అన్వేషించండి

Andhra Liquor Scam: జైళ్లలో ఉన్న లిక్కర్ కేసు నిందితులంతా ఆత్మీయులే - అయినా పరామర్శించని జగన్ - కారణమేంటి?

Jagan: వివిధ కేసుల్లో జైలుకు వెళ్తున్నపార్టీ నేతల్ని జగన్ పరామర్శిస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ లిక్కర్ కేసులో జైలుకెళ్లిన వారిని పరామర్శించలేదు.

Why is Jagan not visiting liquor scam accused: అధికారం పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా వివిధ కేసుల్లో జైలుకు వెళ్తున్నారు. వల్లభనేని వంశీ నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి వరకూ చాలా మంది నేతలు జైళ్లకు వెళ్లారు. వారందర్నీ జగన్ ఆయా జైళ్లకు వెళ్లి పరామర్శించారు. పోసాని వంటి కొంత మందిని పరామర్శించలేదు. అదే సమయంలో లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన వారెవర్నీ పరామర్శించలేదు. ఈ కేసులో అరెస్టు అయిన వారందరూ జగన్‌కు అత్యంత సన్నిహితులే.        

మిథున్ రెడ్డినీ పరామర్శించని జగన్                

మిథున్ రెడ్డి ..  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయనకు లిక్కర్ కేసుతో ఏం సంబంధం లేదని జగన్ పలుమార్లు ప్రెస్మీట్లలో చెప్పారు. అయితే సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో చివరికి రాజంపేట ఎంపీ అరెస్టు కావాల్సి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకూ ఆయనను పరామర్శించలేదు. ఇరవై ఐదో తేదీన జగన్ .. మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు రాజమండ్రి వస్తారని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కానీ ఒక్క రోజులోనే ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయినట్లుగా బొత్స ప్రకటించారు. 

తన వద్ద పని చేసిన అధికారలనూ పరామర్శించలేదు !                  

ఇక జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను కూడా జగన్ పరామర్శించలేదు. వారిద్దరూ జగన్ కు అత్యంత సన్నిహితులు. ధనుంజయ్ రెడ్డి.. జగన్ సీఎంగా ఉన్న ఐదు సంవతర్సాల పాటు సీఎంవోలో చక్రం తిప్పారని అంటారు. అన్ని పనులు ఆయన చేతుల మీదుగానే జరిగేవని చెబుతారు. అలాంటి ధనుంజయ్ రెడ్డి అరెస్టు అయినా జగన్.. జైలుకు వెళ్లి పరామర్శించలేదు. కృష్ణమోహన్ రెడ్డి కూడా జగన్‌కు సన్నిహితులే. వీరిని కూడా ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. 

లిక్కర్ కేసు నిందితుల్ని పరామర్శించకపోవడం వెనుక వ్యూహం ఉందా ?                

లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. సిట్ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో జగన్ ప్రస్తావన ఉంది. అసలు ఈ లిక్కర్ స్కామ్‌లో అంతిమ లబ్దిదారుడు జగన్మోహన్ రెడ్డేనని సిట్ చెబుతోంది. ఇలాంటి సమయంలో లిక్కర్ కేసు నిందితుల్ని పరామర్శించకపోవడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందంటున్నారు. వారిని పరామర్శిస్తే అందరూ కలిసి ప్లాన్ చేశారని.. అందుకే వారి కోసం  జైలుకు వచ్చారని ప్రచారం జరిగే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. లాయర్లు, న్యాయనిపుణుల సూచనల మేరకే జగన్.. తనకు అత్యంత ఆత్మీయులు అయినప్పటికీ లిక్కర్ కేసు నిందితుల్ని జైలుకు వెళ్లి పరామర్శించడం లేదని చెబుతున్నారు. 

అయితే టీడీపీ నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి అందర్నీ బలి చేసి తాను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు
2026 నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రేట్లు పెంపు - ఇప్పుడు కొంటేనే డబ్బులు ఆదా!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు
2026 నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రేట్లు పెంపు - ఇప్పుడు కొంటేనే డబ్బులు ఆదా!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
AI Impact In India:భారత్‌లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు! ఒకే క్లిక్‌లో పూర్తి వివరాలు తెలుసుకోండి!
భారత్‌లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు! ఒకే క్లిక్‌లో పూర్తి వివరాలు తెలుసుకోండి!
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
Mowgli 2025 OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
Embed widget