అన్వేషించండి

YS Jagan: గవర్నర్‌ను కలిసిన మాజీ సీఎం జగన్ - టీడీపీ దాడులపై ఫిర్యాదు

Andhrapradesh News: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మాజీ సీఎం జగన్ ఆదివారం రాజ్ భవన్‌లో కలిశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై దాడులు పెరిగాయని ఫిర్యాదు చేశారు.

Ys Jagan Meet Governor Abdul Nazeer: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను (Abdul Nazeer) ఆదివారం సాయంత్రం రాజ్ భవన్‌లో కలిశారు. ఏపీలో పరిస్థితులపై వైసీపీ నాయకులతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై దాడులు పెరిగాయని, అరాచక పాలన సాగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యలు, దాడులు, విధ్వంసాలు పెరిగాయని అన్నారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, గత 45 రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని గవర్నర్‌కు వివరించారు. దీనికి సంబంధించిన ఆధారాలు, వీడియోలను గవర్నర్‌కు అందించినట్లు వైసీపీ నేతలు తెలిపారు.

ఢిల్లీలో ధర్నా

వినుకొండ‌లో వైసీపీ కార్య‌క‌ర్త ర‌షీద్‌ను న‌డి రోడ్డుపై అందరూ చూస్తుండగానే క‌త్తితో దారుణంగా నరికి చంపిన ఘ‌ట‌న‌ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ మ‌రుస‌టి రోజే వైసీపీ మాజీ ఎంపీ రెడ్డ‌ప్ప నివాసంపై రాళ్ల దాడి, ఎంపీ మిథున్‌రెడ్డి కార్లు ద‌హ‌నం వంటి ఘ‌ట‌న‌ల‌ు సైతం ఆందోళన కలిగించాయి. వినుకొండలో రషిద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. ఈ నెల 24న (బుధవారం) ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీని కలిసి పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. త‌మ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయ‌కుల‌తో క‌లిసి పార్ల‌మెంట్ వ‌ద్ద ధ‌ర్నా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Also Read: Jagan Vinukonda Tour: జ‌గ‌న్ వినుకొండ ప‌ర్య‌ట‌న‌తో క్యాడర్‌లో జోష్‌, వైసీపీ అధినేత స‌రికొత్త కార్యాచ‌ర‌ణ‌కు సై

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Pawan Kalyan in Pithapuram: 211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Navadeep Drugs Case: నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Pawan Kalyan in Pithapuram: 211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Navadeep Drugs Case: నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
Ticket Price Hike: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
Embed widget