అన్వేషించండి

Vizag News: రిషికొండ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్టే

రిషికొండలో అసలేం జరుగుతుంది. కొండను తవ్వేస్తూ పర్యావరణానికి ముప్పు తెస్తున్న ప్రభుత్వమంటున్న ప్రతిపక్షాలు. అనుమతులతోనే తవ్వుతున్నామని ప్రభుత్వం చెబుతోంది.

ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ షాక్ ఇచ్చింది. విశాఖ సమీపంలోని రిషికొండ వద్ద తవ్వకాలను నిలిపివెయ్యాలంటూ స్టే ఇచ్చింది . నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణం రాజు వేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ రిషి కొండపై ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే సంపూర్ణ అధ్యయనం కోసం కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీని నోడల్ ఏజెన్సీగా నియమించిన గ్రీన్ ట్రైబ్యునల్ 30 రోజుల్లోగా దాఖలు చెయ్యాలని  తెలిపింది. 
 
విశాఖకు రక్షణ ఋషి కొండ
 
విశాఖ చుట్టు పక్కల అనేక బీచ్‌లు ఉన్నా రుషికొండ, దాని చుట్టూ ఉన్న బీచ్ చాలా ముఖ్యమైనది. విశాఖకు తుపానుల బాధ లేకుండా చేసేవి ఒక పక్క డాల్ఫీన్ నోస్ కొండ అయితే మరోవైపు ఈ ఋషి కొండ దాని చుట్టు ప్రక్కల కొండలే. అయితే వాటిని ఇప్పుడు పర్యాటక అభివృద్ధి పేరుతొ తవ్వేస్తున్నారని చాలాకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ తవ్వకాలను ఆపివెయ్యాలంటూ టీడీపీ ,జనసేన పదేపదే చేస్తున్నాయి. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా రుషికొండ వద్దకు వెళ్లాలని చూసినప్పుడు ఆయన్ని పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకోవడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. అసలు అక్కడ చేపడుతున్నవి టూరిజానికి సంబంధించిన పనులే అయితే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ ప్రశ్నించింది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం అక్కడ జరుగుతున్నవి టూరిజానికి సంబంధించిన పనులే అనీ అందుకు తమకు అన్న విధాలైన అనుమతులూ ఉన్నవని చెబుతూ వస్తుంది .
 
అధికార వైసిపీకి చెందిన అసమ్మతి నేత, ఎంపీ రఘురామ కృష్ణం రాజు గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. రుషికొండపై జరుగుతున్నవి పూర్తిగా పర్యావరణానికి హాని కలిగించే కార్యక్రమాలు అంటూ పిటీషన్ దాఖలు చేసారు. దానిపై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ స్టే ఆర్డర్ ఇస్తూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఎలాంటి తవ్వకాలూ రిషికొండపై చేపట్టరాదని తెలిపింది. దీనితో ఏపీ సర్కార్ కు షాక్ తగిలిందనే చెప్పాలి . 
 
మితి మీరిన గోప్యం ఎందుకు?
 
రిషికొండ సమీపంలో ప్రభుత్వానికి చెందిన హరితా రిసార్ట్స్ ఉండేవి. ఇక్కడి అందాలను చూడడానికి వచ్చే పర్యాటకులకు ఈ రిసార్ట్స్ వసతి సౌకర్యం కల్పించేవి. అయితే అకస్మాత్తుగా వాటిని కూల్చేసిన ప్రభుత్వం ఇప్పుడు పెద్ద స్థాయి టూరిజం హోటల్ కడతామని రిషికొండను తవ్వేస్తున్నారు. అయితే ఆ మాట అధికారికంగా చెప్పడం లేదు. మరోవైపు ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం కోసం అని మరో వార్త వినబడుతుంది. అయితే భవనాలు కట్టడానికి ఏకంగా కొండను ఎందుకు తవ్వేస్తున్నారు.. సముద్ర తీర ప్రాంతంలో ఏకంగా కొండను తవ్వేయడంతో పాటు .. పెద్ద పెద్ద భవనాలు కట్టడానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని విపక్ష టీడీపీ ఆరోపిస్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ ను ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదు అనే విమర్శలు అన్ని వైపులా వెల్లువెత్తుతున్నాయి .
 
సామాన్యులకు రాకపోకలు బంద్ 
 
రుషికొండపై ప్రభుత్వం తవ్వకాలు మొదలెట్టినప్పటి నుంచీ రుషికొండ సమీపంలో సామాన్యులకు అనుమతులు బంద్ అయ్యాయి. కొండా చుట్టూ రేకులతో అడ్డుగోడ కట్టి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది జనం దృష్టిలోకి వెళ్లకుండా చేశారు. దానితో అసలు రుషికొండపై ఏం జరుగుతుందన్న సందేహాలు విశాఖలో ప్రతీ ఒక్కరి మదిలో ఉంది. ఇప్పుడా ప్రశ్నలన్నిటికీ నేషనల్ ట్రైబ్యునల్ జోక్యంతో బయట పడతాయని అంటున్నారు విశ్లేషకులు.
 
 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Tata Motors Announces Massive Discounts: టాటా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ నెలలో కొంటే ఏకంగా 3.35 లక్షల వరకు లాభం: నెక్సాన్, పంచ్ ఈవీలపై క్రేజీ ఆఫర్స్.. కర్వ్ ఈవీ పై ఊహించని రేంజ్ లో గ్రీన్ బోనస్
టాటా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ నెలలో కొంటే ఏకంగా 3.35 లక్షల వరకు లాభం: నెక్సాన్, పంచ్ ఈవీలపై క్రేజీ ఆఫర్స్..
Embed widget