అన్వేషించండి

వికేంద్రీకరణ మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా- జేఏసీకి లెటర్ అందజేత

అమరావతి రైతుల పాదయాత్ర, ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన వికేంద్రీకరణ రాజకీయాల్లో కాక రేపుతోంది. నాన్ పొలిటికల్ జె.ఏ.సీ. ఆవిర్భావ సభలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.

వికేంద్రీకరణ ఉద్యమానికి మద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో తన రిజైన్ లెటర్‌ను వికేంద్రీకరణ సాధన సమితికి అందజేశారు. అవసరమైతే రాజీనామా చేస్తానంటూ మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రకటించిన గంటల్లోనే మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు అదే ప్రకటన చేశారు.

నాన్ పొలిటికల్ జె.ఏ.సీ. ఆవిర్భావ సభలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి హీట్ పుట్టించారు. విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే ముమ్మాటికీ అమరావతి రాజధానికి తాము వ్యతిరేకిస్తామన్నారు. దమ్ముంటే రాజీనామాకు అచ్చెన్నాయుడు సిద్ధ పడాలని సవాల్ చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాకు తాను సిద్ధమని అదే వేదికపై ప్రకటించారు. అంతే కాదు... స్పీకర్‌ ఫార్మాట్‌లో జె.ఏ.సీ.కన్వీనర్ కు రాజీనామా లేఖ అందజేశారు. ఎగ్జిక్యూటివ్ కెపిటల్‌కు అనుకూలంగా తాను చోడవరంలో వ్యతిరేకిస్తూ టెక్కలిలో అచ్చెన్నాయుడు పోటీకి సిద్ధమవ్వాలన్నారు. కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకించే నాయకులను రాజకీయాల నుంచి వెలివేయాలని ప్రజలకు ధర్మశ్రీ పిలుపునిచ్చారు. వారం రోజుల పాటు నియోజకవర్గ కేంద్రాల్లో విస్త్రతంగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహణకు అధికార పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.  

అమరావతి రైతుల పాదయాత్ర, ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన వికేంద్రీకరణ రాజకీయాల్లో కాక రేపుతోంది. పాదయాత్రతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రతిపక్షం, రాజీనామాలతో ప్రతిపక్షంపై ఒత్తిడి పెంచాలని అధికార పార్టీ ఎత్తుకుపైఎత్తులతో ఉత్తరాంధ్ర కుతకుత ఉడుకుతోంది. ఇన్నాళ్లూ విమర్శలకే పరిమితమైన వైసీపీ లీడర్లు ఇప్పుడు నేరుగా కార్యక్షేత్రంలోకి దిగారు. అందులో భాగంగానే ధర్మశ్రీ రాజీనామా చేశారు. మరికొందరు తాము కూడా సిద్ధమని ప్రకటించారు. 

ధర్మశ్రీ రాజీనామా పత్రాన్ని జేఏసీకి ఇచ్చిన వెంటనే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ కూడా అదే మాట వల్లెవేశారు. రాజధాని సాధన కోసం అవసరం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. నాన్ పొలిటికల్ జె.ఏ.సీ ప్రకటించిన ఉమ్మడి కార్యాచరణ ప్రకారం రాజధాని ఆకాంక్షను ప్రజలకు చెబుతామన్నారు. భారీ నిరసన ప్రదర్శనలకు రెడీ అన్నారు. 

జేఏసీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిరంతరంగా కార్యక్రమలు జరగాలి అన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌. విశాఖ రాజధానిపై జరుగుతున్న విష ప్రచారాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జాయింట్ యాక్షన్ కమిటీకి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు ఉండాలని సూచించారు. వికేంద్రీకరణకు ఉద్యమం ఉప్పెనలా ఉండాలన్నారు. అక్టోబర్ 15న విశాఖలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. అంబేడ్కర్ సర్కిల్ నుంచి వేలాది మందితో ఈ ప్రదర్శన కొనసాగించాలని సూచించారు. అమరావతి రైతులు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే ముందే నిరసన ప్రదర్శనలతో హోరెత్తిపోవాలని పిలుపునిచ్చారు. 

 

టాప్ హెడ్ లైన్స్

AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget