అన్వేషించండి

YSRCP: సురక్షా క్యాంపెయిన్ లో థ్యాంక్యూ జగనన్న, SMS కాంటెస్ట్ ను ప్రారంభిస్తున్న వైసీపీ

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, కార్యక్రమాలకు అర్హత ఉండి ఏదైనా చిన్న చిన్న కారణాలతో ఆగిపోయిన వారికి లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత పార్టిలో అందరిపైనా ఉందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.

YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి మరో ఎస్ ఎమ్ ఎస్ కార్యక్రమాన్ని తలపెట్టింది. జగనన్న సురక్షా కార్యక్రమాల పై లబ్దిదారుల అంగీకారంతో "థాంక్యూ జగనన్న"అంటూ ఎస్ ఎమె ఎస్ ను పంపించేందుకు ఏర్పాట్లు చేసింది.

ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్షా కార్యక్రమాలు..
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, కార్యక్రమాలకు అర్హత ఉండి ఏదైనా చిన్న చిన్న కారణాలతో ఆగిపోయిన వారికి లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత పార్టిలోని అందరిపైనా ఉందని వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్ వి. విజయసాయిరెడ్డి అన్నారు.  తాడేపల్లి  పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో విజయసాయిరెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ క్షేత్రస్థాయి కమిటీల నిర్మాణం, జగనన్న సురక్ష కార్యక్రమాలపై వారికి దిశా నిర్దేశం చేశారు..  జగనన్న సురక్ష కార్యక్రమం గురించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలన్న లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని చెప్పారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై ఒకటి నుండి మండల స్థాయి అధికారులు ఏర్పాటు చేయనున్న శిబిరాల్లో పార్టీ నాయకులు క్రియాశీలకంగా ఉండటం తో పాటుగా  శిబిరాల్లో పాల్గొనాలని చెప్పారు.  అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి క్యాంపులో పార్టీకి కీలక నేతలు క్రియాశీలకంగా పాల్గొనేలాగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు చూడాలని సూచించారు.. 

శాసన సభ్యులు కీలకంగా ఉండాలి...
ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గ పరిధిలోని సచివాలయాల్లో నిర్వహించే శిబిరాల్లో పాల్గొనాలని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్ వి. విజయసాయిరెడ్డి  చెప్పారు. ప్రజలందరిని ఈ శిబిరాలకు ఆహ్వానించి సురక్ష కార్యక్రమం గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా అర్బన్ అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో ఈ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జగనన్న సురక్ష క్యాంపు  ప్రారంభానికి ముందు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విలేఖరుల సమావేశం నిర్వహించాలని వారికి సూచించారు.. ధ్రువీకరించబడిన మూడో జాబితా గృహ సారధులందరూ జగనన్న సురక్ష ప్రచారంలో చురుగ్గా పాల్గొనేలాగా ఎమ్మెల్యేలు కోఆర్డినేట్లు చూడాలన్నారు..

అదే సమయంలో "థాంక్యూ జగనన్న"
సర్కార్ తో పాటుగా పార్టి కూడ సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగ తీసుకొని నడిపించటంతో ప్రజల్లో భరోసా కలుగుతుందని విజయ సాయి అభిప్రాయపడ్డారు.  సురక్ష క్యాంపెయినింగ్ సమయంలో పథకాలు లేదా పత్రాలకు సంబంధించి తమకు ఎలాంటి సమస్యలు లేవని పౌరులు పేర్కొంటే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ప్రజలు తమ  ప్రశంసలు పంచుకోవడానికి "థాంక్యూ జగనన్న" అని టైప్ చేసి 9052690526 నంబర్ కు ఎస్.ఎం.ఎస్ పంపించేలా చూడలని వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్ వి. విజయసాయిరెడ్డి పార్టి శ్రేణులకు పిలుపునిచ్చారు.

పార్డీ కమిటీల ప్రతిపాదనలను జూలై -3 లోపు పంపండి.
పార్టి అనుబంధ విభాగాల పటిష్టతతోనే పార్టీ బలోపేతం చేసుకోగలమని విజయసాయి రెడ్డి అన్నారు. వైసీపీ అనుబంధ విభాగ కమిటీల ప్రతిపాదనలలను జూలై మూడు లోపు తప్పనిసరిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి సమర్పించాలని ఆయన ఈ టెలికాన్ఫరెన్స్ లో విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 18 జిల్లాల నుంచి కమిటీల జాబితాలను కేంద్ర కార్యాలయానికి సమర్పించారని మిగిలిన 8 జిల్లాల కమిటీల జాబితాలను సమర్పించాలని ఆయన కోరారు. అలాగే పార్టీ(నగర కార్పొరేషన్) కమిటీలకు సంబంధించిన ప్రతిపాదలను కూడా త్వరగా పంపించాలని  పార్టి శ్రేణులకు సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget