అన్వేషించండి

YS Sharmila: నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల

Andhra Pradesh News | గత ప్రభుత్వం లో అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ ఎందుకు చేయలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. నాడు జగన్ అమ్ముడుపోయారు, ఇప్పుడు చంద్రబాబు అమ్ముడుపోయారా అని ప్రశ్నించారు.

అమరావతి: ఏపీలో రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా వైసీపీ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎందుకు చేపట్టడం లేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

అక్రమ డీల్‌పై నిజాలు నిగ్గుతేల్చండి..

రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. గత ప్రభుత్వంలో అదానీతో జరిగిన అక్రమ డీల్ పై ఎందుకు ఫోకస్ చేయడం లేదు..! అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా ? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే , నిజనిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీకు లేదా అని నిలదీశారు. నాడు జగన్ అమ్ముడుపోయినట్లుగా, ఇప్పుడు మీరు కూడా అదానీకి అమ్ముడుపోయారా? తీగ లాగితే మాజీ సీఎంతో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లపై మీరు నోరు విప్పకుండా, విచారణ చేయకుండా ఉండేందుకు అదానీ మీకు లంచాలు ఎంత ఆఫర్ చేశారు? అని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గత ఐదేళ్లపాటు SECIతో చేసుకున్న జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి అన్నారు. టెండర్లు లేకుండా అదానీకి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లే అని ఆరోపించారు. గుజరాత్ లో రూ 1.99 పైసలకు దొరికే సోలార్ విద్యుత్ ను గత వైసీపీ ప్రభుత్వం రూ.2.49 పైసలకు ఎలా కొంటుందని ఉద్యమాలు చేశారు. 25 ఏళ్ల పాటు చేసుకున్న ఒప్పందంతో ఏపీ ప్రజల నెత్తిన లక్ష కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. జగన్ సర్కార్ నిర్ణయం అదానీ కోసం ప్రజలను నిలువునా దోచి పెట్టడం అన్నారు. ఈ డీల్ రద్దు చేయాలని ఇప్పటి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా గతంలో హైకోర్టులో కేసు కూడా వేపించారు. అధికారంలో వచ్చాక నిజాలు తేలుస్తాం అని చెప్పారు. మరి ఇప్పుడేమైంది చంద్రబాబు ? అన్ని ఆధారాలు దన్నా, అధికారం పెట్టుకొని, మౌనంగా ఎందుకు ఉన్నారు సార్ - వైఎస్ షర్మిల 

అప్పుడు జగన్, ఇప్పుడు మీరు అమ్ముడుపోయారా?
ఈ వ్యవహారం మొత్తం గమనిస్తే నాడు వైసీపీ హయాంలో జగన్, అదానీకి అమ్ముడు పోయారు. ఇప్పుడు మీరు అమ్ముడు పోయారనే అర్థం వస్తుందన్నారు షర్మిల. అదానీ మీకు కూడా లంచాలు ఇచ్చి, మిమ్మల్ని కూడా తక్కెడలో నిలబెట్టారనే కదా అర్థం అన్నారు. నాడు ప్రతిపక్షంలో ఒకలా, ఇప్పుడు అధికారం ఉన్నా మరోలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఒకవేళ అదానీ మిమ్మల్ని కొనకపోతే, ఆయనతో వైసీపీ హయాంలో చేసుకున్న ఒప్పందాలపై మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసింది నిజమైన ఉద్యమం అయితే, వెంటనే ఏసీబీని రంగంలోకి దింపాలని డిమాండ్ చేశారు. రూ.1750 కోట్ల ముడుపుల ఆరోపణలపై ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలని, గత ప్రభుత్వం అదానీతో చేసుకున్న సోలార్ పవర్ డీల్ ను తక్షణం రద్దు చేయాలని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read: Jagan Mohan Reddy Tour: శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభం! ప్రతి బుధవారం నియోజకవర్గంలోనే నిద్ర

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
Embed widget