అన్వేషించండి

Apple iPhone Fined: ఆపిల్‌కు రూ.165 కోట్ల ఫైన్, సిల్లీ రీజన్‌ చెప్పినందుకు గట్టి మొట్టికాయ

మొదటి వస్తువును కొన్నందుకు రెండో వస్తువును కూడా కూడా కొనేలా వినియోగదారులను బలవంతం చేసే "దుర్వినియోగ పద్ధతి"గా ఆపిల్‌ చర్యను కోర్టు ఆక్షేపించింది.

Apple iPhone Fined: జానెడు మిగిలిద్దామని చూసి, బారెడు పోగొట్టుకోబోతోంది ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఆపిల్‌ (Apple). పర్యావరణ పరిరక్షణ సాకుతో, ఛార్జర్లు ఇవ్వకుండా ఐఫోన్లు (iPhones) అమ్మినందుకు 20 మిలియన్ డాలర్ల జరిమానాను ఈ కంపెనీ కట్టబోతోంది.

ఐఫోన్లతోపాటు ఛార్జర్లు, హెడ్‌సెట్‌లు ఇవ్వనందుకు బ్రెజిల్‌లోని సావో పౌలో సివిల్‌ కోర్టు 100 మిలియన్ రియాస్‌ల (20 మిలియన్‌ డాలర్లు లేదా 165 కోట్ల రూపాయలు) జరిమానా విధించింది. మొదటి వస్తువును కొన్నందుకు రెండో వస్తువును కూడా కూడా కొనేలా వినియోగదారులను బలవంతం చేసే "దుర్వినియోగ పద్ధతి"గా ఆపిల్‌ చర్యను కోర్టు ఆక్షేపించింది. అంతేకాదు, బ్రెజిల్‌లో ఛార్జర్లు, హెడ్‌ఫోన్లు లేకుండా ఐఫోన్లను కొన్నవాళ్లందరినీ వెతికి పట్టుకుని, వాళ్లందరికీ ఆయా పరికరాలను ఉచితంగా అందించాలని కూడా ఆదేశించింది. 

ఛార్జర్‌ విడిగా కొనాలా?
కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతోనే తాము ఛార్జర్లు, హెడ్‌ఫోన్లు లేకుండా ఐఫోన్లు అమ్ముతున్నామ ఆపిల్‌ కోర్టులో వాదించింది. ఆ వాదన మీద న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. "గతంలో అమ్మిన ఐఫోన్లకు ఛార్జర్లు అందిచారుగా, ఇప్పుడెందుకు ఇవ్వట్లేదు. ఐఫోన్‌ కొన్నవాళ్లు ఛార్జర్‌ను మళ్లీ విడిగా కొనాలన్నదేగా మీ ఉద్దేశం. మీ అమ్మకాలు పెంచుకోవడానికి వినియోగదారులు మీద ఆర్థిక భారం వేస్తారా?, ఇది సరైన పద్ధతి కాదు" అని కోర్టు పేర్కొంది. 

కోర్టు ఆదేశం ప్రకారం ఆపిల్‌ ఇటు ఫైన్‌ కట్టాలి, అటు.. ఇప్పటికే ఐఫోన్లు కొన్నవాళ్లందరికీ వాటిని ఫ్రీగా అందించాల్సి ఉంటుంది. రెంటికీ చెడ్డ రేవడిలా మారింది దాని పరిస్థితి. 

అయితే, సావో పౌలో సివిల్‌ కోర్టు ఆదేశంపై తాము పైకోర్టులో అప్పీల్‌ చేస్తామని ఆపిల్‌ చెప్పినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది.

గతంలోనూ ఫైన్‌
2020 అక్టోబర్‌లో, అప్పుడు వచ్చిన కొత్త ఐఫోన్లతోపాటు ఔట్‌లెట్‌ ఛార్జర్‌లను ఇవ్వడం ఆపిల్ ఆపేసింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడంలో కంపెనీ సాయం చేయాలనుకుంటున్నట్లు అప్పట్లో పేర్కొంది. ఐఫోన్‌తోపాటు ఛార్జర్‌ ఇవ్వనందుకు జనాగ్రహం వ్యక్తమైంది. ప్రభుత్వానికి పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆపిల్‌ నిర్ణయం మీద బ్రెజిల్‌ ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఛార్జర్‌ లేకుండా ఐఫోన్లు అమ్ముతోందని, బ్రెజిల్ న్యాయ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్‌లో ఆపిల్‌కు దాదాపు 2.5 మిలియన్‌ డాలర్ల ప్రత్యేక జరిమానా విధించింది. అంతేకాదు, iPhone 12, 13 మోడళ్లను ఛార్జర్‌లు లేకుండా విక్రయించకుండా నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయం మీద సావో పాలో సివిల్ కోర్టులో ఆపిల్‌ అప్పీల్ చేసి, అక్కడ కూడా మొట్టికాయలు గట్టిగా వేయించుకుంది.

స్పెషల్‌ ఛార్జర్‌ వల్లే వివాదం
ఐరోపా సమాఖ్యతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు మొబైల్‌ ఫోన్లలో USB-C (C టైప్‌) ఛార్జింగ్‌ పోర్ట్‌ను తప్పనిసరి చేశాయి. మన దేశంలోనూ ఇప్పుడొచ్చే అన్ని స్మార్ట్‌ ఫోన్లూ C టైప్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌తోనే వస్తున్నాయి. C టైప్‌ ఛార్జర్‌ మన దగ్గర ఉంటే చాలు, మొబైల్‌ కంపెనీతో సంబంధం లేకుండా ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. అయితే, ఆపిల్‌ విషయంలో ఇది కుదరదు. ఈ కంపెనీ ఇప్పటికీ తన సొంత పోర్టునే ఫోన్లలో ఉపయోగిస్తోంది. కాబట్టి, ఆపిల్‌ ఛార్జర్లతోనే ఐఫోన్లను ఛార్జ్‌ చేయగలం. ఈ విషయంలోనే ఆపిల్‌ చిక్కులు ఎదుర్కొంటోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget