అన్వేషించండి

Lokesh Election campaign: నేటి నుంచే లోకేశ్ ఎన్నికల శంకారావం, ఇచ్చాపురం నుంచి మలివిడత ప్రచారం ప్రారంభం

Sankaravam Strart: తెలుగుదేశం యువనేత నారా లోకేశ్ నేటి నుంచి మలివిడత ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇచ్ఛాపురం నుంచి ఆయన సమర శంఖారావం పూరించనున్నారు

Lokesh Yatra: స్పల్ప విరామం అనంతరం మరోసారి నారా లోకేశ్(Lokesh) నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. యువగళం పేరిట రాష్ట్రవ్యాప్తంగా 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన లోకేస్ ఇప్పుడు శంఖారావం అంటూ ప్రజల్లోకి వెళ్లనున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం(Ichapuram)లో తొలి బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అంతకు ముందు భారీ రోడ్ షోలో ఆయన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.

సమర శంఖారావం
తెలుగుదేశం యువనేత, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Lokesh) నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఇచ్ఛాపురం రాజావారి గ్రౌండ్స్  నుంచి ఆయన కొత్త యాత్ర శంఖారావానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలుత బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి(TDP) యాప్ లో ప్రతిభకనబర్చిన 50మంది కార్యకర్తలను ఆయన అభినందించనున్నారు లోకేష్ అభినందన. బహిరంగ సభ అనంతరం.. ఇచ్చాపురం నియోజకవర్గ పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖిగా మాట్లాడనున్నారు. రానున్న ఎన్నికలకు ఎలా సమాయత్తమవ్వాలి.ప్రచారంలో ఏవిధంగా ముందుకు దూసుకుపోవాలి..ప్రత్యర్థిలకు ఎలా కౌంటర్ ఇవ్వాలన్న సూచనలు చేయనున్నారు. అధికార పార్టీకి ఏమాత్రం భయపడొద్దని...తెలుగుదేశం అన్ని విధాల అండగా ఉంటుందని అభయమివ్వనున్నారు.రాబోయే ప్రభుత్వం తెలుగుదేశానిదేనని భరోసా కల్పించనున్నారు. ఇచ్ఛాపురంలో యాత్ర ముగించుకుని ఆయన మధ్యాహ్నానికి పలాస చేరుకోనున్నారు.

యువనేత లోకేష్ పలాస(Palasa) నియోజకవర్గానికి చేరి కోనున్నారు. భోజన విరామం అనంతరం ..అక్కడ నిర్వహించే బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించనున్నారు.చివరిగా సాయంత్రం టెక్కలి(Tekkali)లో నిర్వహించే బహిరంగ సభలో లోకేశ్ పాల్గొననున్నారు. మూడు బహిరంగ సభలు ముగించుకుని నరసన్నపేట శివారులోని జమ్ము గ్రామంలో లోకేశ్ బస చేయనున్నారు.

రోజుకు మూడు సభలు
ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో  లోకేశ్ సైతం ప్రచార వేగం పెంచారు. గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా ఆయన సరాసరి రోజుకు 15 కిలోమీటర్లు నడిచేవారు. ఒక్కో నియోజకవర్గంలోనే వారం రోజులకు పైగా యాత్ర కొనసాగించేవారు. కానీ ఇప్పుడు అంత సమయం లేకపోవడంతో ….ఒకేరోజు 3 నియోజకవర్గాలను కవర్ చేస్తున్నారు. బహిరంగ సభలు, కేడర్ తో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. యువగళం పాదయాత్రలో కవర్ చేయని నియోజకవర్గాల్లో ఈసారి లోకేశ్ శంఖారావం సభలు నిర్వహంచేలా ప్లాన్ చేశారు. ఈ విధంగా ఆయన దాదాపు 175 నియోజకవర్గాలు పర్యటించనున్నారు. నెలరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండటంతో ఈలోపు యాత్రను పూర్తిచేయనున్నారు.

ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే...సీట్ల సర్దుబాటు, పోలింగ్ ఏర్పాట్లు, అభ్యర్థులకు నగదు సర్దుబాటుతోపాటు  చంద్రబాబు(CBN)తో కలిసి భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు వంటి చాలా కార్యక్రమాలు ఉండటంతో ఆయన ముందుగానే శంఖారావం యాత్రలకు శ్రీకారం చుట్టారు. యువగళం పాదయాత్రకు ఎక్కడలేని స్పందన రావడంతో...శంఖారావం బహిరంగ సభలను సైతం అదే విధంగా విజయవంతం చేసేలా తెలుగుదేశం పార్టీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉత్తరాంధ్ర పర్యటన కోసం ఇప్పటికే లోకేశ్ విశాఖ(VIZAG) చేరుకోగా....పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా రోడ్డుమార్గంలో  ఇచ్చాపురం వెళ్లారు. మొదటి విడతలో 11 రోజుల పాటు రోజుకు మూడు చొప్పున ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో లోకేశ్‌ సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. మొత్తం  '120 నియోజకవర్గాల్లో 40 రోజులు శంఖారావం కొనసాగుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget