అన్వేషించండి

Pithani Satyanarayana On BJP : టీడీపీతో జట్టుకట్టకుండా పవన్ ను బీజేపీ బెదిరిస్తోంది, మాజీ మంత్రి పితాని సంచలన వ్యాఖ్యలు

Pithani Satyanarayana On BJP : టీడీపీ జనసేన జట్టు కట్టకుండా బీజేపీ ఎంతకాలం అడ్డుకుంటుందో తాము చూస్తామని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. బీజేపీ పవన్ కల్యాణ్ ను బెదిరిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు.

Pithani Satyanarayana On BJP : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. బీజేపీ ముందు ఒక రాజకీయం, వెనక ఒక రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. పవన్ టీడీపీతో కలవాలని చూస్తున్నారని, అలా కలవకుండా ఆయన్ను బీజేపీ భయపెడుతోందని ఆరోపించారు. పవన్ కు తాళం వేయాలని ట్రై చేస్తుందన్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరి మానుకోవాలని విమర్శించారు. బీజేపీ ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరమా అని ప్రజలు ప్రశ్నించే రోజు తొందర్లోనే రాబోతుందన్నారు. ఏపీలో బీజేపీ అధికారపక్షమా లేక ప్రతిపక్షమా స్పష్టం చేయాలన్నారు. సీపీఐ, సీపీఎం ఒక క్లారిటీతో ముందుకెళ్తున్నాయని, బీజేపీకి ఆ క్లారిటీ లేదన్నారు. ఏపీలో బీజేపీ తప్పుడు రాజకీయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలా నటిస్తూ... దిల్లీలో జగన్ కు తాజేదారులా బీజేపీ వ్యవహరిస్తుందని మాజీ మంత్రి పితాని విమర్శలు చేశారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని ప్రతిపాదించిన బీజేపీ.. ఇప్పుడు వ్యతిరేకిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఎంత కాలం అడ్డుకుంటారో చూస్తాం

బీజేపీ నాయకులు సీఎం జగన్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. టీడీపీతో కలిసేందుకు ముందు రాకుండా పవన్ కల్యాణ్ అడ్డుకునేందుకు బీజేపీ ట్రై చేస్తుందని ఆరోపించారు. జనసేన టీడీపీతోనే ఉందని, బీజేపీ వైసీపీకి తాబేదారుల్లా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. స్వార్థ రాజకీయాలు నడపడం, లోపల ఒకలా, బయట వేరేలా రాజకీయాలు చేయొద్దని బీజేపీకి హితవు పలికారు. పొత్తులపై రాజకీయంగా జనసేనకు క్లారిటీ లేకుండా  తాళాలు వేస్తున్నారని ఆరోపించారు.  టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోకుండా బీజేపీ ఎంతకాలం అడ్డుకుంటుందో తాము చూస్తామన్నారు. ఏపీలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ తెర వెనుక సీఎం జగన్ కు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతున్నా, జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టే బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు.  

కర్ణాటకలో పవన్ ప్రచారం లేనట్లేనా ? 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్ణాటకలో బీజేపీ తరపున ప్రచారం చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. పవన్ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు అంగీకారం తెలిపారని .. సమన్వయం చేసుకునే బాధ్యతను ఎంపీ, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్యకు అప్పగించారని అనుకున్నారు. అయితే నామినేషన్ల గడువు ముగిసినా పవన్ కల్యాణ్ ప్రచారం గురించి క్లారిటీ రాలేదు. తేజస్వి సూర్య సంప్రదిస్తున్నా పవన్ కల్యాణ్ స్పందించడం లేదని చెబుతున్నారు. బీజేపీ కి ప్రచారం చేసే విషయంలో పవన్  
కల్యాణ్ ఆసక్తిగా లేరని బీజేపీ వర్గాలు అంచనాకు  వస్తున్నాయి.  బీజేపీ తరపున ప్రచారం చేయడానికి పవన్ కల్యాణ్ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ .. ఏపీలో రాజకీయ పరిణామాల విషయంలో తమ ప్రతిపాదనలు పట్టించుకోనందున పవన్ బెట్టు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.  వైసీపీ విముక్త ఏపీ లక్ష్యమని.. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీకి సహకరించడం ఆపేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే బీజేపీ మాత్రం ఏపీ ప్రభుత్వానికి..సీఎం జగన్ కు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఇస్తూ వస్తోంది. ఇలాంటి పరిణామాలతో బీజేపీకి వైసీపీనే దగ్గర అని.. ఇక తాను ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా పవన్ కల్యాణ్ కర్ణాటక లో  ప్రచారంపై ప్రతిష్ఠంభన  ఏర్పడింది.           

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget