అన్వేషించండి

Electric offers: మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్నారా? ఛార్జర్ డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తారట - ఎందుకంటే?

ఓటీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఛార్జర్ కోసం చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఓలా కంపెనీ ఈ డబ్బును ఎందుకు వెనక్కి ఇస్తోందంటే?

గడిచిన కొంత కాలంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. పెట్రో ధరల పెరుగుదల, పొల్యూషన్ ప్రీ జర్నీ పట్ల ప్రజల్లో అవగాహన వస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీల్లో ఓలా దేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. ఈ కంపెనీకి చెందిన స్కూటర్లను పెద్ద సంఖ్యలో వినియోగదారులు కొనుగోలు చేశారు. మంచి ఫీచర్లు, అంతకు మించి బ్యాటరీ లైఫ్, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయడం లాంటి వెసులుబాటు ఉంటడంతో ఓలా స్కూటర్ల పట్ల వినియోగదారులు బాగా ఆకర్షితులయ్యారు.

ఓలా వినియోగదారులకు గుడ్ న్యూస్

తాజాగా ఓలా కంపెనీ తమ స్కూటర్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. బైక్ ఛార్జర్ కోసం చెల్లించిన డబ్బులను వెనక్కి తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఇప్పటికే ఓలా తమ కస్టమర్లకు రీఫండ్ చేయడం మొదలు పెట్టింది. ఆయా మోడల్స్ ను బట్టి రూ. 9 వేల నుంచి రూ.19 వేల వరకు వెనక్కి ఇస్తున్నట్లు తెలిపింది. స్కూటర్ కొనుగోలు సమయంలో ఛార్జర్ కోసం ఈ డబ్బును తీసుకుంది.  

కేంద్రం హెచ్చరికతో వెనక్కి తగ్గిన ఓలా

ఓలా ఈ డబ్బును రీఫండ్ చేయడం వెనుక పెద్ద స్టోరీ ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల నుంచి వసూలు చేసిన ఛార్జర్ డబ్బులను తిరిగి వారికి ఇచ్చిన తర్వాతే, కంపెనీకి సబ్సిడీ డబ్బులు పూర్తిగా లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం కండీషన్ పెట్టింది. దీంతో డబ్బులు వెనక్కి ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఓలా కంపెనీ చార్జర్‌ను యాడ్ ఆన్ సర్వీస్ కింద వినియోగదారులకు అందించింది. చార్జర్ ధరను స్కూటర్ ధరలో యాడ్ చేయలేదు.  ఈ నేపథ్యంలో ఛార్జర్ కోసం కస్టమర్లు ఆయా మోడల్ ను బట్టి రూ. 9 నుంచి రూ. 19 వేల వరకు అదనంగా చెల్లించారు. ఈ పద్దతిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఛార్జర్ ను వేరేగా అమ్మితే సబ్సిడీ పొందలేరని తేల్చి చెప్పింది. ఛార్జర్ ను విడిగా కొనుగోలు చేసిన వారికి డబ్బు రీఫండ్ చేయాలని తేల్చి చెప్పింది. అలా చేయని నేపథ్యంలో సబ్సిడీ ఇవ్వమని వెల్లడించింది. దీంతో ఓలా కంపెనీ వినియోగదారులకు ఛార్జర్ డబ్బులను రీఫండ్ చేయడం మొదలుపెట్టింది.

లక్ష మంది వినియోగదారులకు రీఫండ్ చేయనున్న ఓలా    

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా సుమారు లక్ష మంది వినియోగదారులకు ఛార్జర్లు ఎలక్ట్రిక్ స్కూటర్ తో కాకుండా విడిగా అమ్మినట్లు ఓలా కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. వారందరికీ డబ్బులు వాపసు ఇచ్చేస్తామని చెప్పింది. అంతేకాదు, ఈ ఏడాది మార్చి నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్, చార్జర్ ను కలిపి విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి తమ వినియోగదారులకు ఛార్జర్ డబ్బులను  రీఫండ్ చేయడం మొదలు పెట్టింది ఓలా. సుమారు రూ. 130 కోట్ల రూపాయలను రీఫండ్ చేయనుంది.

Read Also: ఈ వేసవిలో మీ కార్లను ఇలా కాపాడుకోండి!

టాప్ హెడ్ లైన్స్

Renault Kiger, Triber, Kwidపై అద్భుతమైన ఆఫర్లు - వేల రూపాయలు ఆదా, ఇది పరిమిత కాల ఆఫర్‌
కొత్త కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌ - రూ.68,000 వరకు డిస్కౌంట్లు ప్రకటించిన రెనాల్ట్‌
Maruti Suzuki Celerio EMI Calculator: 50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు
యమహా R15 V4, MT-15 మోటోజీపీ ఎడిషన్లు లాంచ్‌.. అచ్చం 'రేస్‌ బైక్‌'ను చూసినట్లే ఉంది
TVS స్కూటర్ల ధరలు పెంపు.. పాపులర్‌ మోడళ్ల రేట్లు ఏకంగా రూ.11,000 వరకు హైక్‌, ఇదిగో లిస్ట్‌
TVS స్కూటర్‌ కొనేవాళ్లకు షాక్‌! iQube నుంచి Jupiter వరకు వేలల్లో పెరిగిన ధరలు - కొత్త రేట్లు ఇవే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
Embed widget