News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

YSRCP MLA : భువనేశ్వరి కాళ్లు కన్నీటితో కడుగుతాం.. గౌరవసభలు విరమించుకోవాలన్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే !

ప్రజా గౌరవ సభలను టీడీపీ విరమించుకోవాలని.. అసెంబ్లీ పరిణామాలపై భువనేశ్వరి బాధపడితే కన్నీళ్లతో ఆమె కాళ్లు కడుగుతామని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రకటించారు.

FOLLOW US: 
Share:


తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  గౌరవ సభలపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు తన సతీమణిని రాజకీయాల కోసం ఉపయోగించుకుటున్నారంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రజా గౌరవ సభల పేరుతో మా అందరికీ సోదరి సమానులైన చంద్రబాబు సతీమణి శీలాన్ని బజారుకీడ్చడం బాధాకరని వ్యాఖ్యానించారు. ఒక మహిళను ఇలాంటి సభల ద్వారా మరింత బాధపెట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.

Also Read : అన్నమయ్య ప్రాజెక్ట్ ఘటనపై రచ్చ ! విచారణకు టీడీపీ డిమాండ్..దిగజారుడు రాజకీయమన్న వైఎస్ఆర్‌సీపీ !

భువనేశ్వరి అక్క.. తనని అనరాని మాటలు అని, వ్యక్తిత్వాన్ని కించపరిచారని భావించి ఉంటే.. ఆమె అనుమతి ఇస్తే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలమంతా కలిసి కన్నీటితో కాళ్ళు కడుగుతామని తెలిపారు.  వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అయినా.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయినా తమందరికీ.. ఒకే గౌరవమని రాచమల్లు చెప్పుకొచ్చారు. ఎవరు ఏ మహిళను కించపరిచినా అది తప్పేనంటూ వ్యాఖ్యానించారు. ఆనాడు సత్యహరిశ్చంద్రుడు ఇచ్చిన మాటకోసం భార్యను చక్రవర్తి ఇంటికి పనికి పంపిన ఘటనతో నేడు ప్రజా గౌరవ సభల అంశాన్ని పోల్చారు రాచమల్లు.  

Also Read: వీఆర్వోలను తరిమికొట్టండి...మంత్రి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు... మంత్రిని బర్తరఫ్ చేయాలని వీఆర్వోలు డిమాండ్

నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారాన్ని ముగించాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మొదట వివాదాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వేదికగా భువనేశ్వరికి పలుమార్లు క్షమాపణలు చెప్పారు. వివాదాన్ని ముగించాల్సింది చంద్రబాబేనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ నేతలు మాత్రం తాము ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ప్రజా గౌరవ సభలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు మహిళలను ఎలా కించ పరుస్తున్నారో ప్రత్యేకంగా వివరిస్తున్నారు. 

Also Read:  " అన్నమయ్య డ్యాం ప్రమాదంపై అంతర్జాతీయంగా అధ్యయనం జరిగితే పరువు పోతుంది.." రాజ్యసభలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

వల్లభనేని వంశీ ప్రారంభించిన ఈ వివాదాన్ని అసెంబ్లీలో అంబటి రాంబాబు, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు కొనసాగించడంతో వివాదం ప్రారంభమయింది. చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని సవాల్ చేసి బాయ్ కాట్ చేశారు.  

Also Read: వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన... బాధితులకు అండగా ఉంటామని హామీ... తక్షణ సాయం రూ.189 కోట్లు ముంజూరు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 04 Dec 2021 06:47 PM (IST) Tags: ANDHRA PRADESH YSRCP tdp Chandrababu Bhubaneswari Rachamallu YSRCP MLA Rachamallu

ఇవి కూడా చూడండి

Anantapur News: అనంతపురంలో సైబర్ క్రైమ్! రూ.300 కోట్లకు పైగా లావాదేవీలు?

Anantapur News: అనంతపురంలో సైబర్ క్రైమ్! రూ.300 కోట్లకు పైగా లావాదేవీలు?

andhra Caste Census Postpone : ఏపీలో కులగణన మళ్లీ వాయిదా - భారీ వర్షాలే కారణం !

andhra Caste Census Postpone : ఏపీలో కులగణన మళ్లీ వాయిదా - భారీ వర్షాలే కారణం  !

Andhra News: తుపాను ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు - 2 రోజుల పాటు పర్యటన, దెబ్బతిన్న పంటలు పరిశీలన

Andhra News: తుపాను ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు - 2 రోజుల పాటు పర్యటన, దెబ్బతిన్న పంటలు పరిశీలన

CM Jagan: రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన - నీట మునిగిన పంటలు పరిశీలన

CM Jagan: రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన - నీట మునిగిన పంటలు పరిశీలన

Top Headlines Today: ఇక సీఎం రేవంత్ రెడ్డి; ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపన - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: ఇక సీఎం రేవంత్ రెడ్డి; ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపన - నేటి టాప్ న్యూస్

టాప్ స్టోరీస్

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం

revanth reddy take oath as telangana cm  :  మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై  రేవంత్ తొలి సంతకం