అన్వేషించండి

YS Birth Anniversary YSRCP : వైఎస్ 75వ జన్మదిన వేడుకలకు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - క్యాడర్ అంతా పాల్గొనేలా కార్యక్రమాలు

YSR Birth Anniversary : ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్‌సీపీ నిర్ణయించింది. పార్టీ శ్రేణులందరూ ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చింది.

YCP is making arrangements for YS 75th birth anniversary :  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఊరిలోనూ వైసీపీ అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. ఆస్పత్రుల్లో పండ్లు పంపిణ చేయడం, మొక్కలు నాటడం, రక్తదానం చేయడం, పిల్లలకు స్కూల్ బుక్స్ పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.  ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని  పార్టీ కార్యకర్తలకు సూచించారు.   వైఎస్సార్ మీద భక్తి ఉన్న వారంతా జయంతి కార్యక్రమాలు చేయవచ్చునని పార్టీలతో సంబంధం లేదన్నారు. 

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ జయంతి 

వైఎస్ఆర్ 75వ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించాలని ఏపీ పీసీసీ చీఫ్, వైఎస్ కుమార్తె షర్మిల నిర్ణయించారు. విజయవాడలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సోనియా , రాహుల్ గాంధీలు సహా పలువులు కీలక నేతల్ని ఆహ్వానించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు. అలాగే తెలుగు రాష్ట్రాలలో వైఎస్ తో సాన్నిహిత్యం ఉన్న అందర్నీ ఆహ్వానించారు. వీరిలో ఎంత మంది వస్తారో కానీ..  కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి కీలక నేతలు వస్తారని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి వైఎస్ జయంతిని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. 

వైఎస్ కాంగ్రెస్ సొంతమనేలా షర్మిల వ్యూహం

 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు జయంతి వేడుకలను షర్మిల ఉపయోగించుకుంటున్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలైన వారసురాలిగా ప్రజల్లో గుర్తింపు పొందేందుకు షర్మిల  రాజకీయంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.  ఈ క్రమంలో వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించడాన్ని టాస్క్ గా తీసుకుని పని చేస్తున్నారు. వైఎస్ జయంతి రోజున కొంత మంది  కీలక నేత్లని పార్టీలో చేర్చుకోవాలన్న ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు. 

చనిపోయే వరకూ కాంగ్రెస్ లోనే ఉన్న వైఎస్ఆర్                 

వైఎస్ఆర్ చనిపోయే వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రాహల్ గాంధీని ప్రధానిని చేయడం తమ లక్ష్యమని ఆయన చెబుతూ ఉండేవారు. గాంధీ కుటుంబానికి వీర విధేయంగా ఉండేవారు. అయితే ఆయన ప్రమాదవశాత్తూ చనిపోయిన తర్వాత వైఎస్ కుటుంబం పార్టీకి దూరమయింది. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వలేదన్న కారణం చెప్పారు. జగన్, షర్మిల మధ్య విబేధాలు వచ్చిన తర్వాత షర్మిల కాంగ్రెస్‌లో చేరడంతో మళ్లీ వైఎస్.. కాంగ్రెస్ మధ్య అనుబంధం తెరపైకి వస్తోంది. ఇప్పుడు వైఎస్ లెగసీతో మరోసారి కాంగ్రెస్ ను బలపరిచేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.                                               

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Suriya 46 Movie : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
Cheapest Automatic Cars India: ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Suriya 46 Movie : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
Cheapest Automatic Cars India: ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Cinnamon Water : 2026లో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే దాల్చినచెక్క నీరు తాగేయండి
2026లో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే దాల్చినచెక్క నీరు తాగేయండి
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Embed widget