అన్వేషించండి

ED Case On YSRCP Mla : వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై ఈడీ కేసు నమోదు - అరెస్ట్ చేస్తారా ?

ఈడీ కేసులో వైసీపీ ఎమ్మెల్యే అరెస్టవుతారా ? మేకపాటి విక్రమ్ రెడ్డిపై రూ. 125 కోట్ల అవినీతి కేసు నమోదయింది.

 

ED Case On YSRCP Mla :  వైసీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు అయింది. గురువాయూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ జీఐపీఎల్ కంపెనీ డైరెక్టర్ గా మేకపాటి విక్రమ్ రెడ్డి ఉన్నారు. ఈ కంపెనీ  కృష్ణ మోహన్ కన్‌స్ట్రక్షన్స్‌ కేఎంసీ అనే కంపెనీ అనుబంధ సంస్థ. ఇది మేకపాటి కుటుంబానికి చెందినది. కేరళలో ఓ జాతీయ రహదారి నిర్మాణం కోసం అనుబంధ సంస్థ జీఐపీఎల్ ను ఏర్పాటు చేశారు. రోడ్ పూర్తిగా నిర్మించకుండా.. బస్ షెల్టర్లు కట్టకుండానే టోల్, ప్రకటన చార్జీల రూపంలో భారీగా డబ్బులు సంపాదించినట్లుగా ఈ కంపెనీపై ఆరోపణలుఉన్నాయి.                                         

కోల్‌తాలోని భారత్ రోడ్ నెట్‌వర్క్ లిమిటెడ్, , త్రిసూర్‌లోని జీఐపీఎల్ కార్యాలయాల్లో సోదాలను నిర్వహించారు. డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం ఈ చీటింగ్ కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ సోదాలు చేపట్టారు. మేకపాటి విక్రమ్ రెడ్డి స్వయంగా నేర పూరిత కుట్రకు పాల్పడ్డారని  ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఎన్‌హెచ్ఏ1 నిధులు దుర్వినియోగం చేశారని ఈడీ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. 2006లో ఎన్ హెచ్47లోని పనుల అమలుకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 

ఎన్‌హెచ్ఏ1 పాలక్కాడ్‌లో అధికారులతో కలిసి కుట్రలు చేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయినట్లు అధికారులతో ధృవీకరణ పత్రాన్ని పొంది మోసం చేశారు. ప్రజల నుంచి అక్రమంగా టోల్ వసూలు ద్వారా రూ.125 కోట్ల మేర లబ్ధిపొందినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విక్రమ్ రెడ్డి ఇంట్లో లభ్యమైన నగదును పీఎంఎల్ఏ 202 సెక్షన్ 17 (1-A)కింద సీజ్ చేశారు. 2006 నుంచి 2016 మధ్యకాలంలో కేరళలోని పాలక్కాడ్‌లో 47వ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన రెండు సెక్షన్ల నిర్మాణ పనుల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. దీనివల్ల ఎన్‌హెచ్ఏఐకి సుమారు 102 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఈడీ అధికారులు అంచనా వేశారు.                                                    
 
కేసు నమోదు చేయడానికి ముందు ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని కేఎంసీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగానే ఈ చీటింగ్ కేసు నమోదు చేశారని అంటున్నారు. దీనిపై  కంపెనీ యాజమాన్యానికి నోటీసులను జారీ చేస్తారని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి.. సాక్ష్యా ధారాలను కూడా సేకరించినందుకున మేకపాటి విక్రమ్ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయవచ్చన ప్రచారం జరుగుతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dwaraka Tirumala Fake Tickets: ద్వారకా తిరుమలలో ఫేక్ దర్శనం టికెట్స్ స్కామ్.. ఏడుగురు అరెస్ట్
ద్వారకా తిరుమలలో ఫేక్ దర్శనం టికెట్స్ స్కామ్.. ఏడుగురు అరెస్ట్
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Selfie Deaths: వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
TDP Rajya Sabha seat race: టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
వాట్సాప్ మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
Jeevan Reddy:రెండు సార్లు కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోకే !
రెండు సార్లు కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోకే !
TDP Rajya Sabha seat race: టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
Telangana Politics: వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
Simsa Mata Temple: జామకాయ కల్లోకి వస్తే అబ్బాయి, బెండకాయ కల్లోకి వస్తే అమ్మాయి, ఈ కల వస్తే ఎప్పటికీ తల్లి కాలేరు!
జామకాయ కల్లోకి వస్తే అబ్బాయి, బెండకాయ కల్లోకి వస్తే అమ్మాయి, ఈ కల వస్తే ఎప్పటికీ తల్లి కాలేరు!
Selfie Deaths: వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
Embed widget