అన్వేషించండి

Vizag Woman Missing: బీచ్‌లో మిస్సింగ్ కేసులో వివాహిత భారీ ఝలక్, పాపం నేవీకి లక్షల్లో ఖర్చు, మొత్తం వేస్ట్!

Vizag Woman News: సాయిప్రియ సముద్రంలో గల్లంతయిందేమోనని నేవీ హెలికాప్టర్ లతో 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఇందుకోసం అధికారులు లక్షల్లో ఖర్చు పెట్టారు.

Vishakhapatnam Woman Missing News: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తప్పిపోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. బీచ్ లో సోమవారం రాత్రి (జూలై 25) మిస్సయిన సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్టు గుర్తించారు. పెళ్లి రోజు సరదాగా గడిపేందుకు దంపతులు వైజాగ్ బీచ్ కు వచ్చిన సమయంలో, భర్త ఫోన్ చూస్తుండగా సాయిప్రియ ప్రియుడితో కలిసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. సముద్రంలోకి వెళ్ళిపోయి ఉంటుందని భర్త శ్రీనివాస్ భావించారు. అయితే, నెల్లూరుకు చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లుగా తాజాగా బయటికి వచ్చింది.

శ్రీనివాస్‌తో వివాహానికి కంటే ముందు.. సాయి ప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. వివాహానికి ముందు రెండు సార్లు రవితో కలిసి సాయిప్రియ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు శ్రీనివాస్‌ను 2020 జూలై 25న పెళ్లి చేసుకుంది.

శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండడంతో ఈ జంట హైదరాబాద్‌లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి ప్రియ రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్‌ డే అని శ్రీనివాస్‌ ఈ నెల 25న హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5.30 కి భర్త తో కలిసి బీచ్‌కి వెళ్లిన సాయి ప్రియ, అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది. శ్రీనివాస్‌ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్‌ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

గాలింపు కోసం రూ.లక్షల్లో ఖర్చు..
సాయిప్రియ సముద్రంలో గల్లంతయిందేమోనని నేవీ హెలికాప్టర్ లతో 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఇందుకోసం అధికారులు లక్షల్లో ఖర్చు పెట్టారు. హెలికాప్టర్లను మోహరించి పదే పదే సముద్రంపై తప్పుతూ ఆమె కోసం రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. హెలికాప్టర్లు తిప్పేందుకు రూ.లక్షల్లో ఇంధనం ఖర్చయింది. సాయిప్రియ నెల్లూరు వెళ్లిపోవడం.. ఆమె సముద్రంలో గల్లంతైందని ఎంతో మంది అధికారులను పరుగులు పెట్టించడమే కాక, ఫ్యామిలీని కూడా ఆందోళనకు గురిచేసింది.
Vizag Woman Missing: బీచ్‌లో మిస్సింగ్ కేసులో వివాహిత భారీ ఝలక్, పాపం నేవీకి లక్షల్లో ఖర్చు, మొత్తం వేస్ట్!
Vizag Woman Missing: బీచ్‌లో మిస్సింగ్ కేసులో వివాహిత భారీ ఝలక్, పాపం నేవీకి లక్షల్లో ఖర్చు, మొత్తం వేస్ట్!

ఈ విషయమై విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ మాట్లాడుతూ.. వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ప్రస్తుతం సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని, ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Temple Priest Passes Away: అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
Revanth Reddy: హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
No Chicken: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఫియర్ - కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ ! తినడం ఆపేయాలని హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఫియర్ - కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ ! తినడం ఆపేయాలని హెచ్చరికలు
Rs 9 Crore Compensation: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, రూ.9.6 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, రూ.9.6 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Toyaguda Villagers Meet After 40 Years | నాలుగు దశాబ్దాల నాటి జ్ఞాపకాల ఊరిలో | ABP DesamDwarapudi Adiyogi Statue | కోయంబత్తూరు వెళ్లలేని వాళ్లకోసం ద్వారపూడికే ఆదియోగి | ABP DesamKarthi Visits Tirumala | పవన్ తో వివాదం తర్వాత తొలిసారి తిరుమలకు కార్తీ | ABP DesamRam Mohan Naidu Yashas Jet Flight Journey | జెట్ ఫ్లైట్ నడిపిన రామ్మోహన్ నాయుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ayodhya Temple Priest Passes Away: అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
Revanth Reddy: హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
No Chicken: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఫియర్ - కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ ! తినడం ఆపేయాలని హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఫియర్ - కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ ! తినడం ఆపేయాలని హెచ్చరికలు
Rs 9 Crore Compensation: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, రూ.9.6 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి, రూ.9.6 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
Chiranjeevi: నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్
నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్
Champions Trophy Team India Squad: ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, గాయంతో పేసర్ బుమ్రా దూరం
ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, గాయంతో పేసర్ బుమ్రా దూరం
Magha Purnima 2025 : శత్రు బాధలు దూరం చేసి మోక్షాన్నిచ్చే మాఘ పౌర్ణమి స్నానం , దానం!
శత్రు బాధలు దూరం చేసి మోక్షాన్నిచ్చే మాఘ పౌర్ణమి స్నానం , దానం!
Telugu TV Movies Today: వెంకీ ‘మల్లీశ్వరి’, రాజశేఖర్ ‘సూర్యుడు’ టు ప్రభాస్ ‘మున్నా’, ఎన్టీఆర్ ‘నాగ’ వరకు- ఈ బుధవారం (ఫిబ్రవరి 12) టీవీలలో వచ్చే సినిమాలివే
వెంకీ ‘మల్లీశ్వరి’, రాజశేఖర్ ‘సూర్యుడు’ టు ప్రభాస్ ‘మున్నా’, ఎన్టీఆర్ ‘నాగ’ వరకు- ఈ బుధవారం (ఫిబ్రవరి 12) టీవీలలో వచ్చే సినిమాలివే
Embed widget