అన్వేషించండి

YS Sharmila: నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల

Andhra Pradesh News | గత ప్రభుత్వం లో అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ ఎందుకు చేయలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. నాడు జగన్ అమ్ముడుపోయారు, ఇప్పుడు చంద్రబాబు అమ్ముడుపోయారా అని ప్రశ్నించారు.

అమరావతి: ఏపీలో రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా వైసీపీ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎందుకు చేపట్టడం లేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

అక్రమ డీల్‌పై నిజాలు నిగ్గుతేల్చండి..

రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. గత ప్రభుత్వంలో అదానీతో జరిగిన అక్రమ డీల్ పై ఎందుకు ఫోకస్ చేయడం లేదు..! అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా ? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే , నిజనిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీకు లేదా అని నిలదీశారు. నాడు జగన్ అమ్ముడుపోయినట్లుగా, ఇప్పుడు మీరు కూడా అదానీకి అమ్ముడుపోయారా? తీగ లాగితే మాజీ సీఎంతో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లపై మీరు నోరు విప్పకుండా, విచారణ చేయకుండా ఉండేందుకు అదానీ మీకు లంచాలు ఎంత ఆఫర్ చేశారు? అని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గత ఐదేళ్లపాటు SECIతో చేసుకున్న జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి అన్నారు. టెండర్లు లేకుండా అదానీకి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లే అని ఆరోపించారు. గుజరాత్ లో రూ 1.99 పైసలకు దొరికే సోలార్ విద్యుత్ ను గత వైసీపీ ప్రభుత్వం రూ.2.49 పైసలకు ఎలా కొంటుందని ఉద్యమాలు చేశారు. 25 ఏళ్ల పాటు చేసుకున్న ఒప్పందంతో ఏపీ ప్రజల నెత్తిన లక్ష కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. జగన్ సర్కార్ నిర్ణయం అదానీ కోసం ప్రజలను నిలువునా దోచి పెట్టడం అన్నారు. ఈ డీల్ రద్దు చేయాలని ఇప్పటి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా గతంలో హైకోర్టులో కేసు కూడా వేపించారు. అధికారంలో వచ్చాక నిజాలు తేలుస్తాం అని చెప్పారు. మరి ఇప్పుడేమైంది చంద్రబాబు ? అన్ని ఆధారాలు దన్నా, అధికారం పెట్టుకొని, మౌనంగా ఎందుకు ఉన్నారు సార్ - వైఎస్ షర్మిల 

అప్పుడు జగన్, ఇప్పుడు మీరు అమ్ముడుపోయారా?
ఈ వ్యవహారం మొత్తం గమనిస్తే నాడు వైసీపీ హయాంలో జగన్, అదానీకి అమ్ముడు పోయారు. ఇప్పుడు మీరు అమ్ముడు పోయారనే అర్థం వస్తుందన్నారు షర్మిల. అదానీ మీకు కూడా లంచాలు ఇచ్చి, మిమ్మల్ని కూడా తక్కెడలో నిలబెట్టారనే కదా అర్థం అన్నారు. నాడు ప్రతిపక్షంలో ఒకలా, ఇప్పుడు అధికారం ఉన్నా మరోలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఒకవేళ అదానీ మిమ్మల్ని కొనకపోతే, ఆయనతో వైసీపీ హయాంలో చేసుకున్న ఒప్పందాలపై మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసింది నిజమైన ఉద్యమం అయితే, వెంటనే ఏసీబీని రంగంలోకి దింపాలని డిమాండ్ చేశారు. రూ.1750 కోట్ల ముడుపుల ఆరోపణలపై ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలని, గత ప్రభుత్వం అదానీతో చేసుకున్న సోలార్ పవర్ డీల్ ను తక్షణం రద్దు చేయాలని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read: Jagan Mohan Reddy Tour: శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభం! ప్రతి బుధవారం నియోజకవర్గంలోనే నిద్ర

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamTirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Tirumala News: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
Athomugam OTT Release Date: భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
MODI WARNS LOKESH: 'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
Embed widget