అన్వేషించండి

YS Jagan: 'చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారనే పగబట్టారు' - మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Andhrapradesh News: సీఎం చంద్రబాబు.. పెద్దిరెడ్డి కుటుంబంపై పగబట్టారని మాజీ సీఎం జగన్ అన్నారు. అందుకే ఆయన ఏ శాఖలో పని చేసినా దానిపై అనవసర ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు.

YS Jagan Sensational Comments In Madanapalle Incident: వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే అనవసర నిందలు వేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) అన్నారు. మదనపల్లె (Madanapalle) సబ్ కలెక్టర్ కార్యాలయంలో పైళ్ల దగ్ధం ఘటనకు సంబంధించి శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వినుకొండలో రషీద్‌ దారుణ హత్యను ఖండిస్తూ.. తాను అక్కడికి వెళ్తుంటే దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం మదనపల్లె ఘటనను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే.. అది కుట్ర అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గనులు, లీజులు, మైనింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు క్లాస్ మేట్స్. కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబును కొట్టారంట. ఆయన ఎప్పుడూ తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. పెద్దిరెడ్డి అంటే చంద్రబాబుకు తీవ్ర కోపం. అందుకే వారి కుటుంబంపై పగబట్టారు. పెద్దిరెడ్డి ఏ పోర్ట్ ఫోలియా తీసుకున్నా దానిపై చంద్రబాబు ఆరోపణలు చేస్తారు.' అని జగన్ పేర్కొన్నారు.

'అప్పుడు ఎందుకు స్పందించలేదు.?'

మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరిగితే, డీజీపీని హెలికాప్టర్‌లో పంపిన చంద్రబాబు.. ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యమైతే.. చివరకు ఆమె మృతదేహం ఇంకా దొరక్కపోయినా స్పందించలేదని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. కేసు దర్యాప్తులో ఉండగానే ఎస్పీని బదిలీ చేశారని.. ఒక అనుమానితుడు లాకప్ డెత్‌కు గురయ్యాడని అన్నారు. 'రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 45 రోజుల్లో 12 మందిపై అత్యాచారం జరిగింది. మా ప్రభుత్వ హయాంలో దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ యాప్‌, మహిళలకు ఓ వరంలా ఉండేది. ఆపదలో ఉన్న మహిళలు.. యాప్‌ను వినియోగించినా, ఫోన్‌ను 5 సార్లు ఊపినా.. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకునే వారు. ఇప్పుడు అవేవీ పని చేయడం లేదు. ఎందుకంటే మాకు మంచి పేరు వస్తుంది కాబట్టి.' అని జగన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో దారుణాలు జరిగాయని.. తమ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేపై అక్రమంగా కేసు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఉండే ఎస్పీని తెచ్చుకుంటే ఇష్టానుసారంగా వ్యవహరించారని.. ఎన్నికల సంఘమే స్పందించి ఆయన్ను బదిలీ చేసినట్లు చెప్పారు.

'ఏం సందేశం ఇవ్వదల్చారు.?'

వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను దారుణంగా హతమార్చారని జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. 'పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి చేశారు. మాజీ ఎంపీ వాహనం ధ్వంసమైంది. సీఎం కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఏకంగా రెడ్ బుక్ ప్రదర్శిస్తూ బెదిరిస్తున్నారు. ఇలా ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారు.?. ఈ రోజు ఏపీ అంటే అరాచకం, ఆటవికం, రెడ్ బుక్ పాలన. దీనిపై ఇప్పటికే ప్రజల్లో ఆలోచన మొదలైంది.' అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

Also Read: YS Jagan: మదనపల్లి అగ్ని ప్రమాదంపై స్పందించిన జగన్ - ఏపీకి కొత్త అర్థం చెప్పిన మాజీ సీఎం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
What Indians Ate On New Year: సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
Best Foods to Eat Raw : ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
Embed widget