అన్వేషించండి

Viral News: ఆ మాస్టారు పాటలు పాడితే విద్యార్థులకు మార్కులు వస్తున్నాయ్

శంకరరావు ప్రస్తుతం విజయనగరం జిల్లా గంగచోళ్లపెంట ఉన్నత పాఠశాలలో సోషల్ టీచరుగా పని చేస్తున్నారు. 1998 నుంచి ఆయన వివిధ వాద్య పరికరాలతో కళారూపాలను ప్రదర్శిస్తూ...పాఠాలను బోధిస్తున్నారు.

కోలాటం, పాట, నృత్యం, బుర్రకథలాంటి వివిధ కళారూపాలతో హైస్కూల్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఈయన పేరు బొంతలకోటి శంకరరావు. ఈ కళారూపాల ప్రదర్శనలో హార్మోనియం, కీబోర్డ్, గిటార్, కంజిర, తప్పెటగుళ్లు ఉపయోగిస్తూ గత 24 ఏళ్లుగా పాఠాలు చెప్తున్నారు. పాటల ద్వారా పాఠాలు అనే కాన్పెస్ట్ తో విద్యార్థులను ఆకట్టుకుంటూ తరగతి గదిపై విద్యార్థులకు ఆసక్తి పెంచుతున్నారు. ఉపాధ్యాయుడు శంకరరావు మూడు రాష్ట్రపతి అవార్డులతోపాటు ఐకరాజ్యసమితి నుంచి కూడా అవార్డు అందుకున్నారు.
Viral News: ఆ మాస్టారు పాటలు పాడితే విద్యార్థులకు మార్కులు వస్తున్నాయ్

శంకరరావు ప్రస్తుతం విజయనగరం జిల్లా గంగచోళ్లపెంట ఉన్నత పాఠశాలలో సోషల్ టీచరుగా పని చేస్తున్నారు. 1998 నుంచి ఆయన వివిధ వాద్య పరికరాలతో కళారూపాలను ప్రదర్శిస్తూ...పాఠాలను బోధిస్తున్నారు. తాను చెప్పే సాంఘిక శాస్త్రం పాఠాల్లోని ఏ పాఠాన్ని ఏ విధమైన కళారూపంలో చెప్తే బాగుంటుందో అలాగే పాఠాలు చెప్తారు. ఈ విధానం వలన పిల్లల్లో ఒత్తిడి సైతం తగ్గుతుందని శంకరరావు తెలిపారు.  

స్కూల్‌ విడిచిపెట్టినప్పుడు విద్యార్థులు ఎంత ఉత్సాహంగా ఇంటికి వెళ్తారో అదే ఉత్సాహంతో తర్వాత రోజు మళ్లీ స్కూల్‌కు రావాలి. అప్పుడే విద్య పట్ల విద్యార్థుల్లో మక్కువ పెరుగుతుంది. నేర్చుకోవాలన్న తపన ఏర్పడుతుంది. ఈ రోజు కొత్తగా పాఠం నేర్చుకుందాం, పాట నేర్చుకుందాం, జానపద కళారూపం నేర్చుకుందామనే భావంతో డిఫరెంట్‌గా పాఠాలు చెప్తున్నారు శంకరరావు.
Viral News: ఆ మాస్టారు పాటలు పాడితే విద్యార్థులకు మార్కులు వస్తున్నాయ్

ఉపాధ్యాయులు శంకరరావు స్వయంగా సంగీత వాయిద్యాలను వాయిస్తూ పాఠాలు చెప్పడమే కాకుండా...పిల్లలను కూడా అందులో భాగస్వామ్యం చేస్తారు. దాని వలన పిల్లలు తరగతి గదంటే నాలుగు గోడలనే కాకుండా...కళాలతో పాటు విజ్ఞానాన్ని పొందే వేదికగా చూస్తారని సోషల్ సైన్సెస్ టీచర్ శంకరరావు అంటున్నారు. తరగతి గదిలోనూ, పాఠశాల ప్రాంగణంలోనూ ఆట, పాటలతో ఆనందకర వాతావరణంలో పాఠ్యాంశాలు బోధించడం వలన విద్యార్థులకు పాఠ్యాంశాలు బాగా  అర్థమవుతాయని తెలిపారు.  

సోషల్ సైన్స్‌ పాఠాలంటే చాలా మంది విద్యార్థులు బోర్‌ ఫీల్ అవుతారు. అలా ఫీలవ్వకుండా...వాళ్లు ఈ లెసన్ ని ఆడుతూ, పాడుతూ చేయాలనే భావంతోని పాట రూపంలో చెబుతున్నారు. స్వాతంత్రోద్యమాన్ని ఒక బుర్రకథ రూపంలో...ఆ తరగతిలో ఉన్న ముగ్గురు విద్యార్థులతో...మిగతా విద్యార్థులకు బుర్రకథ రూపంలో చెప్పిస్తున్నారు. 

విద్య, వైద్య, వైజ్ఞానిక, సామాజిక అంశాలపై పాటలు రాయడం, రచనలు చేయడం, వాటికి అవసరమైన బాణీలను కట్టడంలో కూడా శంకరరావు దిట్ట. విభిన్నమైన బోధనపద్దతులతోపాటు జీవి వైవిధ్యంలో ఈయన కృషి చేస్తారు. అందుకుగాను మూడు రాష్ట్రపతి అవార్డులు, ఐకరాజ్యసమితి జీవవైవిద్య అంతర్జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. పాఠ్యాంశాలకు సామాజిక అంశాలను కలిపి పాటల రూపంలో పాఠాలు వినడం ఆసక్తికరంగా ఉందని, పాఠాలు కూడా బాగా గుర్తుంటున్నాయని విద్యార్థులు అంటున్నారు.
Viral News: ఆ మాస్టారు పాటలు పాడితే విద్యార్థులకు మార్కులు వస్తున్నాయ్

"6 నుంచి 10 వరకు మాకు సారే చెప్తున్నారు. పాఠాలను పాటలలో చెప్పడం మాకు చాలా అర్థమవుతున్నాయి. మాకు మాములుగా కన్నా...పాటలలో చెప్పడం, సరదాగా చెప్పడంతో బాగా అర్థమవుతున్నాయి." అని విద్యార్థులు చెబుతున్న మాట. 

ఇటువంటి మాస్టారు మారేక్కడ దొరకరు. పాటలు రూపంలో పాఠాలు చెప్తూ...కళాత్మాకంగా తప్పెటగుళ్లు, బుర్రకథల రూపంలో ప్రదర్శనలు చేస్తున్నారు. లెసన్ చెప్పాలంటే పది పేజీలుంటుంది. అవన్నీ చదివిసి గుర్తుపెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అదే పాట రూపంలో మెయిన్ పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే ఫైనల్ ఎగ్జామైనా రాసేయవచ్చు. అలా చరిత్రకు సంబంధించి బోలెడు రచనలు కూడా చేశారు శంకరరావు మాస్టారు.
Viral News: ఆ మాస్టారు పాటలు పాడితే విద్యార్థులకు మార్కులు వస్తున్నాయ్

శంకరరావు టీచర్ ఏ స్కూల్ లో పని చేసినా ఆయన ఇదే విధంగా బోధన చేస్తుంటారు. దీంతో ఆయనతోపాటు పని చేసే సహాపాధ్యాయులు సైతం ఆయన చెప్పే విధానానికి ఆకర్షితులవుతారు. పిల్లలకు ఏ విధంగా పాఠాలు చెప్తే ఆసక్తిగా వింటారో శంకరరావు టీచర్ కు బాగా తెలుసునని చెప్తున్నారు

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget