేదని చెబుతున్నారు.

Why gold prices are rising: బంగారం, వెండి ధరల విపరీతమైన పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఉంది. అసలు ఎందుకు ఈ ధరలు ఇలా పెరుగుతున్నాయన్నదానిపై రకరకాల కారణాలు చెబుతున్నారు. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వివరణ ఇచ్చారు. బడ్జెట్ అనంతర సమీక్షా సమావేశంలో భాగంగా ఆర్బీఐ డైరెక్టర్ల బోర్డుతో భేటీ అయిన ఆమె.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో బంగారం వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ, దేశీయ ఉత్పత్తి మాత్రం డిమాండ్‌కు సరిపడా లేదని ఆమె గుర్తు చేశారు. మన అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోందని, అందుకే అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చే మార్పులు నేరుగా మన దేశీయ ధరలపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు.

బంగారాన్ని భారీగా కొంటున్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు

ప్రస్తుత ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు చేపడుతున్న కొనుగోళ్లేనని మంత్రి విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాలు తమ నిల్వలను పెంచుకునేందుకు భారీగా బంగారం, వెండిని కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. దీనివల్ల గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ పెరిగి ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయని, కేవలం భారతీయ వినియోగం వల్లే ఈ పెరుగుదల జరగడం లేదని స్పష్టం చేశారు. భారత్‌లో కూడా ఆర్బీఐ తన నిల్వలను పెంచుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వానికి భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.              

బంగారం పెరుగుదల వల్ల ఆందోళన అక్కర్లేదు ! 

బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు భయపడాల్సినంత ఆందోళనకరంగా లేవని సీతారామన్ అభిప్రాయపడ్డారు. భారతీయ కుటుంబాలకు బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఒక సురక్షితమైన పెట్టుబడి అని ఆమె వ్యాఖ్యానించారు. పండుగలు, శుభకార్యాల సమయంలో డిమాండ్ పెరగడం అనేది మన సంప్రదాయంలో భాగమని, ఆ సమయాల్లో ధరల్లో వచ్చే హెచ్చుతగ్గులు సహజమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని, పరిస్థితిని అదుపు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ప్రపంచ మార్కెట్ పరిస్థితుల వల్లే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ అంశంపై ప్రత్యేక నిఘా ఉంచిందని మంత్రి తెలిపారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ధరలు పెరిగినప్పటికీ, జనవరి వరకు దిగుమతుల విలువలో పెద్దగా మార్పు రాలేదని, వాల్యూమ్ పరంగా నియంత్రణలోనే ఉన్నాయని వివరించారు. దేశంలో లిక్విడిటీ సమస్యలు తలెత్తకుండా, ఆర్థిక వ్యవస్థ అవసరాలకు తగ్గట్టుగా నిధుల లభ్యత ఉండేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి, ప్రపంచ మార్కెట్ ధోరణుల వల్లే ధరలు పెరుగుతున్నాయని, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.                                             

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
Why Gold Rates Down: యుద్ధం ఉన్నా బంగారం రేటు ఎందుకు తగ్గుతోంది? - లక్షకు చేరుతుందా?
యుద్ధం ఉన్నా బంగారం రేటు ఎందుకు తగ్గుతోంది? - లక్షకు చేరుతుందా?
LPG cylinder Price: భారత్‌లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా? ప్రభుత్వం ఎలా ఎదుర్కోనుంది?
భారత్‌లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా? ప్రభుత్వం ఎలా ఎదుర్కోనుంది?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
T20 World Cup Winner: అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
Embed widget