అన్వేషించండి

YS Sharmila: నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల

Andhra Pradesh News | గత ప్రభుత్వం లో అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ ఎందుకు చేయలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. నాడు జగన్ అమ్ముడుపోయారు, ఇప్పుడు చంద్రబాబు అమ్ముడుపోయారా అని ప్రశ్నించారు.

అమరావతి: ఏపీలో రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా వైసీపీ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎందుకు చేపట్టడం లేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

అక్రమ డీల్‌పై నిజాలు నిగ్గుతేల్చండి..

రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. గత ప్రభుత్వంలో అదానీతో జరిగిన అక్రమ డీల్ పై ఎందుకు ఫోకస్ చేయడం లేదు..! అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా ? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే , నిజనిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీకు లేదా అని నిలదీశారు. నాడు జగన్ అమ్ముడుపోయినట్లుగా, ఇప్పుడు మీరు కూడా అదానీకి అమ్ముడుపోయారా? తీగ లాగితే మాజీ సీఎంతో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లపై మీరు నోరు విప్పకుండా, విచారణ చేయకుండా ఉండేందుకు అదానీ మీకు లంచాలు ఎంత ఆఫర్ చేశారు? అని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గత ఐదేళ్లపాటు SECIతో చేసుకున్న జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి అన్నారు. టెండర్లు లేకుండా అదానీకి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లే అని ఆరోపించారు. గుజరాత్ లో రూ 1.99 పైసలకు దొరికే సోలార్ విద్యుత్ ను గత వైసీపీ ప్రభుత్వం రూ.2.49 పైసలకు ఎలా కొంటుందని ఉద్యమాలు చేశారు. 25 ఏళ్ల పాటు చేసుకున్న ఒప్పందంతో ఏపీ ప్రజల నెత్తిన లక్ష కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. జగన్ సర్కార్ నిర్ణయం అదానీ కోసం ప్రజలను నిలువునా దోచి పెట్టడం అన్నారు. ఈ డీల్ రద్దు చేయాలని ఇప్పటి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా గతంలో హైకోర్టులో కేసు కూడా వేపించారు. అధికారంలో వచ్చాక నిజాలు తేలుస్తాం అని చెప్పారు. మరి ఇప్పుడేమైంది చంద్రబాబు ? అన్ని ఆధారాలు దన్నా, అధికారం పెట్టుకొని, మౌనంగా ఎందుకు ఉన్నారు సార్ - వైఎస్ షర్మిల 

అప్పుడు జగన్, ఇప్పుడు మీరు అమ్ముడుపోయారా?
ఈ వ్యవహారం మొత్తం గమనిస్తే నాడు వైసీపీ హయాంలో జగన్, అదానీకి అమ్ముడు పోయారు. ఇప్పుడు మీరు అమ్ముడు పోయారనే అర్థం వస్తుందన్నారు షర్మిల. అదానీ మీకు కూడా లంచాలు ఇచ్చి, మిమ్మల్ని కూడా తక్కెడలో నిలబెట్టారనే కదా అర్థం అన్నారు. నాడు ప్రతిపక్షంలో ఒకలా, ఇప్పుడు అధికారం ఉన్నా మరోలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఒకవేళ అదానీ మిమ్మల్ని కొనకపోతే, ఆయనతో వైసీపీ హయాంలో చేసుకున్న ఒప్పందాలపై మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసింది నిజమైన ఉద్యమం అయితే, వెంటనే ఏసీబీని రంగంలోకి దింపాలని డిమాండ్ చేశారు. రూ.1750 కోట్ల ముడుపుల ఆరోపణలపై ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలని, గత ప్రభుత్వం అదానీతో చేసుకున్న సోలార్ పవర్ డీల్ ను తక్షణం రద్దు చేయాలని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read: Jagan Mohan Reddy Tour: శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభం! ప్రతి బుధవారం నియోజకవర్గంలోనే నిద్ర

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget