అన్వేషించండి

YSRCP MP: ఏపీలో 199 మంది పోలీసు అధికారులను పక్కన పెట్టారు - కేంద్రానికి ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీ

Police officers: ఏపీలో పోలీస్ ఆఫీసర్స్ కు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారని వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రధాని సహా పలువురికి ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు.

YSRCP MP writes to PM over harassment on police officers in AP:   ఆంధ్రప్రదేశ్‌లోని 199 మంది సీనియర్ పోలీసు అధికారులపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని  వైసీపీ ఎంపీ గురుమార్తి  ప్రధాని సహా పలువురికి ఫిర్యాదు చేశారు.   భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. విజయానంద్ , డిజిపి హరీష్ కుమార్ గుప్తాలకు  లేఖ  పంపారు.  జూన్ 2024 నుండి పోస్టింగ్‌లు లేదా జీతాలు లేకుండా  199 మంది సీనియర్ పోలీసు అధికారులు ఉన్నారన్నారు.                        

ఈ 199 మంది అధికారులలో 4 మంది ఐపీఎస్ అధికారులు, 4 మంది నాన్-క్యాడర్ పోలీసు సూపరింటెండెంట్లు, 1 ఏపీఎస్పీ కమాండెంట్, 27 మంది అదనపు ఎస్పీలు, 42 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు (డీఎస్పీలు) (సివిల్ , ఏపీఎస్పీ),   119 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారని తెలిపారు.  . వారందరినీ వేకెన్సీ రిజర్వ్ (VR) జాబితాలో ఉంచారని..  ఎటువంటి అధికారిక పోస్టింగ్‌లు, బాధ్యతలు  వేతనం లేకుండా మంగళగిరిలోని DGP కార్యాలయానికి ఏకపక్షంగా అటాచ్ చేశారని  ఆరోపించారు.                   

ఈ అధికారులు రోజుకు రెండుసార్లు ఆఫీసులో పంచ్చేస్తున్నారని..  వారి స్వంత ఖర్చుతో అద్దె వసతి గృహాలలో నివసిస్తున్నారని తెలిపారు.   ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలంగా జీతం చెల్లించలేదని డాక్టర్ గురుమూర్తి  ఆవేదన వ్యక్తం చేశారు.  వారిపై ఎటువంటి శాఖాపరమైన లేదా చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో లేవని అయినప్పటికీ వారికి జీతాలు చెల్లించడం లేదన్నారు.  అదే సమయంలో వారికి  బందోబస్తు విధులు కేటాయిస్తున్నారని.. కానీ    ఎటువంటి వాహనాలు, భత్యాలు  ఇవ్వడం లేదన్నారు.  రాజకీయ బందోబస్తు, VIP విధులు , ప్రజా కార్యక్రమాలకు అనధికారికంగా  ఉపయోగించుకుంటున్నారని  దీనివల్ల అవమానాలు , తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు.  

ఏపీ ప్రభుత్వం ఇలా చేయడం ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16, 21 ప్రకారం విరుద్ధమన్నారు.  ప్రకాష్ సింగ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా (2006)లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించిదని  ఆరోపించారు.  పోస్టింగ్‌లను పునరుద్ధరించడానికి, పెండింగ్‌లో ఉన్న జీతాలు , ప్రయోజనాలను విడుదల చేయించాలని బాధిత అధికారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.  

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget