అన్వేషించండి

BJP Vishnu : ఏపీలో కనుమరుగు కాబోతున్న ఓ ప్రాంతీయ పార్టీ - ఏపీబీజేపీ నమ్మకం ఏమిటంటే ?

వచ్చే ఎన్నికల తర్వాత ఏపీలో ఓ ప్రాంతీయ పార్టీ కనుమరుగు అవుతందని విష్ణువర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు.


BJP Vishnu :   ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్‌సీపీ ఉండదని తిరుపతిలో  ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోధర్ వ్యాఖ్యానించిన ఒక్క రోజులోనే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఆయన పార్టీ పేరు చెప్పకపోయినా వచ్చే ఎన్నికల తర్వాత ఓ ప్రాంతీయ  పార్టీ ఉండదని స్పష్టం చేశారు. తిరుమలలో శ్రీవారి  దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు.  ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కంటే కూడా కుటుంబ రాజకీయాలు, కుటుంబాభివృధికి ఎక్కువ రోజులు మనుగడ ఉండదని,కిరణ్ కుమార్ రెడ్డితో సహా పలువురు మాజీ కేంద్ర మంత్రులు బీజేపీ వైపు చూస్తున్నారని, కర్ణాటక ఎన్నికల అనంతరం బీజేపీ పార్టీకి నాయకులు క్యూ కడుతారని వెల్లడించారు.

మాజీ సిబిఐ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ ఒక రోజు కెసిఆర్ ను, మరొక రోజు కేటీఆర్ ను పొగుడుతూ మీడియా సమావేశం పెట్టుతున్నారని, ఇక బుధవారం నాడు ఏకంగా కేఏ పాల్ తో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి జేడీ లక్ష్మీ నారాయణ రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని ఆరోపించారు.   రాజకీయ స్వార్ధం కోసం విశాఖ ఉక్కు అనే నినాదంతో వెళ్లడం సమంజసం కాదన్నారు.. రాష్ట్ర ప్రజల ద్వారా 850 కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తామని, ఒక డొల్ల కంపెనీతో టెండర్ వేయడం జరిగిందన్నారు.. కెసిఆర్ ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నే కొనేస్తానని చెప్పడం మరో విడ్డురంగా ఉందన్నారు.. ఇవ్వని చూస్తుంటే కేఏ పాల్ స్థాయికి జేడీ లక్ష్మీ నారాయణ దిగజారి పోయారా అనే అనుమాలు వస్తున్నాయని ఆయన తెలిపారు.

ఎంపీ కావాలనే ఆశ తోటి రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నారా లేక కెసిఆర్ ట్రాప్ లో పడ్డారా అనే అనుమానం కలుగుతుందన్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారిగా పని చేసిన జయప్రకాశ్ నారాయణ మూడు నాలుగేళ్లలో పెట్టుబడులు రాకుంటే వేల మంది కార్మికులు రోడ్డున పడుతారని మాట్లాడుతున్నారని, అదే రిటైర్డ్ అయినా ఐపీఎస్ అధికారి జెడి లక్ష్మీనారాయణ మాత్రం క్రౌడ్ పుల్లింగ్ ద్వారా ఫండింగ్ చేస్తానని చెప్తున్నారని అన్నారు. ఈ డ్రామాలు రాజకీయ స్వార్ధం  కోసం చేస్తున్నారని, విశాఖ ఉక్కుపై కుట్ర జరుగుతోందని, విశాఖ ఉక్కుపై భారత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఆయన తెలియజేశారు.. బిఆర్ఎస్ పార్టీలో చేరాలనుకుంటే జేడీ లక్ష్మీ నారాయణ చేరవచ్చని, ఎంపీ టికెట్ తీసుకోవచ్చని, కెసిఆర్ విశాఖ ఉక్కునే కొనేస్తారంటా, అలాంటి వాళ్లే ఏపీ ప్రజలను అవమానిస్తారని ఆయన మండిపడ్డారు.. తెలుగు తల్లి విగ్రహాన్ని చూసి ఓర్చుకోలేని వ్యక్తి, బిఆర్ఎస్ పార్టీ పెట్టి ఆంధ్ర ప్రజలను ఎలా ఉద్ధరిస్తారో కెసిఆర్ ఏజెంట్లు చెప్పాలన్నారు.
 

కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ ద్రోహి, రాయలసీమకు నీళ్లు రాకుండా చేసిన నాయకుడు, వచ్చే ఎన్నికల అనంతరం ఓ ప్రాంతీయ పార్టీ కనుమరుగు అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. జాతీయ దృక్పధం లేని కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ఓటమి తప్పదని, బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు..  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jaisalmer Bus Fire: జైసల్మేర్ బస్సులో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి, DNA ద్వారా మృతదేహాల గుర్తింపు
జైసల్మేర్ బస్సులో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి, DNA ద్వారా మృతదేహాల గుర్తింపు
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - చీఫ్ ఫోన్ పోలీసులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - చీఫ్ ఫోన్ పోలీసులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
Andhra Liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో కీలక మలుపు-ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో SIT సోదాలు
ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో కీలక మలుపు-ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో SIT సోదాలు
Haryana News: హర్యానాలో సంచలనం - మరో పోలీస్ అధికారి ఆత్మహత్య -  ఐపీఎస్ పూరన్ సూసైడ్‌ కేసుతో లింక్
హర్యానాలో సంచలనం - మరో పోలీస్ అధికారి ఆత్మహత్య - ఐపీఎస్ పూరన్ సూసైడ్‌ కేసుతో లింక్
Advertisement

వీడియోలు

Bodyline Bowling History | క్రికెట్ కారణంగా ఆసీస్, ఇంగ్లండ్‌లు శత్రువులుగా ఎలా మారాయి? | ABP Desam
Ind vs WI 2nd Test | బౌండరీ లైన్ దగ్గర బర్గర్ తింటూ కూర్చొన్న ఈ స్టార్ట్ బ్యాటర్ ఎవరో గుర్తుపట్టారా? | ABP Desam
Ind vs Wi Mohammad Siraj | విండీస్ ప్లేయర్ జస్టిన్ గ్రీవ్స్‌కి వార్నింగ్ ఇచ్చిన మహ్మద్ సిరీజ్ | ABP Desam
Harman Preet Kaur | వన్డే వరల్డ్ కప్ 2025లో హర్మన్ కెప్టెన్సీ, ఫామ్‌పై పెరుగుతున్న విమర్శలు | ABP Desam
Rohit Sharma vs Gautam Gambhir । రోహిత్ కి షాకింగ్ కౌంటర్ ఇచ్చిన గంభీర్ | AbBP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jaisalmer Bus Fire: జైసల్మేర్ బస్సులో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి, DNA ద్వారా మృతదేహాల గుర్తింపు
జైసల్మేర్ బస్సులో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి, DNA ద్వారా మృతదేహాల గుర్తింపు
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - చీఫ్ ఫోన్ పోలీసులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - చీఫ్ ఫోన్ పోలీసులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
Andhra Liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో కీలక మలుపు-ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో SIT సోదాలు
ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో కీలక మలుపు-ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో SIT సోదాలు
Haryana News: హర్యానాలో సంచలనం - మరో పోలీస్ అధికారి ఆత్మహత్య -  ఐపీఎస్ పూరన్ సూసైడ్‌ కేసుతో లింక్
హర్యానాలో సంచలనం - మరో పోలీస్ అధికారి ఆత్మహత్య - ఐపీఎస్ పూరన్ సూసైడ్‌ కేసుతో లింక్
EPFO 100 Percent Withdraw:  EPFO నుంచి 100 శాతం డబ్బును ఒకేసారి ఎలా విత్‌డ్రా చేయవచ్చు? చాలా సులభమైన మార్గం తెలుసుకోండి!
EPFO నుంచి 100 శాతం డబ్బును ఒకేసారి ఎలా విత్‌డ్రా చేయవచ్చు? చాలా సులభమైన మార్గం తెలుసుకోండి!
RBI Offline Digital Rupee: డిజిటల్ రూపాయి యాప్ వచ్చేసింది! ఇంటర్‌నెట్ లేకపోయినా చెల్లింపు చేయొచ్చు!
డిజిటల్ రూపాయి యాప్ వచ్చేసింది! ఇంటర్‌నెట్ లేకపోయినా చెల్లింపు చేయొచ్చు!
Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ హౌస్‌ను షేక్ చేస్తున్న దివ్వెల మాధురి ! అల్లాడిపోతున్న సభ్యులు 
బిగ్‌బాస్‌ హౌస్‌ను షేక్ చేస్తున్న దివ్వెల మాధురి ! అల్లాడిపోతున్న సభ్యులు 
Virat Kohli : కొత్త లుక్‌లో 'కింగ్ కోహ్లీ'- విరాట్‌ స్టైల్‌కు అభిమానులు ఫిదా
కొత్త లుక్‌లో 'కింగ్ కోహ్లీ'- విరాట్‌ స్టైల్‌కు అభిమానులు ఫిదా
Embed widget