అన్వేషించండి

YS Jagan: అనర్హతా వేటు తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్ - ఒక్క రోజు అసెంబ్లీకి జగన్

YSRCP: వైఎస్ జగన్ ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ప్రసంగం వినేందుకు ఆయన అసెంబ్లీకి వస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

YS Jagan will attend the assembly: వైఎస్ఆర్‌సీపీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు అసెంబ్లీకి హాజరవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ...ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి జగన్ తో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి అధికార పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలన్న ఆలోచనే కారణం అంటున్నారు.   

జగన్ పై అనర్హతా వేటు వేస్తామంటున్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్        

అసెంబ్లీకి హాజరు కాని జగన్మోహన్ రెడ్డిపై అనర్హతా వేటు వేసేందుకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెడీగా ఉన్నారు. అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు పదేపదే జగన్ అనర్హత గురించి మాట్లాడుతున్నారు. అయితే వారికి బుద్ది పుట్టింది చేసుకోనివ్వండి ని  అని జగన్ మోహన్ రెడ్డి కూడా ఇటీవల ప్రెస్మీట్ లో స్పందించారు. అయితే అధికార పార్టీకి అవకాశం ఇవ్వకూడదని జగన్ అనుకుంటున్నారు. అందుకే ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యే ఆలోచన చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  కంటిన్యూస్ గా మూడు సెషన్లు లేదా.. అరవై రోజులు సభకు హాజరు కాకపోతే అనర్హతా వేటు పడుతుంది. వచ్చే సమావేశాలకు హాజరు కాకపోతే జగన్ కు ఆ అర్హత వస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి అవకాశం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మిగతా పని పూర్తి చేస్తారు.         

అధికార పార్టీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఒక్క రోజు హాజరయ్యేలా ప్లాన్         

అసెంబ్లీకి హాజరు కాకపోయినా లీవ్ లెటర్ పంపినా అనర్హతా వేటు నుంచి తప్పించుకోవచ్చు. అయితే స్పీకర్ ఆ లీవ్ సమంజసమా కాదా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.  ఇదంతా ఎందుకు.. అనుకుంటున్నారేమో కానీ ఒక్క రోజు అసెంబ్లీకి పోతే అసలు సమస్య ఉండదు కదా అన్న ఆలోచన చేస్తున్నారు.  గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యేందుకు జగన్ తోపాటు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అలా ఒక్క రోజు హాజరైతే ఆ తర్వాత అరవై రోజుల పాటు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండదని  అనుకుంటున్నారు. 

మిగిలిన ఎమ్మెల్యేల గురించి ఆలోచనతోనే ఈ నిర్ణయం  ?            

పులివెందులలో ఉపఎన్నికల వస్తే ప్రజలు తమ సత్తా ఏంటో కూటమికి చూపిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ తోపాటు మిగిలిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడితే.. ప్రభుత్వ పవర్ తో ఆయా సీట్లలో గెలిచే ప్రయత్నం చేస్తుందని..అది వైసీపీకి మరింత సమస్యగా మారుతుందని అనుకుంటున్నారు. అందుకే అనర్హతా వేటు విషయంలో జగన్ కు ఎలాంటి భయం లేకపోయినా..  మిగిలిన ఎమ్మెల్యేల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని వైసీపీవర్గాలు చెబుతున్నాయి.           

Also Read: ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్, ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget