అన్వేషించండి

OBC List: ఆ కులాలను ఓబీసీల్లో చేర్చేలా ప్రయత్నాలు - శ్రీకాకుళం ప్రజాప్రతినిధులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా

Delhi: ఉత్తరాంధ్రలో వెనుకబడిన ఐదు కులాలను ఓబీసీల్లో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు.

Union Minister Rammohan Naidu:  ఉత్తరాంధ్రలోని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తూర్పుకాపు, కళింగ వైశ్య, శిష్టకరణ, శొండి, అరవ కులాలను ఓబీసీ జాబితాలో చేర్పించాలని  కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీగా మొదటి సారి ఎన్నికలయినప్పటి నుండి పదేపదే పార్లమెంట్ దృష్టిలో కూడా ప్రస్తావించారు.  ఈ సామాజిక వర్గాలను ఓబీసీలుగా చేర్చేందుకు త్వరితగతిన రిజిస్ట్రేషన్ అమలయ్యేలా చూడాలని తాజాగా కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి దృష్టికి రామ్మోహన్నాయుడు తీసుకెళ్లారు. 

కేంద్రమంత్రిని కలిసిన శ్రీకాకుళం జిల్లా ప్రజా ప్రతినిధులు   

కేంద్రమంత్రిగా ఉన్నా ఉత్తరాంధ్రలో వెనుక బడిన ఈ సామాజిక వర్గాలను ఓబీసీ జాబితాలో చేర్పించేందుకు విక్రమార్కుడిలా పట్టుబడుతూ ముందుకె ళ్లడం పట్ల సిక్కోలు జిల్లాలోని ఆ సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేసుకున్నారు. ఈ మేరకు  కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరేంద్ర కుమార్నురామ్మోహన్ నాయుడు కలిసి గత పదేళ్లుగా పార్లమెంట్లో, ఎన్బీసీ కమిషన్లో పోరాడుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పలాస ఎమ్మెల్యే శిరీషతో కలిసి కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్తో అనేక విషయాలపై చర్చించారు.  తూర్పుకాపు, కళింగవైశ్య, శిష్ఠకరణ, సోండి, అరవ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకతను రామ్మోహన్ నాయుడు ఆయనకు వివరించారు. దీనిపై గతంలో ఎన్సీబీసీ చైర్మన్ గంగారాం ఆహిర్ ఆధ్వర్యంలో ఐదు సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులతో సామాజిక వేదిక నిర్వహించామని తెలిపారు. ఈ అంశంపై తాను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నామని, దీనిని ప్రాధాన్యతగా గుర్తించడంతో పాటు త్వరితగతిన రిజిస్ట్రేషన్ అమలయ్యేలా చూడాలని విన్నవించారు.

పూండి రైల్వే స్టేషన్, బెండి గేటు  పనులు చేపట్టాలి

శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ప్రాధాన్యమైన ఉద్దానంలో ఉన్న పూండి రైల్వే స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ను కలుసుకున్నారు. కరోనా ముందు పూండిలో భువనేశ్వర్ - సికింద్రాబాద్ (విశాఖ ఎక్స్ ప్రెస్), భువనేశ్వర్ బెంగళూరు (ప్రశాంతి ఎక్స్ ప్రెస్), పూరీ - తిరుపతి ఎక్స్ ప్రెస్ రైళ్ల నిలుపుదల చేసేవారని గుర్తు చేశారు. వజ్రపు కొత్తూరు, నందిగాం, సంతబొమ్మాళి మండలాలకు చెందిన ప్రజలు ఈ స్టేషన్ పైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. ప్రాధాన్యతను గుర్తించి, ఆయా రైళ్ల నిలుపుదలను పునః ప్రారంభించాలని కోరారు. అలాగే... పూండి రైల్వే స్టేషన్లో తాగునీరు, ప్రయాణికుల విశ్రాంతి భవనాలు, మరుగుదొడ్లు, రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. దీనితో పాటు నత్తనడకన సాగుతున్న బెండి గేటుఫై ఓవర్ పనులను వేగవంతం చేసి, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని వివరించారు.

పెంండింగ్‌లో ఉన్న రైల్వే పనులు పూర్తి చేయాలి! 

 పలాస,  కాశీబుగ్గ ఎల్సీ గేటు వద్ద నిలిచిపోయిన రైల్వే ఫుట్ ఓవ ర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తిచేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఆయన కార్యా లయంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పలాస ఎమ్మెల్యే శిరీష రైల్వేమంత్రిని కలిశారు. గత కొంతకాలంగా ఆ పను లు నెమ్మదిగా కొనసాగేందుకు కారణాలను ఆయన కు వివరించారు. రద్దీగానుండే పలాస రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో ఈ నిర్మాణం కొనసాగుతోండ డం, ట్రైన్ ట్రాఫిక్ కారణాలతో అత్యవసర పరిస్థితు ల్లో వాహనాలు నిలిచిపోతున్నాయని, ప్రాణాపాయ పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించారు. ఆర్ వోబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకురా వాలని కోరారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పం దించి, ఆర్వోబీ నిర్మాణానికి హామీనిచ్చారు.ఎన్నికల ముందు కొన్ని హామీలను ఇచ్చాను ఎంపీగా కొనసాగుతూ ఇప్పుడు కేంద్రమంత్రి అయ్యాను జిల్లాలో నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఖచ్చితంగా కొన్ని పనులు అంటూ నెరవేర్చాలి అని సంబంధిత శాఖ మంత్రులతో జిల్లా భౌగోళిక పరిస్థితులను వివరించారు. గత కొన్నేళ్లుగా ఈ జిల్లాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక్కడ సమస్యలు అక్కడే ఉండిపోయాయి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే సరి అవి క్లియర్ చేయాలని కోరారు.

 

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Visakhapatnam Airport Service Ends: కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget