అన్వేషించండి

DGP Rajendranath Reddy : లోన్ యాప్ వేధింపులపై ఫిర్యాదు చేయండి, ఆత్మహత్యలు వద్దు- డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

DGP Rajendranath Reddy : వేధింపులకు పాల్పడుతున్న లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

DGP Rajendranath Reddy : లోన్ యాప్ వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ధైర్యంగా ఉండాలని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి భరోసా ఇచ్చారు. లోన్ యాప్ ల వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తామని, బాధితులు  ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఇలాంటి కేసులను పరిష్కరించి, బాధితులకు అండగా ఉండాలని పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన వివిధ కేసులను సమీక్షించామని, చాలా వరకు నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాయని డీజీపీ తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించేందుకు దిశ యాప్ పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. మహిళలు తమ మొబైల్స్ లో దిశ యాప్ ను డౌన్లోడు చేసుకొని, రిజిస్ట్రేషన్ చేసుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

నాటు సారాపై డీజీపీ ఏమన్నారంటే? 
 
నాటుసారా తయారు చేస్తున్న గ్రామాలను గుర్తించి, నాటుసారా తయారు చేస్తున్న వ్యక్తులు శాశ్వతంగా సారా వ్యాపారాలకు స్వస్తి పలికి, వేరే వృత్తులతో పునరావాసం కల్పించేందుకు గ్రామ స్థాయిలోనే సర్వేలు నిర్వహించనున్నట్లు డీజీపీ తెలిపారు. ఇందుకు  సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామన్నారు. ప్రభుత్వం కూడా గ్రామాల్లో నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్, వివిధ స్కీమ్ లతో 3400 కుటుంబాలకు పునరావాసం కల్పించే విధంగా కృషి చేస్తుందన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం రూపొందించిన 14400 మొబైల్ యాప్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ యాప్ కు వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికే 58 కేసులు నమోదు చేశామన్నారు. లోన్ యాప్ ల మోసాలను నియంత్రించేందుకు పోలీసుశాఖ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతుందన్నారు.

లోన్ యాప్ లపై కఠిన చర్యలు 

లోన్ యాప్ ల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, అవగాహన లేకుండా అడిగే వాటన్నింటికి అనుమతులు ఇవ్వొద్దని డీజీపీ సూచించారు. రుణాలు తీసుకొనే క్రమంలో యాప్ నిర్వాహకులు అడిగిన వాటన్నింటికి అనుమతులు ఇవ్వడంతో ఫొటోలు, లొకేషన్, కాంటాక్ట్ నంబర్లు డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్లి పోతుందన్నారు. ఈ డేటాతో లోన్ తీసుకున్న వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి, బెదిరింపులకు పాల్పడుతూ, అధిక వడ్డీలతో మంజూరు చేసిన రుణాలు వసూలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తూ, వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. బ్యాంకు అధికారులు కూడా అనధికార వ్యక్తులు బ్యాంకు ఖాతాలు తెరిచే సమయంలోను అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు చేసే ఖాతాలపై నిఘా పెట్టాలన్నారు. రుణ యాప్ వేధింపులు కారణంగా ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సకాలంలో ఫిర్యాదు చేస్తే, వారిపై చర్యలు చేపడతామన్నారు.

గంజాయి నిర్మూలన  

గంజాయి నిర్మూలనకు పోలీసుశాఖ సమర్థవంతంగా చర్యలు చేపట్టిందన్నారు. పోలీసుశాఖ చేపట్టిన చర్యలు ఫలితంగా ఏజన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు లేకుండా నియంత్రించామని డీజీపీ తెలిపారు. అంతేకాకుండా గిరిజనులు గంజాయికి బదులుగా వేరే పంటలతో లబ్ధి పొందే విధంగా ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ఆకస్మికంగా వాహన, లాడ్జి తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఏపీలాగా ఇతర రాష్ట్రాల్లో కూడా గంజాయిని నియంత్రించేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టినట్లయితే రానున్న 3-4 సంవత్సరాల్లో గంజాయి అక్రమ రవాణను పూర్తిగా నియంత్రించవచ్చన్నారు. మావోయిస్టు కార్యకలాపాలు ఏవోబీలో ఉన్నాయని, వారి చర్యలను నియంత్రించేందుకు ఎప్పటిలాగే పోలీసుశాఖ చర్యలు కొనసాగిస్తుందన్నారు.  పోలీసు నియామకాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం కొన్ని అంశాలను పరిశీలిస్తుందని, త్వరలో దీనిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
YS Sharmila: 20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget