అన్వేషించండి

Mahindra XUV 400 EV: మహీంద్రా నుంచి తొలి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్, విడుదల ఎప్పుడంటే?

దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా.. ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తొలి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ ను త్వరలో విడుదల చేయనుంది.

ఇండియన్ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల వైపు దృష్టి మళ్లిస్తోంది. ఈ  విభాగంలో రాణించేందుకు కీలక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే  ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ‌ కార్లను పరిచయం చేసిన ఈ కంపెనీ.. . ఎలక్ట్రిక్ XUV 400  మోడల్‌ను సెప్టెంబర్ 8న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో ఎక్స్‌యూవీ 400 మొదటి ఎలక్ట్రిక్ వెహికల్.  కావడం గమనార్హం. మిడ్ సైజ్‌లో పాపులరైన XUV 300కు ఎలక్ట్రిక్ వెర్షన్‌గా XUV 400 రాబోతుంది.

ఆనంద్ మహీంద్రా ట్వీట్

ఎలక్ట్రిక్ XUV 400  విడుదలకు సంబంధించిన  విషయాన్ని  కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆయన  వీడియోను షేర్ చేశారు.  XUV400 ఎలక్ట్రిక్ సెప్టెంబర్ 8న విడుదల అవుతుందని వెల్లడించారు.  XUV 300తో పోలిస్తే ఎలక్ట్రిక్ XUV  ఇంకా  పొడవుతో వస్తుందని కంపెనీ వెల్లడించింది.  XUV 400 ఎలక్ట్రిక్ వాహనం.. మహీంద్రా XUV700లోని సరికొత్త టెక్ అండ్ ADAS ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ DRLలతో కూడిన కొత్త హెడ్‌లైట్, క్లోజ్డ్ ఆఫ్ ఫ్రంట్ గ్రిల్, టెయిల్ ల్యాంప్స్ కోసం కొత్త డిజైన్, రీప్రొఫైల్డ్ టెయిల్‌గేట్ వంటి కొన్ని డిజైన్ అప్‌గ్రేడ్స్ రాబోయే ఈవీలో ఉండే అవకాశం ఉంది.  XUV 400కు సంబంధించి  రీడిజైన్ లైటింగ్ ఎలిమెంట్‌లతో అప్‌డేట్ అయిన LED టైల్‌లైట్ ఉన్నట్లు నిర్ధారించింది. XUV 400లో ఇన్ఫోటైన్‌మెంట్ డ్యూటీస్‌ను హ్యాండిల్ చేయడానికి బ్రాండ్ Adreno X ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, భారీ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌తో ఉండే అవకాశం ఉంది.

టాటా నెక్సాన్ EVకి పోటీ

అటు ఈ  XUV 400 EV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో  150 bhp అవుట్‌ పుట్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తుంది.  ఈ కారు ఒక ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుందని ఆటో మొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక పవర్‌ ట్రెయిన్ స్పెసిఫికేషన్‌పై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. మహీంద్రా XUV 400 EV మోడల్ టాటా నెక్సాన్ EVకు పోటీగా భారత మార్కెట్‌లోకి రానుంది. దీని ధర రూ. 15లక్షలు వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

పాసింజర్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో 5 ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలు

అటు  పాసింజర్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో ఏకంగా ఐదు ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలను తీసుకొచ్చేందుకు మహీంద్ర ప్రయత్నాలు మొదలు పెట్టింది.  ఇందులో భాగంగానే ఐదు వాహనాలను ఆగష్టు 15న ఆవిష్కరించింది. 2024లో తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని, 2026లో మిగిలిన వాహనాలను తీసుకురానున్నట్లు మహీంద్రా కంపెనీ తెలిపింది. భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోకి వీటిని విడుదల చేయనున్నట్లు ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revolt RV1 Electric Bike: ఎలక్ట్రిక్ బైక్‌తో పెట్రోల్ కష్టాలకు చెక్! 1 లక్ష కంటే తక్కువ ధర, మరి రేంజ్..
ఎలక్ట్రిక్ బైక్‌తో పెట్రోల్ కష్టాలకు చెక్! 1 లక్ష కంటే తక్కువ ధర, మరి రేంజ్..
Revolt RV1 Electric Bike: పెట్రోల్ కష్టాలకు చెక్‌ పెట్టే బైక్ వస్తోంది! ధర కూడా లక్ష లోపే!రేంజ్ సహా ఇతర ఫీచర్స్ తెలుసుకోండి! 
పెట్రోల్ కష్టాలకు చెక్‌ పెట్టే బైక్ వస్తోంది! ధర కూడా లక్ష లోపే!రేంజ్ సహా ఇతర ఫీచర్స్ తెలుసుకోండి! 
Mahindra Scorpio N EMI: 4 లక్ష రూపాయల డౌన్ పేమెంట్‌తో మహీంద్రా స్కార్పియో N వస్తుందా? EMI లెక్కలు తెలుసుకోండి!
4 లక్ష రూపాయల డౌన్ పేమెంట్‌తో మహీంద్రా స్కార్పియో N వస్తుందా? EMI లెక్కలు తెలుసుకోండి!
Hyundai Creta EMI: 3 లక్షల డౌన్ పేమెంట్‌తో హ్యుందాయ్ క్రెటా కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి? పూర్తి లెక్క తెలుసుకోండి!
3 లక్షల డౌన్ పేమెంట్‌తో హ్యుందాయ్ క్రెటా కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి? పూర్తి లెక్క తెలుసుకోండి!

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 60 దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 60 దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Manchu Manoj Wedding Anniversary: మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Embed widget