అన్వేషించండి

Work From Office: ఆఫీస్‌లో 100% పని ఇక చరిత్రే! హైబ్రీడ్‌ మోడల్‌కే కంపెనీల ఓటు!

Work From Office a History: కొవిడ్ కేసులు తగ్గినా ఐటీ కంపెనీలన్నీ హైబ్రీడ్‌ మోడల్‌కే (Hybrid Model) ఓటేస్తున్నాయి. ఐటీ కంపెనీలు వారానికి 2 రోజులు ఉద్యోగులను ఆఫీసుకు రమ్మంటున్నాయి.

Work From Office a History: ఆఫీసుల్లో ఉద్యోగులు పూర్తి స్థాయిలో పనిచేయడం ఇకపై హిస్టరీగా మిగలబోతోంది! దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ హైబ్రీడ్‌ మోడల్‌కే (Hybrid Model) ఓటేస్తున్నాయి. కొన్నాళ్లుగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్త కేసులు రావడం లేదు. ప్రజల్లోనూ మహమ్మారిపై భయం తగ్గిపోయింది. దాంతో ఐటీ కంపెనీలు (IT Companies) ఉద్యోగులను కార్యాలయాలకు రమ్మంటున్నాయి. అయితే హైబ్రీడ్‌ మోడల్‌నే అనుసరించబోతున్నాయి.

వారంలో రెండు రోజులు

ఇన్ఫోసిస్‌ కంపెనీ (Infosys) ఉద్యోగులను వారంలో ఒకటీ లేదా రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు రమ్మంటోంది. మిగతా రోజుల్లో ఇంటివద్దే పనిచేయాలని సూచిస్తోంది. టెక్‌ మహీంద్రా (Tech Mahindra)  సైతం ఏప్రిల్‌ నుంచి వారానికి రెండు రోజులు ఆఫీసుకు రావాలని చెబుతోంది. ఇప్పటికే అనుసరిస్తోన్న హైబ్రీడ్‌ వర్కింగ్‌ మోడల్‌ను ఇకపైనా కొనసాగిస్తామని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ (HCL Technology) అంటోంది. మార్చి 3 నుంచి సీనియర్‌ ఉద్యోగులు వారానికి రెండు రోజులు ఆఫీసులకు వస్తారని విప్రో తెలిపింది.

హైబ్రీడ్‌ మోడల్‌పై ఇంట్రెస్ట్‌

తమ ఉద్యోగులు ప్రతి రోజు 40-50 శాతం మంది కార్యాలయం నుంచే పనిచేసే అవకాశం ఉందని ఇన్ఫోసిస్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రిచర్డ్‌ లోబో అంటున్నారు. అంటే ఉద్యోగులంతా హైబ్రీడ్‌ పని విధానంలో ఉంటారు. ప్రస్తుతానికి ఆ కంపెనీలో 96 శాతం మంది రిమోట్‌ లొకేషన్లలో పనిచేస్తున్నారు. కొవిడ్‌ పరిస్థితులు బట్టి రాబోయే 3-4 నెలల్లో దశల వారీగా ఆఫీసులకు వస్తారు. కొందరు పూర్తిగా ఇంటి నుంచే చేస్తారు. మరికొందరు హైబ్రీడ్‌ మోడల్లో ఉంటారు. ప్రస్తుతం మేనేజర్లు, టీమ్ లీడర్లు వారానికి ఒకట్రెండు రోజులు రావాలని ఇన్ఫోసిస్‌ కోరుతోంది.

మొదట సీనియర్లు

ఇప్పుడు టెక్‌ మహీంద్రాలో 18 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి వారానికి కనీసం రెండు రోజులు రావాలని చెబుతోంది. మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ  పరిస్థితులను గమనిస్తోంది. ఇప్పటికైతే హైబ్రీడ్‌ పని విధానంపై తమ స్టాండ్‌ను మార్చుకోలేదు. 'ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమమే హెచ్‌సీఎల్‌కు అత్యంత ప్రాధాన్యం. క్లైయింట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాం. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. హైబ్రీడ్‌ మోడల్‌నే అనుసరిస్తున్నాం' అని కంపెనీ స్పోక్స్‌పర్సన్‌ తెలిపారు.

టీసీఎస్‌ కీలక నిర్ణయం

గత నెల్లో రిమోట్‌ వర్కింగ్‌పై టీసీఎస్‌ (TCS) కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంటి నుంచి పనిచేస్తున్నప్పటికీ బేస్‌ లోకేషన్‌కు రావాలని ఉద్యోగులకు సూచించింది. 25 by 25 దీర్ఘకాల విజన్‌లో భాగంగా 25 శాతం మందిని మాత్రం ఆఫీసులకు రమ్మంటోంది. ఆ తర్వాత హైబ్రీడ్‌ పని విధానాన్ని అమలు చేయనుంది. మార్చి 3 నుంచి పూర్తి స్థాయిలో వాక్సినేషన్‌ పొందిన మేనేజర్లు, టీమ్‌లీడర్లు, సీనియర్లను వారానికి రెండు రోజులు రావాలని విప్రో సూచించింది. మంగళ, గురువారాల్లో వారు రావాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
Construction Ban: నీతి ఆయోగ్ సంచలన ప్రతిపాదన- భారత్‌లో రెండేళ్ల పాటు నిర్మాణాలపై నిషేధం-ఇందులో నిజమెంత?
నీతి ఆయోగ్ సంచలన ప్రతిపాదన- భారత్‌లో రెండేళ్ల పాటు నిర్మాణాలపై నిషేధం - ఇందులో నిజమెంత?
Credit Card Settlement Offer: క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !
క్రెడిట్ కార్డ్ బిల్లు ఓవర్‌డ్యూ ఉందా ? బ్యాంక్ సెటిల్‌మెంట్ ఆఫర్ మీకు లాభమా? నష్టమా !
Pagani Hypercars: డబ్బుంటే సరిపోదు.. పగాని కారు కావాలంటే లక్ కూడా ఉండాలి.. ముఖేష్ అంబానీ కూడా కొనలేని కార్ల కథ!
డబ్బుంటే సరిపోదు.. పగాని కారు కావాలంటే లక్ కూడా ఉండాలి.. ముఖేష్ అంబానీ కూడా కొనలేని కార్ల కథ!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget