అన్వేషించండి

Richest CM In India: దేశంలో సంపన్న సీఎం వైఎస్ జగన్, చివరి స్థానంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

ఏపీ సీఎం ఆస్తి రూ. 510 కోట్లు, బెంగాల్ సీఎం ఆస్తి రూ. 15 లక్షలేఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్లను విశ్లేషించి నివేదిక

YS Jagan Richest Chief Minister: దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో బాగా రిచ్ సీఎం ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి కాగా, అత్యంత తక్కువ ఆస్తి ఉన్న సీఎం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ! అసోసియేషన్​ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదిక ఇంకా ఆసక్తికర విశేషాలు ఇలా ఉన్నాయి.

భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్​ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో తేలింది. వీరి లెక్క ప్రకారం AP సీఎం వైఎస్​​ జగన్​ మోహన్​ రెడ్డి అత్యంత సంపన్నుడు. ఆయన ఆస్తుల విలువ రూ.510 కోట్లని నివేదిక తెలిపింది. ఆ జాబితా ప్రకారం అందరికంటే జగనే సీఎంలు అందరిలో ధనవంతుడు. ఆస్తుల విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిట్టచివరన ఉన్నారు. ఆమె పేరిట కేవలం 15 లక్షల రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయి.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు అసోసియేషన్​ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్​- నేషనల్ ఎలక్షన్ వాచ్​ సంస్థలు తెలిపాయి. దేశంలోని 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల ఆస్తుల విశ్లేషణ. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్​కు ప్రస్తుతం ముఖ్యమంత్రి లేరు కాబట్టి ఆ వివరాలు వెల్లడించలేదు. 30 మంది ముఖ్యమంత్రుల్లో 97 శాతం అంటే 29 మంది కోటీశ్వరులు. ఒక్కో సీఎం సగటు ఆస్తి రూ.33.96కోట్లు.

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్- నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం:

  • ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి ఆస్తి రూ.510కోట్లు
  • అరుణాచల్ ప్రదేశ్​ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఆస్తి రూ.163 కోట్లు
  • ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్ ఆస్తి రూ.63 కోట్లు
  • ఈ ముగ్గురు అత్యంత ఎక్కువ ఆస్తి కలిగిన ముఖ్యమంత్రులు
  • ఇక, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తి రూ.15 లక్షలు
  • కేరళ సీఎం పినరయి విజయన్​ ఆస్తి రూ.కోటి పైన
  • హరియాణా సీఎం మనోహర్​ లాల్ ఖట్టర్‌ ఆస్తి రూ.కోటి పైన
  • వీళ్లు తక్కువ ఆస్తి కలిగిన ముగ్గురు ముఖ్యమంత్రులు

2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తి విలువ రూ. 23.55 కోట్లు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్తి ఒక్కొక్కరి పేరిట రూ.3 కోట్లకు పైగా ఉంది. 2018 శాసన సభ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం.. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఆస్తి రూ.కోటికుపైగా ఉంది. తమిళనాడు సీఎం స్టాలిన్ , కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై ఆస్తి ఒక్కొక్కరికి రూ.8 కోట్లకు పైగా ఉంది. ఈ 30 మంది ముఖ్యమంత్రుల్లో 43 శాతం.. అంటే 13 మందిపై తీవ్రమైన నేరాలు, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, బెదిరింపులు లాంటి కేసులు ఉన్నాయని అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇవన్నీ బెయిల్​కు వీల్లేని ఐదేళ్లకన్నా ఎక్కువ శిక్ష పడే కేసులేనని నివేదిక తెలిపింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Embed widget