అన్వేషించండి

Vizag News: రిషికొండ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్టే

రిషికొండలో అసలేం జరుగుతుంది. కొండను తవ్వేస్తూ పర్యావరణానికి ముప్పు తెస్తున్న ప్రభుత్వమంటున్న ప్రతిపక్షాలు. అనుమతులతోనే తవ్వుతున్నామని ప్రభుత్వం చెబుతోంది.

ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ షాక్ ఇచ్చింది. విశాఖ సమీపంలోని రిషికొండ వద్ద తవ్వకాలను నిలిపివెయ్యాలంటూ స్టే ఇచ్చింది . నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణం రాజు వేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ రిషి కొండపై ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే సంపూర్ణ అధ్యయనం కోసం కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీని నోడల్ ఏజెన్సీగా నియమించిన గ్రీన్ ట్రైబ్యునల్ 30 రోజుల్లోగా దాఖలు చెయ్యాలని  తెలిపింది. 
 
విశాఖకు రక్షణ ఋషి కొండ
 
విశాఖ చుట్టు పక్కల అనేక బీచ్‌లు ఉన్నా రుషికొండ, దాని చుట్టూ ఉన్న బీచ్ చాలా ముఖ్యమైనది. విశాఖకు తుపానుల బాధ లేకుండా చేసేవి ఒక పక్క డాల్ఫీన్ నోస్ కొండ అయితే మరోవైపు ఈ ఋషి కొండ దాని చుట్టు ప్రక్కల కొండలే. అయితే వాటిని ఇప్పుడు పర్యాటక అభివృద్ధి పేరుతొ తవ్వేస్తున్నారని చాలాకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ తవ్వకాలను ఆపివెయ్యాలంటూ టీడీపీ ,జనసేన పదేపదే చేస్తున్నాయి. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా రుషికొండ వద్దకు వెళ్లాలని చూసినప్పుడు ఆయన్ని పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకోవడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. అసలు అక్కడ చేపడుతున్నవి టూరిజానికి సంబంధించిన పనులే అయితే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ ప్రశ్నించింది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం అక్కడ జరుగుతున్నవి టూరిజానికి సంబంధించిన పనులే అనీ అందుకు తమకు అన్న విధాలైన అనుమతులూ ఉన్నవని చెబుతూ వస్తుంది .
 
అధికార వైసిపీకి చెందిన అసమ్మతి నేత, ఎంపీ రఘురామ కృష్ణం రాజు గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. రుషికొండపై జరుగుతున్నవి పూర్తిగా పర్యావరణానికి హాని కలిగించే కార్యక్రమాలు అంటూ పిటీషన్ దాఖలు చేసారు. దానిపై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ స్టే ఆర్డర్ ఇస్తూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఎలాంటి తవ్వకాలూ రిషికొండపై చేపట్టరాదని తెలిపింది. దీనితో ఏపీ సర్కార్ కు షాక్ తగిలిందనే చెప్పాలి . 
 
మితి మీరిన గోప్యం ఎందుకు?
 
రిషికొండ సమీపంలో ప్రభుత్వానికి చెందిన హరితా రిసార్ట్స్ ఉండేవి. ఇక్కడి అందాలను చూడడానికి వచ్చే పర్యాటకులకు ఈ రిసార్ట్స్ వసతి సౌకర్యం కల్పించేవి. అయితే అకస్మాత్తుగా వాటిని కూల్చేసిన ప్రభుత్వం ఇప్పుడు పెద్ద స్థాయి టూరిజం హోటల్ కడతామని రిషికొండను తవ్వేస్తున్నారు. అయితే ఆ మాట అధికారికంగా చెప్పడం లేదు. మరోవైపు ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం కోసం అని మరో వార్త వినబడుతుంది. అయితే భవనాలు కట్టడానికి ఏకంగా కొండను ఎందుకు తవ్వేస్తున్నారు.. సముద్ర తీర ప్రాంతంలో ఏకంగా కొండను తవ్వేయడంతో పాటు .. పెద్ద పెద్ద భవనాలు కట్టడానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని విపక్ష టీడీపీ ఆరోపిస్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ ను ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదు అనే విమర్శలు అన్ని వైపులా వెల్లువెత్తుతున్నాయి .
 
సామాన్యులకు రాకపోకలు బంద్ 
 
రుషికొండపై ప్రభుత్వం తవ్వకాలు మొదలెట్టినప్పటి నుంచీ రుషికొండ సమీపంలో సామాన్యులకు అనుమతులు బంద్ అయ్యాయి. కొండా చుట్టూ రేకులతో అడ్డుగోడ కట్టి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది జనం దృష్టిలోకి వెళ్లకుండా చేశారు. దానితో అసలు రుషికొండపై ఏం జరుగుతుందన్న సందేహాలు విశాఖలో ప్రతీ ఒక్కరి మదిలో ఉంది. ఇప్పుడా ప్రశ్నలన్నిటికీ నేషనల్ ట్రైబ్యునల్ జోక్యంతో బయట పడతాయని అంటున్నారు విశ్లేషకులు.
 
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
అమరావతి శాశ్వత రాజధానంట... మేమేమో అడుక్కు తినాలంట..! రాజధానిపై ధర్మాన కీలక వ్యాఖ్యలు
అమరావతి శాశ్వత రాజధానంట... మేమేమో అడుక్కు తినాలంట..! రాజధానిపై ధర్మాన కీలక వ్యాఖ్యలు
Visakhapatnam Crime News: డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
విశాఖలో డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Kerala Assembly Elections: కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
Donald Trump: దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
IT Rules 2021 Amendments:డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Embed widget