అన్వేషించండి

PM Modi: యోగాకు యుద్ధాలను ఆపే శక్తి ఉంది, అశాంతికి చెక్ పెట్టే ఆయుధం యోగా: ప్రధాని మోదీ

అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga day) సందర్భంగా విశాఖపట్నంలో భారీ యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

Pm Modi Performs yoga in Vizag | విశాఖపట్నం: యోగా కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిందని, యోగాకు వయసుతో పనిలేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, యోగా చేయడం ద్వారా యుద్ధాలు సైతం ఆగిపోతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా యోగాను అనుసరిస్తున్నారు. ప్రపంచానికి భారత్ అందించిన విలువైన కానుక యోగా అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం విశాఖపట్నంలో నిర్వహించిన భారీ యోగా కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ప్రధాని మోదీతో పాటు ఏపీ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, పలువరు రాష్ట్ర మంత్రులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.   ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ఒక స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.

మంత్రి లోకేష్‌కు అభినందనలు

యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు తెలిపాయి. కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిన సాధనం యోగా. ప్రకృతి, ప్రగతి సమ్మేళనంలా ఉంది విశాఖపట్నం. యోగాడే నిర్వహణపై మంత్రి నారా లోకేష్ కృషిని ప్రత్యేకంగా అభినందినలు. యోగాపై రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి నారా లోకేష్ చైతన్యం కల్పించారు. ఎంతో విశిష్టమైన యోగాంధ్ర నిర్వహణకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చొరవ చూపారు. ప్రపంచంతో మనం అనుసంధానం కావడానికి యోగా ఉపయోగపడుతుంది

ప్రపంచం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటోంది. యోగా చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పవచ్చు. యోగాలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర అద్భుతం. 175 దేశాల్లో యోగా చేయడం మామూలు విషయం కాదు. కోట్లాది మంది జీవన గతిని యోగా మార్చింది. భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాల క్షేమాన్ని కోరుకుంటోంది. వన్ ఎర్త్.. వన్ హెల్త్ యోగా లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం చాలా గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉంది. ఏపీ ప్రజలకు అభినందనలు’ తెలిపారు. ప్రధాని మోదీ

చరిత్ర సృష్టించిన వైజాగ్ యోగా డే వేడుకలు - యోగా డేలో పాల్గొన్న 2.72 లక్షల మంది - సూరత్‍ లో 1,47,952 మంది యోగా రికార్డు బ్రేక్ - బీచ్ రోడ్‍లో 26.8 కిలోమీటర్ల పొడవున యోగా - విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగా

ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు మరియు ఒలింపిక్ క్రీడలలో యోగాను చేర్చడానికి తన కార్యాలయాలను ఉపయోగించాలని ఆయన ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరారు. "యోగాలో వివిధ అంశాలలో ప్రపంచ పోటీ ప్రారంభమైంది. సెప్టెంబర్లో యోగా సూపర్ లీగ్ ప్రారంభం కావడం నాకు సంతోషంగా ఉంది" అని ముఖ్యమంత్రి అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఈ భారీ యోగా దినోత్సవంలో విశాఖపట్నం నగరంలోని ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు 26 కిలోమీటర్ల పొడవైన కారిడార్‌లో 3 లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి భారతదేశం ఒక తీర్మానాన్ని సమర్పించిన రోజును ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. "చాలా తక్కువ సమయంలో, ప్రపంచంలోని 175 దేశాలు మన దేశంతో కలిసి వచ్చాయి. నేటి ప్రపంచంలో ఈ ఐక్యత, మద్దతు సాధారణ విషయం కాదు" అని ఆయన అన్నారు. 

"యోగా మనకు శాంతిని ఇస్తుంది. యుద్ధాలకు చెక్ పెట్టే ఆయుధంగా యోగా పనిచేస్తుంది. మానవాళి మధ్య నెలకొన్న అశాంతికి యోగా ఒక విరామ బటన్" అని ప్రధాని మోదీ అన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget