అన్వేషించండి

₹2000 Notes: ATMల్లో ₹2000 నోట్లను ఎందుకు ఉంచడం లేదు?

పింక్‌ కలర్‌ నోటు సాధారణ ప్రజల కళ్లకు కనిపించడం మానేసింది.

2000 Rupees Currency Notes in ATMs: మీరు చివరిసారిగా ATM నుంచి డబ్బుని విత్‌డ్రా చేయడానికి ఎప్పుడు వెళ్లారో గుర్తుంచుకోండి. డబ్బు విత్‌డ్రా చేసిన తర్వాత మీకు 2000 రూపాయల నోట్లు వచ్చాయా?. పోనీ మార్కెట్‌లో మీరు క్రయవిక్రయాలు చేసినప్పుడు గానీ, ఇతర వ్యక్తుల నుంచి గానీ ఈ పెద్ద నోట్లు మీ చేతికి వచ్చాయా? ఈ ప్రశ్నను వేస్తే చాలా మంది సమాధానం చెప్పడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే, దేశ జనాభాలో పెద్ద వాటా ఉన్న సాధారణ ప్రజలు 2000 రూపాయల నోట్లు చూసి చాలా కాలమైంది. ఈ నోట్లు అరుదుగా మాత్రమే మార్కెట్‌లో కనిపిస్తున్నాయని చెబుతున్నారు. 

2000 రూపాయల నోటును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయలేదు, అది ఇప్పటికీ చట్టబద్ధమైన ద్రవ్యంగా చలామణీలోనే ఉంది. అయినా, పింక్‌ కలర్‌ నోటు సాధారణ ప్రజల కళ్లకు కనిపించడం మానేసింది. ఇదే విషయం దేశ పార్లమెంటులో చర్చకు వచ్చింది. 2000 రూపాయల నోట్లను ఏటీఎంల ద్వారా ఇవ్వొద్దని ఆర్‌బీఐ నిర్దేశించిందా అన్న ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది.

ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదట    
ఏటీఎంల ద్వారా రూ. 2000 నోట్ల పంపిణీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిషేధిస్తూ బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసిందా అని లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ సంతోష్ కుమార్ ఆర్థిక శాఖను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లలో (ATMలు) రూ. 2000 నోట్లను నింపడం, నింపకపోవడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని బ్యాంకులకు ఎలాంటి ఆదేశం ఇవ్వలేదని తన సమాధానంలో ఆర్థిక మంత్రి వెల్లడించారు. గత వినియోగం, వినియోగదారుల అవసరాలు, సీజనల్ ట్రెండ్‌లను దృష్టిలో ఉంచుకుని ఏటీఎంలలో ఉంచాల్సిన మొత్తం, డినామినేషన్‌ను బ్యాంకులే నిర్ణయిస్తాయని వివరించారు.

2000 రూపాయల డినామినేషన్ నోట్ల ముద్రణపై ఆర్‌బీఐ ఎప్పటి నుంచి నిషేధం విధించిందని ఆర్థిక మంత్రిని లోక్‌సభ సభ్యుడు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానమిస్తూ... ఆర్‌బీఐ వార్షిక నివేదిక ప్రకారం, 2019-20 నుంచి రూ. 2000 డినామినేషన్ నోట్ల సరఫరాకు డిమాండ్ లేదని చెప్పారు. అంతకుముందు డిసెంబర్ 2021లో కూడా ఇదే విషయంపై పార్లమెంటులో చర్చ వచ్చింది. 2018-19లో రూ. 2,000 నోట్ల ముద్రణకు సంబంధించి ఎలాంటి తాజా ఉత్తర్వులు ఇవ్వలేదని, అందుకే రూ. 2,000 నోట్ల సంఖ్య తగ్గిందని అప్పట్లో ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.

ఐదేళ్లలో 3 రెట్లు పెరిగిన పెద్ద నోట్లు
కొన్ని రిపోర్టుల ప్రకారం... 9.21 లక్షల కోట్ల రూపాయల విలువైన రూ. 500, రూ. 2000 రూపాయల నోట్లు చెలామణిలో లేవు, ఈ కరెన్సీ నోట్లను నల్లధనంగా మార్చారా? అన్న మరో ప్రశ్నకు ఆర్థిక మంత్రి స్పందించారు. అటువంటి సమాచారం ప్రభుత్వం వద్ద అందుబాటులో లేదని చెప్పారు. ఆర్‌బీఐ వార్షిక నివేదిక ప్రకారం మార్చి 2017 చివరి నాటికి రూ. 9.512 లక్షల కోట్ల విలువైన రూ. 500, రూ. 2000 నోట్లు చలామణిలో ఉన్నాయని, 2022 మార్చి నాటికి అది రూ. 27.057 లక్షల కోట్లకు పెరిగిందని నిర్మలమ్మ చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Telugu TV Movies Today: డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Embed widget