అన్వేషించండి

Electric offers: మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్నారా? ఛార్జర్ డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తారట - ఎందుకంటే?

ఓటీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఛార్జర్ కోసం చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఓలా కంపెనీ ఈ డబ్బును ఎందుకు వెనక్కి ఇస్తోందంటే?

గడిచిన కొంత కాలంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. పెట్రో ధరల పెరుగుదల, పొల్యూషన్ ప్రీ జర్నీ పట్ల ప్రజల్లో అవగాహన వస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీల్లో ఓలా దేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. ఈ కంపెనీకి చెందిన స్కూటర్లను పెద్ద సంఖ్యలో వినియోగదారులు కొనుగోలు చేశారు. మంచి ఫీచర్లు, అంతకు మించి బ్యాటరీ లైఫ్, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయడం లాంటి వెసులుబాటు ఉంటడంతో ఓలా స్కూటర్ల పట్ల వినియోగదారులు బాగా ఆకర్షితులయ్యారు.

ఓలా వినియోగదారులకు గుడ్ న్యూస్

తాజాగా ఓలా కంపెనీ తమ స్కూటర్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. బైక్ ఛార్జర్ కోసం చెల్లించిన డబ్బులను వెనక్కి తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఇప్పటికే ఓలా తమ కస్టమర్లకు రీఫండ్ చేయడం మొదలు పెట్టింది. ఆయా మోడల్స్ ను బట్టి రూ. 9 వేల నుంచి రూ.19 వేల వరకు వెనక్కి ఇస్తున్నట్లు తెలిపింది. స్కూటర్ కొనుగోలు సమయంలో ఛార్జర్ కోసం ఈ డబ్బును తీసుకుంది.  

కేంద్రం హెచ్చరికతో వెనక్కి తగ్గిన ఓలా

ఓలా ఈ డబ్బును రీఫండ్ చేయడం వెనుక పెద్ద స్టోరీ ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల నుంచి వసూలు చేసిన ఛార్జర్ డబ్బులను తిరిగి వారికి ఇచ్చిన తర్వాతే, కంపెనీకి సబ్సిడీ డబ్బులు పూర్తిగా లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం కండీషన్ పెట్టింది. దీంతో డబ్బులు వెనక్కి ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఓలా కంపెనీ చార్జర్‌ను యాడ్ ఆన్ సర్వీస్ కింద వినియోగదారులకు అందించింది. చార్జర్ ధరను స్కూటర్ ధరలో యాడ్ చేయలేదు.  ఈ నేపథ్యంలో ఛార్జర్ కోసం కస్టమర్లు ఆయా మోడల్ ను బట్టి రూ. 9 నుంచి రూ. 19 వేల వరకు అదనంగా చెల్లించారు. ఈ పద్దతిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఛార్జర్ ను వేరేగా అమ్మితే సబ్సిడీ పొందలేరని తేల్చి చెప్పింది. ఛార్జర్ ను విడిగా కొనుగోలు చేసిన వారికి డబ్బు రీఫండ్ చేయాలని తేల్చి చెప్పింది. అలా చేయని నేపథ్యంలో సబ్సిడీ ఇవ్వమని వెల్లడించింది. దీంతో ఓలా కంపెనీ వినియోగదారులకు ఛార్జర్ డబ్బులను రీఫండ్ చేయడం మొదలుపెట్టింది.

లక్ష మంది వినియోగదారులకు రీఫండ్ చేయనున్న ఓలా    

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా సుమారు లక్ష మంది వినియోగదారులకు ఛార్జర్లు ఎలక్ట్రిక్ స్కూటర్ తో కాకుండా విడిగా అమ్మినట్లు ఓలా కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. వారందరికీ డబ్బులు వాపసు ఇచ్చేస్తామని చెప్పింది. అంతేకాదు, ఈ ఏడాది మార్చి నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్, చార్జర్ ను కలిపి విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి తమ వినియోగదారులకు ఛార్జర్ డబ్బులను  రీఫండ్ చేయడం మొదలు పెట్టింది ఓలా. సుమారు రూ. 130 కోట్ల రూపాయలను రీఫండ్ చేయనుంది.

Read Also: ఈ వేసవిలో మీ కార్లను ఇలా కాపాడుకోండి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Embed widget