అన్వేషించండి

OBC List: ఆ కులాలను ఓబీసీల్లో చేర్చేలా ప్రయత్నాలు - శ్రీకాకుళం ప్రజాప్రతినిధులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా

Delhi: ఉత్తరాంధ్రలో వెనుకబడిన ఐదు కులాలను ఓబీసీల్లో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు.

Union Minister Rammohan Naidu:  ఉత్తరాంధ్రలోని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తూర్పుకాపు, కళింగ వైశ్య, శిష్టకరణ, శొండి, అరవ కులాలను ఓబీసీ జాబితాలో చేర్పించాలని  కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీగా మొదటి సారి ఎన్నికలయినప్పటి నుండి పదేపదే పార్లమెంట్ దృష్టిలో కూడా ప్రస్తావించారు.  ఈ సామాజిక వర్గాలను ఓబీసీలుగా చేర్చేందుకు త్వరితగతిన రిజిస్ట్రేషన్ అమలయ్యేలా చూడాలని తాజాగా కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి దృష్టికి రామ్మోహన్నాయుడు తీసుకెళ్లారు. 

కేంద్రమంత్రిని కలిసిన శ్రీకాకుళం జిల్లా ప్రజా ప్రతినిధులు   

కేంద్రమంత్రిగా ఉన్నా ఉత్తరాంధ్రలో వెనుక బడిన ఈ సామాజిక వర్గాలను ఓబీసీ జాబితాలో చేర్పించేందుకు విక్రమార్కుడిలా పట్టుబడుతూ ముందుకె ళ్లడం పట్ల సిక్కోలు జిల్లాలోని ఆ సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేసుకున్నారు. ఈ మేరకు  కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరేంద్ర కుమార్నురామ్మోహన్ నాయుడు కలిసి గత పదేళ్లుగా పార్లమెంట్లో, ఎన్బీసీ కమిషన్లో పోరాడుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పలాస ఎమ్మెల్యే శిరీషతో కలిసి కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్తో అనేక విషయాలపై చర్చించారు.  తూర్పుకాపు, కళింగవైశ్య, శిష్ఠకరణ, సోండి, అరవ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకతను రామ్మోహన్ నాయుడు ఆయనకు వివరించారు. దీనిపై గతంలో ఎన్సీబీసీ చైర్మన్ గంగారాం ఆహిర్ ఆధ్వర్యంలో ఐదు సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులతో సామాజిక వేదిక నిర్వహించామని తెలిపారు. ఈ అంశంపై తాను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నామని, దీనిని ప్రాధాన్యతగా గుర్తించడంతో పాటు త్వరితగతిన రిజిస్ట్రేషన్ అమలయ్యేలా చూడాలని విన్నవించారు.

పూండి రైల్వే స్టేషన్, బెండి గేటు  పనులు చేపట్టాలి

శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ప్రాధాన్యమైన ఉద్దానంలో ఉన్న పూండి రైల్వే స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ను కలుసుకున్నారు. కరోనా ముందు పూండిలో భువనేశ్వర్ - సికింద్రాబాద్ (విశాఖ ఎక్స్ ప్రెస్), భువనేశ్వర్ బెంగళూరు (ప్రశాంతి ఎక్స్ ప్రెస్), పూరీ - తిరుపతి ఎక్స్ ప్రెస్ రైళ్ల నిలుపుదల చేసేవారని గుర్తు చేశారు. వజ్రపు కొత్తూరు, నందిగాం, సంతబొమ్మాళి మండలాలకు చెందిన ప్రజలు ఈ స్టేషన్ పైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. ప్రాధాన్యతను గుర్తించి, ఆయా రైళ్ల నిలుపుదలను పునః ప్రారంభించాలని కోరారు. అలాగే... పూండి రైల్వే స్టేషన్లో తాగునీరు, ప్రయాణికుల విశ్రాంతి భవనాలు, మరుగుదొడ్లు, రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. దీనితో పాటు నత్తనడకన సాగుతున్న బెండి గేటుఫై ఓవర్ పనులను వేగవంతం చేసి, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని వివరించారు.

పెంండింగ్‌లో ఉన్న రైల్వే పనులు పూర్తి చేయాలి! 

 పలాస,  కాశీబుగ్గ ఎల్సీ గేటు వద్ద నిలిచిపోయిన రైల్వే ఫుట్ ఓవ ర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తిచేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఆయన కార్యా లయంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పలాస ఎమ్మెల్యే శిరీష రైల్వేమంత్రిని కలిశారు. గత కొంతకాలంగా ఆ పను లు నెమ్మదిగా కొనసాగేందుకు కారణాలను ఆయన కు వివరించారు. రద్దీగానుండే పలాస రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో ఈ నిర్మాణం కొనసాగుతోండ డం, ట్రైన్ ట్రాఫిక్ కారణాలతో అత్యవసర పరిస్థితు ల్లో వాహనాలు నిలిచిపోతున్నాయని, ప్రాణాపాయ పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించారు. ఆర్ వోబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకురా వాలని కోరారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పం దించి, ఆర్వోబీ నిర్మాణానికి హామీనిచ్చారు.ఎన్నికల ముందు కొన్ని హామీలను ఇచ్చాను ఎంపీగా కొనసాగుతూ ఇప్పుడు కేంద్రమంత్రి అయ్యాను జిల్లాలో నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఖచ్చితంగా కొన్ని పనులు అంటూ నెరవేర్చాలి అని సంబంధిత శాఖ మంత్రులతో జిల్లా భౌగోళిక పరిస్థితులను వివరించారు. గత కొన్నేళ్లుగా ఈ జిల్లాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక్కడ సమస్యలు అక్కడే ఉండిపోయాయి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే సరి అవి క్లియర్ చేయాలని కోరారు.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget