By: ABP Desam | Updated at : 13 Mar 2022 07:09 AM (IST)
ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్స్
AP Weather Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఓ వైపు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నా, మరోవైపు రాత్రి వేళల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నాయి. గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ సారి ఎండలు ఎక్కువగా ఉంటాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వాతావరణం వేడిగా ఉంటుంది. పగటి పూట ఎండ ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత అధికం కానుంది. బాపట్లలో 34 డిగ్రీలు, కాకినాడలో 34.7 డిగ్రీలు, కళింగపట్నంలో 32.8 డిగ్రీలు, నందిగామలో 38.4 డిగ్రీలు, నెల్లూరులో 34 డిగ్రీలు, తునిలో 36.8 డిగ్రీలు, విశాఖపట్నంలో 34 డిగ్రీలు, అమరావతిలో 36.5 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పగటి పూట వేడి అధికం అవుతుంటే, రాత్రిపూట చలి గాలులు వీస్తున్నాయి. దీంతో రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు 20కి దిగువన నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేడి, ఉక్కపోత అధికం అవుతుంది. అనంతపురంలో 36.8 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 34.5 డిగ్రీలు, తిరుపతిలో 34.9 డిగ్రీలు, కర్నూలులో 37.9 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.
Daily weather report for Andhra Pradesh Dated 12.03.2022. pic.twitter.com/0WGSpCM8tL
— MC Amaravati (@AmaravatiMc) March 12, 2022
తెలంగాణ వెదర్ అప్డేట్ (Temperature in Telangana)
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. నల్గొండలో 39 డిగ్రీలు నమోదు కాగా, భద్రాచలంలో 37.6 డిగ్రీలు, ఆదిలాబాద్లో 37.3 డిగ్రీల భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, ఖమ్మంలో ఎండల తీవ్రత అధికం. నేటి నుంచి వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరతాయని అంచనా వేశారు.
Also Read: Gold-Silver Price: బంగారం - వెండి ధరలపై ఇంకా యుద్ధం ఎఫెక్ట్! నేడు కూడా ఎగబాకిన ధరలు
Breaking News Telugu Live Updates: తిరుపతి కోర్టులో ఎంపీ సుబ్రమణ్యస్వామికి చుక్కెదురు
Transfers In AP: దేవాదాయ శాఖలో సామూహిక బదిలీలు- అర్థరాత్రి జీవో విడుదల
Movie Tickets Issue: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!
Bengal Tiger In AP: కోస్తాలో రెండు బెంగాల్ టైగర్స్ తిరుగుతున్నాయా? టెన్షన్ పెడుతున్న వరుస దాడులు
Palnadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - స్పాట్లో ఇద్దరు వ్యక్తులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Tax on Petrol, Diesel: పెట్రోల్, డీజిల్పై మరో పన్ను పెంచిన కేంద్రం! సామాన్యుడి పరిస్థితి ఏంటి?
10th Class Diaries Movie Review - 'టెన్త్ క్లాస్ డైరీస్' రివ్యూ: స్కూల్ డేస్ లవ్వే కాదు, అంతకు మించి - శ్రీరామ్, అవికా గోర్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Tracking Tigers: పులులు దొరక్కుండా ఎలా తప్పించుకుంటాయ్, వాటిని ఎలా ట్రాక్ చేస్తారు?
Anya’s Tutorial Web Series Review - 'అన్యాస్ ట్యుటోరియల్' రివ్యూ: రెజీనా, నివేదితా సతీష్ భయపెట్టారా? లేదా?