అన్వేషించండి

Vijaysai reddy: 'చంద్రబాబు చరిత్ర ముగిసింది' - లోకేశ్ కు రాజకీయ నాయకుడి లక్షణాలు లేవన్న విజయసాయి రెడ్డి

Vijaysai reddy: చంద్రబాబు చరిత్ర ముగిసిందని, ఆయన్ను ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ నేత లోకేశ్ కు పొలిటీషియన్ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్థం కోసమే పాలన చేశారని, ఆయన హయాంలో ఆ పార్టీ వర్గీయులే బాగు పడ్డారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలిసింది, మోసం, దగా మాత్రమేనని ధ్వజమెత్తారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కు రాజకీయ నాయకుడి లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై ప్రజలెవరూ సానుభూతి చూపడం లేదని, జాతీయ నాయకులు కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

'పేదల సంక్షేమమే వైసీపీ లక్ష్యం'

సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని విజయసాయి రెడ్డి ప్రశంసించారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులోనూ మరింత సంక్షేమం పేదలకు అందేలా చర్యలు చేపడుతున్నారని వివరించారు. వైసీపీ పెత్తందార్ల పార్టీ కాదని, పేదలు, బలహీన వర్గాల పార్టీ అని తెలిపారు. మంత్రి వర్గ కూర్పులోనూ సామాజిక న్యాయం పాటించామని గుర్తు చేశారు.

ఆధారాలతోనే బాబు అరెస్ట్

స్కిల్ స్కాం కేసులో పక్కా ఆధారాలతోనే చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని, ఆయన పాపం పండింది కాబట్టే జైల్లో ఉన్నారని విజయసాయి వ్యాఖ్యానించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నాయకత్వ లక్షణాలు లేవని, ప్రజల కోరికలు నెరవేర్చే వ్యక్తి కాదని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని, టీడీపీ నేతలే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చరిత్ర ముగిసిందని, రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ వైసీపీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

అభివృద్ధిని టీడీపీ తట్టుకోలేకపోతోంది

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'చంద్రబాబు ఆయన కుటుంబాన్ని మాత్రమే బాగా చూసుకున్నారు. బడుగు, బలహీన వర్గాలను ఆయన మోసం చేశారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు చూసి టీడీపీ తట్టుకోలేకపోతోంది. సంక్షేమ పథకాలు చూసి ఓర్చుకోలేకపోతుంది.' అంటూ మండిపడ్డారు.

పురంధేశ్వరి ఆరోపణలు నిరాధారం

బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని విజయసాయి హితవు పలికారు. లిక్కర్ విషయంలో తనపై, మిథున్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆమెది నిలకడ లేని రాజకీయమని, స్వార్థ, సొంత అజెండాతోనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పురంధేశ్వరికి తెలిసింది ఆమె సామాజిక వర్గం గురించి మాత్రమేనని ఎద్దేవా చేశారు. 

కొనసాగుతోన్న వైసీపీ బస్సు యాత్ర

మరోవైపు, వైసీపీ నేతలు, శ్రేణులు చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. ఆ పార్టీ నేతలు ప్రభుత్వ సంక్షేమాన్ని, సీఎం జగన్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. 

Also Read: 'చంద్రబాబును చంపేస్తామని బాహాటంగానే చెబుతున్నారు' - కక్షతోనే అరెస్ట్ చేశారన్న లోకేశ్, ఆధారాలు చూపాలని సవాల్

టాప్ హెడ్ లైన్స్

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget