అన్వేషించండి

Andhra Liquor Scam: జైళ్లలో ఉన్న లిక్కర్ కేసు నిందితులంతా ఆత్మీయులే - అయినా పరామర్శించని జగన్ - కారణమేంటి?

Jagan: వివిధ కేసుల్లో జైలుకు వెళ్తున్నపార్టీ నేతల్ని జగన్ పరామర్శిస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ లిక్కర్ కేసులో జైలుకెళ్లిన వారిని పరామర్శించలేదు.

Why is Jagan not visiting liquor scam accused: అధికారం పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా వివిధ కేసుల్లో జైలుకు వెళ్తున్నారు. వల్లభనేని వంశీ నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి వరకూ చాలా మంది నేతలు జైళ్లకు వెళ్లారు. వారందర్నీ జగన్ ఆయా జైళ్లకు వెళ్లి పరామర్శించారు. పోసాని వంటి కొంత మందిని పరామర్శించలేదు. అదే సమయంలో లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన వారెవర్నీ పరామర్శించలేదు. ఈ కేసులో అరెస్టు అయిన వారందరూ జగన్‌కు అత్యంత సన్నిహితులే.        

మిథున్ రెడ్డినీ పరామర్శించని జగన్                

మిథున్ రెడ్డి ..  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయనకు లిక్కర్ కేసుతో ఏం సంబంధం లేదని జగన్ పలుమార్లు ప్రెస్మీట్లలో చెప్పారు. అయితే సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో చివరికి రాజంపేట ఎంపీ అరెస్టు కావాల్సి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకూ ఆయనను పరామర్శించలేదు. ఇరవై ఐదో తేదీన జగన్ .. మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు రాజమండ్రి వస్తారని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కానీ ఒక్క రోజులోనే ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయినట్లుగా బొత్స ప్రకటించారు. 

తన వద్ద పని చేసిన అధికారలనూ పరామర్శించలేదు !                  

ఇక జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను కూడా జగన్ పరామర్శించలేదు. వారిద్దరూ జగన్ కు అత్యంత సన్నిహితులు. ధనుంజయ్ రెడ్డి.. జగన్ సీఎంగా ఉన్న ఐదు సంవతర్సాల పాటు సీఎంవోలో చక్రం తిప్పారని అంటారు. అన్ని పనులు ఆయన చేతుల మీదుగానే జరిగేవని చెబుతారు. అలాంటి ధనుంజయ్ రెడ్డి అరెస్టు అయినా జగన్.. జైలుకు వెళ్లి పరామర్శించలేదు. కృష్ణమోహన్ రెడ్డి కూడా జగన్‌కు సన్నిహితులే. వీరిని కూడా ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. 

లిక్కర్ కేసు నిందితుల్ని పరామర్శించకపోవడం వెనుక వ్యూహం ఉందా ?                

లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. సిట్ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో జగన్ ప్రస్తావన ఉంది. అసలు ఈ లిక్కర్ స్కామ్‌లో అంతిమ లబ్దిదారుడు జగన్మోహన్ రెడ్డేనని సిట్ చెబుతోంది. ఇలాంటి సమయంలో లిక్కర్ కేసు నిందితుల్ని పరామర్శించకపోవడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందంటున్నారు. వారిని పరామర్శిస్తే అందరూ కలిసి ప్లాన్ చేశారని.. అందుకే వారి కోసం  జైలుకు వచ్చారని ప్రచారం జరిగే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. లాయర్లు, న్యాయనిపుణుల సూచనల మేరకే జగన్.. తనకు అత్యంత ఆత్మీయులు అయినప్పటికీ లిక్కర్ కేసు నిందితుల్ని జైలుకు వెళ్లి పరామర్శించడం లేదని చెబుతున్నారు. 

అయితే టీడీపీ నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి అందర్నీ బలి చేసి తాను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Embed widget