అన్వేషించండి

YSRCP: సురక్షా క్యాంపెయిన్ లో థ్యాంక్యూ జగనన్న, SMS కాంటెస్ట్ ను ప్రారంభిస్తున్న వైసీపీ

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, కార్యక్రమాలకు అర్హత ఉండి ఏదైనా చిన్న చిన్న కారణాలతో ఆగిపోయిన వారికి లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత పార్టిలో అందరిపైనా ఉందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.

YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి మరో ఎస్ ఎమ్ ఎస్ కార్యక్రమాన్ని తలపెట్టింది. జగనన్న సురక్షా కార్యక్రమాల పై లబ్దిదారుల అంగీకారంతో "థాంక్యూ జగనన్న"అంటూ ఎస్ ఎమె ఎస్ ను పంపించేందుకు ఏర్పాట్లు చేసింది.

ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్షా కార్యక్రమాలు..
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, కార్యక్రమాలకు అర్హత ఉండి ఏదైనా చిన్న చిన్న కారణాలతో ఆగిపోయిన వారికి లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత పార్టిలోని అందరిపైనా ఉందని వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్ వి. విజయసాయిరెడ్డి అన్నారు.  తాడేపల్లి  పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో విజయసాయిరెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ క్షేత్రస్థాయి కమిటీల నిర్మాణం, జగనన్న సురక్ష కార్యక్రమాలపై వారికి దిశా నిర్దేశం చేశారు..  జగనన్న సురక్ష కార్యక్రమం గురించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలన్న లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని చెప్పారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై ఒకటి నుండి మండల స్థాయి అధికారులు ఏర్పాటు చేయనున్న శిబిరాల్లో పార్టీ నాయకులు క్రియాశీలకంగా ఉండటం తో పాటుగా  శిబిరాల్లో పాల్గొనాలని చెప్పారు.  అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి క్యాంపులో పార్టీకి కీలక నేతలు క్రియాశీలకంగా పాల్గొనేలాగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు చూడాలని సూచించారు.. 

శాసన సభ్యులు కీలకంగా ఉండాలి...
ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గ పరిధిలోని సచివాలయాల్లో నిర్వహించే శిబిరాల్లో పాల్గొనాలని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్ వి. విజయసాయిరెడ్డి  చెప్పారు. ప్రజలందరిని ఈ శిబిరాలకు ఆహ్వానించి సురక్ష కార్యక్రమం గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా అర్బన్ అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో ఈ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జగనన్న సురక్ష క్యాంపు  ప్రారంభానికి ముందు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విలేఖరుల సమావేశం నిర్వహించాలని వారికి సూచించారు.. ధ్రువీకరించబడిన మూడో జాబితా గృహ సారధులందరూ జగనన్న సురక్ష ప్రచారంలో చురుగ్గా పాల్గొనేలాగా ఎమ్మెల్యేలు కోఆర్డినేట్లు చూడాలన్నారు..

అదే సమయంలో "థాంక్యూ జగనన్న"
సర్కార్ తో పాటుగా పార్టి కూడ సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగ తీసుకొని నడిపించటంతో ప్రజల్లో భరోసా కలుగుతుందని విజయ సాయి అభిప్రాయపడ్డారు.  సురక్ష క్యాంపెయినింగ్ సమయంలో పథకాలు లేదా పత్రాలకు సంబంధించి తమకు ఎలాంటి సమస్యలు లేవని పౌరులు పేర్కొంటే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ప్రజలు తమ  ప్రశంసలు పంచుకోవడానికి "థాంక్యూ జగనన్న" అని టైప్ చేసి 9052690526 నంబర్ కు ఎస్.ఎం.ఎస్ పంపించేలా చూడలని వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్ వి. విజయసాయిరెడ్డి పార్టి శ్రేణులకు పిలుపునిచ్చారు.

పార్డీ కమిటీల ప్రతిపాదనలను జూలై -3 లోపు పంపండి.
పార్టి అనుబంధ విభాగాల పటిష్టతతోనే పార్టీ బలోపేతం చేసుకోగలమని విజయసాయి రెడ్డి అన్నారు. వైసీపీ అనుబంధ విభాగ కమిటీల ప్రతిపాదనలలను జూలై మూడు లోపు తప్పనిసరిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి సమర్పించాలని ఆయన ఈ టెలికాన్ఫరెన్స్ లో విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 18 జిల్లాల నుంచి కమిటీల జాబితాలను కేంద్ర కార్యాలయానికి సమర్పించారని మిగిలిన 8 జిల్లాల కమిటీల జాబితాలను సమర్పించాలని ఆయన కోరారు. అలాగే పార్టీ(నగర కార్పొరేషన్) కమిటీలకు సంబంధించిన ప్రతిపాదలను కూడా త్వరగా పంపించాలని  పార్టి శ్రేణులకు సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget