అన్వేషించండి

YS Jagan: 'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న

Andhra News: తిరుమల లడ్డూకు ఉన్న రుచే వేరని.. లడ్డూ తయారీలో వాడే నెయ్యికి సంబంధించి టెండర్ల ప్రక్రియ రొటీన్ అని వైఎస్ జగన్ అన్నారు. రహస్య రిపోర్టును టీడీపీ ఆఫీస్ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని ప్రశ్నించారు.

YS Jagan Sensational Comments On TDP Reports: తాము చిన్నప్పటి నుంచీ చూస్తూనే ఉన్నామని.. తిరుపతి (Tirupati) లడ్డూలో ఉన్న రుచి వేరే ఏ లడ్డూలో ఉండదని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) అన్నారు. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తారని.. తక్కువకు ఎవరు కోట్ చేస్తే వాళ్లకు టెండర్ అప్రూవ్ చేస్తారని చెప్పారు. ఇది రొటీన్ ప్రక్రియ అని ఇందులో ప్రభుత్వానికి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. 'ప్రసిద్ధి చెందిన టీటీడీ బోర్డులో కేంద్ర మంత్రులు, సీఎంలు కూడా విశిష్ట వ్యక్తులను రికమండ్ చేస్తారు. అలాంటి కూర్పుతో కూడిన బోర్డు టీటీడీ బోర్డు. అక్కడ ఉన్న వారు తప్పు చేయాలన్నా చేయలేని విధంగా వ్యవస్థ ఉంటుంది. పారదర్శకతతో దేవుడికి ఇంకా ఎలా మంచి చేయాలో అన్న ఆలోచనతో పని చేస్తుంటారు. ఇక్కడ టెండర్ల ప్రక్రియలో అదే జరిగింది. ఆ టెండర్లో వచ్చిన వారికి ఒకరికే ఇచ్చే పరిస్థితి లేదు. సప్లై చేసే వాళ్లు ల్యాబ్స్‌ నుంచి క్వాలిటీ చెక్ చేయించుకొని ట్యాంకర్లలో ఉన్న పదార్థాలు క్వాలిటీ నిర్దారిస్తూ సర్టిఫికెట్స్‌తో వస్తారు. తిరుమల వచ్చిన తర్వాత కూడా 3 టెస్టులు చేస్తారు. వాటిల్లో పాస్ అయితేనే ఏ వాహనం అయినా ముందుకు వెళ్తుంది. ఆ టెస్టుల్లో ఏ టెస్టు ఫెయిల్ అయినా వాహనాన్ని వెనక్కి పంపేస్తారు. చంద్రబాబు టైంలో 2014- 19 మధ్య 14 నుంచి  15 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపించారు. 2019-24 18సార్లు రిజెక్ట్ చేశాం.' అని జగన్ పేర్కొన్నారు.

ఇలా జరిగింది

బోర్డు అప్రూవ్‌ చేసిన కంపెనీ జూన్ 12 నుంచి సప్లై చేసిందని.. చంద్రబాబు సీఎం అయిన తర్వాత సప్లై మొదలైందని జగన్ అన్నారు. 'జూన్ 12, 21, 25, జులై 4న టెస్టుల్లో పాస్ అయ్యి ముందుకు కదిలాయి. జులై 6న రెండు జులై 12న మరో రెండు ట్యాంకర్లలో పదార్థాలు టెస్టులు ఫెయిల్ అయ్యాయి. ఈ టెస్టులు ఫెయిలైతే వెనక్కి పంపించేశారు. డౌట్ ఉంటే సీఎఫ్‌టీఆర్‌ఐకి కూడా పంపిస్తారు. ఇక్కడ మాత్రం గుజరాత్‌కు పంపించారు. తొలిసారిగా ఇది జరిగింది. గుజరాత్‌లోని ఎన్డీడీబీ పరీక్షించి రిపోర్టు ఇచ్చారు. ఇంతలోనే ఆ ట్యాంకర్లు వెనక్కి పంపేశారు. వాళ్లకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. వాడని నెయ్యి అని క్లియర్‌గా తెలుస్తున్నా చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఆ నెయ్యి వాడారని రెండు నెలల తర్వాత సెప్టెంబర్‌ 18న ఎందుకు అన్నారు.' అని ఈవో మాట్లాడిన మాటలు ప్లే చేశారు.

'టీడీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ రిలీజ్ చేశారు'

ఆ నెయ్యిని వాడకంలోకి తీసుకొని రావడం లేదని ఈవో క్లియర్‌గా చెప్పినా చంద్రబాబు సెప్టెంబర్‌ 18న ఎలా అబద్దాలు ఆడారని జగన్ ప్రశ్నించారు. జంతువు కొవ్వు లడ్డూల్లో కలిసిందని భక్తులు తిన్నారని దుష్ప్రచారం చేశారని.. సెప్టెంబర్‌ 19న గుజరాత్ నుంచి తెప్పించిన రిపోర్టును టీడీపీ ఆఫీస్‌లో రిలీజ్ చేశారని మండిపడ్డారు. 'ఆ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత కూడా టీటీడీ ఈవో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. నెయ్యిని పక్కన పెట్టేసినట్టు చెప్పారు. తర్వాత సెప్టెంబర్ 22న ఈవో తాను సంతకం చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. అనుమానం ఉన్న నెయ్యిని రహస్యంగా ఆ శాంపిల్స్‌ను పరీక్షించామన్నారు. ఎప్పుడైతే జంతువులకు సంబంధించిన కొవ్వు ఉందని గుర్తించామో వెనక్కి పంపేశామన్నారని చెప్పారు. అంత రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారు.' అని జగన్ ప్రశ్నించారు. 

ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ 22న ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు మళ్లీ జంతువు కొవ్వును వాడారని అబద్దాలు చెప్పారని జగన్ మండిపడ్డారు. ట్యాంకర్లు వచ్చేశాయి.. వాడేశారని దుష్ప్రచారం చేశారన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల ప్రసాదాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టీటీడీ ప్రతిష్టను వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఇలా అబద్దాలతో తగ్గించడం కుట్రపూరితమే. ఇది అపవిత్ర కాదా అని అడుగుతున్నాను. ఎడీడీబీ రిపోర్టు చూస్తే అదీ కచ్చితమైన రిపోర్టు కాదు. వాళ్లే డిస్‌క్లైమర్ రాశారు.' అని జగన్ తెలిపారు.

Also Read: YS Jagan: 'రాష్ట్రంలో రాక్షస రాజ్యం' - తిరుమల లడ్డూ టాపిక్ డైవర్ట్ చేయడానికే డిక్లరేషన్ టాపిక్ తెచ్చారన్న జగన్, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
Embed widget