By: ABP Desam | Updated at : 07 Aug 2021 04:26 PM (IST)
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్డేడ్
వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే విచారణను వేగవంతం చేసిన అధికారులకు.. మరో కీలక అప్ డేట్ దొరికినట్టు తెలుస్తోంది. ఈనెల 2న గోవాలో అరెస్టైన సునీల్ యాదవ్ను అధికారులు కస్టడీకి తీసుకుని రెండో రోజు విచారిస్తున్నారు. అయితే సునీల్ ఇచ్చిన సమాచారంతోనే వివేకా హత్యకు సంబంధించిన ఆయుధాల కోసం అధికారులు గాలింపు చేపట్టారు. పులివెందుల ఆంజనేయస్వామి గుడిపక్కన వాగులో తనిఖీలు చేస్తున్నారు. రెండు మున్సిపల్ ట్యాంకర్లతో వాగులోని నీటిని తోడిస్తున్నారు అధికారులు. పులివెందులలోని రోటరీపురం వద్ద ఉన్న బ్రిడ్జి కింద ఉన్న డ్రైనేజ్లో కూడా మారణాయుధాల కోసం గాలింపు కొనసాగుతుంది.
రెండు మున్సిపల్ ట్యాంకర్లతో వాగులోని నీటిని తోడిస్తున్నారు. పోలీస్ ఎస్కార్ట్ మధ్య సునీల్ను సెంట్రల్ జైల్ నుంచి పులివెందులకు తీసుకువచ్చారు. సునీల్ సమక్షంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 2న అనుమానితుడు సునీల్ యాదవ్ను సీబీఐ అధికారులు గోవాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టులో హాజరపరిచారు. అక్కడి నుంచి ట్రాన్సిట్ రిమాండ్లో కడప సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు. సునీల్ను 13 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. 10 రోజులకు మాత్రమే అనుమతి లభించింది. ఈనెల 16 వరకు విచారించనుంది.
అంతకముందు సునీల్తో పాటు ఆయన తమ్ముడు కిరణ్యాదవ్, తల్లిదండ్రులు సావిత్రి, కృష్ణయ్య యాదవ్లను సీబీఐ ప్రశ్నించింది. విచారణ పేరుతో సీబీఐ తమను వేధిస్తోందని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సునీల్ హైకోర్టుకు వెళ్లాడు.
అయితే సునీల్ యాదవ్ కుటుంబం మొత్తం వైఎస్ వివేకాకు సన్నిహితులు. వారితో అత్యంత చనువుగా ఉంటున్నఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వివేకా హత్య కేసు వెనుక మిస్టరీ సునీల్కు తెలిసే ఉంటుందని.. లేకపోతే.. ఆ కుట్రలో భాగమై ఉంటారని సీబీఐ అధికారులు నమ్ముతున్నారు. ఈ కేసు కోసం ఇప్పటికే రెండు నెలలుగా సీబీఐ అధికారులు పులివెందులలోనే మకాం వేశారు. కేసును చేధించి వెళ్లాలన్న పట్టుదలతో ఉన్నారు. సాక్ష్యాలు మాయం చేసిన వారిని... మాయం చేయడానికి ప్రయత్నించిన వారిని సీబీఐ అధికారులు ఇంత వరకూ ప్రశ్నించలేదు. సునీల్ యాదవ్ కస్టడీలో చెప్పే విషయాలను బట్టి సీబీఐ.. వారిపైనా దృష్టి పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి వివేకా కేసు దర్యాప్తు మాత్రం కీలక దశకు చేరుకుందని సీబీఐ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో శనివారం నలుగురు అనుమానితులను అధికారులు ప్రశ్నించారు. డ్రైవర్ దస్తగిరి, సుంకేసుల గ్రామానికి చెందిన ఉమా శంకర్ రెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయమే కడప రైల్వే స్టేషన్ మాస్టర్ మోహన్ రెడ్డిని విచారణ చేసినట్టు తెలుస్తోంది. నేటితో 62 రోజులుగా ఈ కేసులో సీబీఐ విచారణ సాగుతుంది.
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్
Nellore News : నెల్లూరు జిల్లాలో విషాదం, ఈత సరదా ముగ్గుర్ని బలిగొంది!
Golden Bonam : బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం, కదిలివచ్చిన భాగ్యనగరం
Tirupati Crime : విడాకులు తీసుకున్న యువకులే కిలాడీ లేడీ టార్గెట్, పెళ్లి చేసుకుని ఆస్తులకు ఎసరు!
Chandrababu Letter : సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై సీఐడీ వేధింపులు, డీజీపీకి చంద్రబాబు లేఖ
IND vs ENG, 5th Test: మొదటి ఇన్నింగ్స్లో 284కు ఇంగ్లండ్ ఆలౌట్ - టీమిండియాకు భారీ ఆధిక్యం!
Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్
Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు
Royal Enfield Hunter 350: అత్యంత చవకైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వచ్చేస్తుంది - ధర ఎంతంటే?