అన్వేషించండి

బాబా వంగా చెప్పినవన్నీ నిజమవుతాయా? 2023లో జరగబోయే భయానక ఘటనలేమిటీ?

బాబా వంగా చెప్పినవన్నీ దాదాపు నిజమయ్యాయి. అందుకే, ఆమె భవిష్యవాణికి అంత పవర్. మరి ఆమె 2023 గురించి ఏం చెప్పింది?

ప్రపంచంలో చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు భవిష్య వాణి చెప్పారు. అలాంటి వారిలో బల్గేరియా ఆధ్యాత్మికవేత్త బాబా వంగా ఒకరు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి 1996లో ఆమె మరణం వరకు కూడా బాబా వంగా భవిష్యత్తును కచ్చితంగా అంచనా వేశారు. అందుకే ఆమెను నోస్ట్రాడామస్ తో పోల్చారు.

కమ్యూనికేషన్ వ్యవస్థ మీద సౌరతుఫాన్ ప్రభావం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది 1859 నాటి సంఘటన ఒక ఉదాహారణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒక వేళ సౌరతుఫాను కనుక వస్తే అది సంవత్సరాల పాటు కొనసాగే అతి పెద్ద బ్లాకవుట్లకు కారణం కాగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. బాబా వంగా 2023కు సంబంధించి ఇలాంటి అనేక విషయాలను తన భవిష్యవాణిలో ప్రస్తావించారని చెబుతున్నారు.

భూకక్ష్యా మారిపోతుంది

ప్రస్తుతం సూర్యుని చుట్టూ తిరుగుతున్న కక్ష్య నుంచి 2023లో మారుతుందని బాబా వంగా ప్రిడిక్ట్ చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. ఇది భూమి మీద నివసిస్తున్న ప్రాణుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ప్రతి ఏడాది 582 మిలియన్ మైళ్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఇది ఒక దీర్ఘవృత్తాకార కక్ష్య. ఇలా కక్ష్య ఆకారం ఏర్పడడానికి సౌరకుటుంబంలోని ఇతర గ్రహాల బలాబలాల మీద ఆదారపడి ఏర్పడింది. ప్రస్తుతం ఆ గ్రహబలాల కారణంగానే భూకక్ష్య మారవచ్చు. మార్పులు ఎలాంటివైనా సక్రీయ పద్ధతిలో మాత్రమే జరుగుతాయి. అతి చిన్న మార్పులు కూడా మన భూవాతావరణం మీద పెను మార్పులకు కారణం కావచ్చు.

జీవ ఆయుధాల ప్రయోగం

ఒక దేశం 2023లో జీవ ఆయుధాలకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తుందని బాబా వంగా చెప్పారట. ప్రస్తుత భౌగోళిక రాజకీయ సమస్యలకు సంబంధించిన ఈ అంచనా చాలా ఆందోళన కలిగించే విషయం.

న్యూక్లియర్ ప్లాంట్ లో పేలుడు

ఒక అణు విద్యుత్ ప్లాంట్ లో జరిగే పేలుడు వల్ల విషపూరిత మేఘాలు ఆసియా ఖండాన్ని కప్పేస్తాయని వంగా ప్రిడిక్ట్ చేశారు. ఈ విషపూరిత మేఘాల వల్ల ఆ ప్రాంతంలో తీవ్రమైన అనారోగ్యాలు కలిగే ప్రమాదం ఉంది. అణువిద్యుత్ ప్లాంట్ లో పేలిన ప్రాంతంలో తీవ్రమైన అనారోగ్యాలు వ్యాపించడమే కాదు, ఇతర దేశాలు కూడా అనారోగ్యాల బారిన పడతారని ఆమె చెబుతోంది. ప్రస్తుతం ఉక్రేయిన్లోని జపోరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను రష్యా ఆధీనంలోకి తీసుకోవడం గురించి సర్వత్రా చర్చ సాగుతోంది.

మనుషులు ప్రయోగశాలల్లో జన్మిస్తారు

మనుషులు 2023 నుంచి ప్రయోగశాలల్లో పుడతారని బాబా వంగా అంచనా వేశారు. ఇలాంటి లాబ్ లలో పుట్టబోయే బిడ్డల చర్మ రంగును, తెలివితేటలను తల్లిదండ్రుల ముందుగానే నిర్ణయించుకోవచ్చు. అంటే జీవ ప్రక్రియ మొత్తం ముందుగానే నిర్ణయించబడుతుందని అర్థం. అంతా నియంత్రణలోనే ఉంటుందని బాబా వంగా ఊహించారట.

2022లో వివిధ దేశాలు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటాయని బాబా వంగా భవిష్యవాణి లో చెప్పారు. కొన్ని ప్రాంతాలు తీవ్రమైన వరదలను ఎదుర్కొంటాయిని కూడా ఆమె చెప్పారు. ఇటలీ, పోర్చుగల్ లో కరువు కాటకాలు వస్తాయని ఆమె చెప్పారు.

ఆమె భవిష్యవాణిలో కొన్ని ఫలించినా సరే అవి చాలా ఆందోళనకరంగానూ, భయపెట్టెవిగానూ ఉన్నాయి. మరో వైపు ఆమె భవిష్యవాణి చాలా నిగూఢంగా కూడా ఉంది. అలాగే ఎలాంటి ధృవీకరణలు కూడా లేవు. ఆమె భవిష్యవాణి చాలా వరకు అసంపూర్ణంగా ఉందని కూడా అంటున్నారు. ఆమె అంచనాలు ఫలించకూడదని మాత్రమే మనం ఆశించాలి.

Also Read: నిత్యం తినే ఆహారంలో 5 రకాలైన దోషాలు, మీరు ఎలాంటి భోజనం చేస్తున్నారో తెలుసా!

టాప్ హెడ్ లైన్స్

సింహ రాశి అర్థ సంవత్సర ఫలితాలు 2026 - జూలై నుంచి డిసెంబర్ మధ్య మీ జీవితంలో ఊహించని మార్పులు!
సింహ రాశి అర్థ సంవత్సర ఫలితాలు 2026 - జూలై నుంచి డిసెంబర్ మధ్య మీ జీవితంలో ఊహించని మార్పులు!
17-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
17-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
16-07-2026 గురువారం మీ రాశిఫలాలు!
16-07-2026 గురువారం మీ రాశిఫలాలు!
కర్కాటక రాశి జాతకం జూలై నుంచి డిసెంబర్ 2026 వరకు! ఇల్లు, ఉద్యోగం, డబ్బు విషయంలో ప్రధాన మార్పుల సమయం!
కర్కాటక రాశి జాతకం జూలై నుంచి డిసెంబర్ 2026 వరకు! ఇల్లు, ఉద్యోగం, డబ్బు విషయంలో ప్రధాన మార్పుల సమయం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget