అన్వేషించండి

2000 Rupee Notes: ₹2000 నోట్లను పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చా, డిపాజిట్‌ చేయవచ్చా?

రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు ఎలాంటి ఆంక్షలు లేవు.

2000 Rupee Notes Exchange: రెండు వేల రూపాయల నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి మంగళవారం (23 మే 2023) నుంచి ప్రారంభమైంది. అన్ని బ్యాంకుల బ్రాంచ్‌ల్లో పింక్‌ నోట్లను మార్చుకోవచ్చు. రూ. 2 వేల నోట్లను మార్చుకోవడానికి ఎన్నిసార్లయినా క్యూలో నిలబడవచ్చు. పెద్ద నోట్లను బ్యాంక్‌ ఖాతాల్లోనూ డిపాజిట్‌ చేయవచ్చు. రిజర్వ్‌ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనూ రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. 

₹2000 నోట్లను పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చా?
మరి, రూ. 2 వేల నోట్లను పోస్టాఫీసుల్లోనూ మార్చుకోవచ్చా అంటే, ఈసారి నోట్ల మార్పిడికి పోస్టాఫీసులను దూరంగా పెట్టారు. 2000 రూపాయల నోట్లను తీసుకుని పోస్టాఫీస్‌కు వెళితే, ఆ విలువకు సరిపడా చిన్న నోట్లు ఇవ్వరు. కానీ, రెండు వేల రూపాయల నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన నగదే కాబట్టి, వాటిని పోస్టాఫీసు ఖాతాల్లో డిపాజిట్ చేయవచ్చు. దీని కోసం, పోస్టాఫీసులోని మీ ఖాతాకు KYC పూర్తి చేసి ఉండాలి. 

రూ.2 వేల నోట్లను మార్చుకునే ఫెసిలిటీ కేవలం బ్యాంకులు & ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలకే పరిమితమని, పోస్టాఫీసుల్లో అది కుదరదని అధికార వర్గాలు ప్రకటించాయి.

ఆంక్షలు లేవు - ఫారం నింపాల్సిన అవసరం లేదు          
రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు ఎలాంటి ఆంక్షలు లేవు. దీనికి సంబంధించి ఎలాంటి ఫారాన్ని నింపాల్సిన అవసరం లేదు. నోట్ల మార్పిడి విషయంలో, ఒక లావాదేవీలో గరిష్టంగా 10 రెండు వేల రూపాయల నోట్లు లేదా రూ. 20,000 వరకు మార్చుకోవచ్చు. 2000 రూపాయల నోట్లను బ్యాంకు ఖాతాలో కూడా జమ చేయవచ్చు, దీనికి ఎటువంటి కొత్త నిబంధనలు లేవు. 2 వేల నోట్ల డిపాజిట్ల విలువ రూ. 50 వేలకు మించితే, బ్యాంక్‌కు కచ్చితంగా పాన్ కార్డు ఇవ్వాలి. ఇది పాత నిబంధనే.

ఇది కూడా చదవండి: టాక్స్‌ ఫైలింగ్‌ కోసం ఆన్‌లైన్‌ ITR-1, ITR-4 ఫారాలు రెడీ 

2000 రూపాయల నోటును మార్చుకోవడానికి లేదా బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది. 4 నెలల సమయం ఉంది కాబట్టి, నోట్ల మార్పిడి లేదా జమ కోసం ప్రజలు తొందరపడవద్దని, ప్రశాంతంగా వచ్చి లావాదేవీలు పూర్తి చేసుకోవాలని ఆర్‌బీఐ ప్రజలకు సూచించింది.

ఏపీఎస్‌ ఆర్‌టీసీ కీలక నిర్ణయం       
రూ. 2 వేల నోట్లను ఆర్‌బీఐ వెనక్కు తీసుకుంటున్న నేపథ్యంలో, ఏపీఎస్‌ఆర్‌టీసీ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్‌ ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణికుల నుంచి రూ. 2 వేల నోట్లు తీసుకోవద్దని ఉద్యోగులను ఆదేశిస్తూ, ఆర్టీసీ యాజమాన్యం ఒక ఆర్డర్‌ పాస్‌ చేసింది. రూ. 2 వేల నోట్లు కాకుండా ఇతర నోట్లు మాత్రమే తీసుకోవాలని, వీలైతే డిజిటల్‌ చెల్లింపులు స్వీకరించాలని ఆర్‌టీసీ సిబ్బందికి సూచించింది. బస్‌ కండక్టర్లు రూ. 2 వేల నోట్లను డిపోల్లో జమ కోసం తీసుకువస్తే, అది అక్రమ లావాదేవీలను ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని డిపోలకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఏ మ్యూచువల్‌ ఫండ్‌ కరెక్ట్‌? 

టాప్ హెడ్ లైన్స్

Sugar Price Hike: మళ్లీ పెరిగిన చక్కెర ధరలు; ప్రస్తుతం ధర ఎంత ఉందంటే?
మళ్లీ పెరిగిన చక్కెర ధరలు; ప్రస్తుతం ధర ఎంత ఉందంటే?
UPI 10 Years: భారత యూపీఐ చెల్లింపులను అంగీకరించే దేశాలు ఏవి? 
UPI 10 Years: భారత యూపీఐ చెల్లింపులను అంగీకరించే దేశాలు ఏవి? 
Senior Citizen Savings Scheme: సీనియర్ సిటిజన్లకు ప్రతి 3 నెలలకు అకౌంట్లోకి రూ.25,000.. సేఫ్ సేవింగ్ స్కీమ్ పూర్తి వివరాలు
సీనియర్ సిటిజన్లకు ప్రతి 3 నెలలకు అకౌంట్లోకి రూ.25,000.. సేఫ్ సేవింగ్ స్కీమ్ పూర్తి వివరాలు
Gold Price September 2026: సెప్టెంబర్‌లో బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా? కీలక అంచనా!
సెప్టెంబర్‌లో బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా? కీలక అంచనా!

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AE Nookaraju Family Suicide Case: సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Konaseema Fishermen Rescued: వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
Embed widget