అన్వేషించండి

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Coromandel Express Accident: ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం నుంచి ఓ నూతన దంపతులు తప్పించుకున్నారు. తమకు కావాల్సినట్లు సీట్లు రాలేదని తీసుకున్న నిర్ణయం వారి ప్రాణాలు కాపాడింది.

Coromandel Express Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం దేశంతో పాటు ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. శుక్రవారం రాత్రి జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు, యశ్వంత్ పూర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 800కు పైగా బాధితులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ తమకు కావాల్సిన విధంగా సీట్లు రాలేదని, టికెట్లు క్యాన్సిల్ చేసుకున్న ఓ కొత్త జంట విషయం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. రెగ్యూలర్ గా తన మాట మీదనే ఉండేవాడు. కానీ లక్కీగా ఆరోజు భార్య మాట వినడంతో తామిద్దరం ప్రాణాలతో ఉన్నామని చెబుతున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి..

పక్క పక్కన సీట్లు రాలేదని టికెట్ క్యాన్సిల్..
నవ దంపతులు దుర్గా ప్రసాద్, లిప్సి ఒడిశాలోని బాలసోర్ కి చెందిన వారు. అక్క ఇంటికి చుట్టపు చూపుగా వైజాగ్ రావడానికి వీళ్లు మొదట హౌరా నుంచి చెన్నై వెళ్లే కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలులో ఏసీ కోచ్ లో టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ తమకు పక్క పక్కన సీట్లు రాలేదని జూన్ 2న బయలుదేరే రైలు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారు. అదే వారిని కాపాడిందని చెప్పవచ్చు. అంతకుముందు రోజు వెళ్లే రైలులో టికెట్లు బుక్ చేసుకుని విశాఖకు వచ్చారు దుర్గా ప్రసాద్, లప్సి దంపతులు. మరుసటి రోజు టీవీలో రైలు ప్రమాదం జరిగిన ఘటన గురించి చూసి కొత్త జంట షాకైంది. ఒకవేళ ముందుగా బుక్ చేసుకున్నట్లుగా కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేసింటే తమ పరిస్థితి ఎలా ఉండేదోనని ఊహించుకుంటేనే భయమేస్తుంది అంటోంది కొత్త జంట. పూరి జగన్నాథుడే తమను కాపాడాడు అంటున్నారు దుర్గా ప్రసాద్ దంపతులు. దేవుడి ఆశీస్సులు తమకు ఉన్నాయని, లేకపోతే తమ పరిస్థితి ఇలా ఉండకపోయేదని చెబుతున్నారు. ఏది ఏమైతేనేం రైలు ప్రమాదం ఘటనలో ఒక్కో మనిషిని కదిలిస్తే ఒక్కో కొత్త విషయం బయటకొస్తోంది.

దుర్గా ప్రసాద్ దంపతులు ఏబీపీ దేశంతో మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీన కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు రిజర్వేషన్ చేసుకున్నాం. కానీ సీట్లు పక్కపక్కన రాలేదు. దాంతో టికెట్లు క్యాన్సిల్ చేద్దామని భార్య చెప్పగా, క్యాన్సిల్ చేశాడు. తమ ప్రయాణాన్ని ఒకరోజు ముందుకు జరుపుకుని, జూన్ 1న వచ్చినట్లు తెలిపాడు. తాము విశాఖకు వచ్చిన మరుసటి రోజు రాత్రి టీవీలో ఒడిశాలో ఏదో రైలు ప్రమాదం జరిగిందని చూశాను, కానీ ఉదయం లేచి చూస్తేగానీ అది ఎంత పెద్ద రైలు ప్రమాదమే తనకు అర్థం కాలేదన్నాడు దుర్గా ప్రసాద్. తాము చాలా లక్కీ అని, దేవుడి దయ వల్ల ప్రాణాలతో ఉన్నామన్నాడు. ఒడిశాకు చెందిన వ్యక్తి అయినా వైజాగ్ లో కొన్నేళ్లపాటు జాబ్ చేయడంతో తనకు తెలుగు బాగా వచ్చు అని చెప్పాడు. గతంలో జాజ్ పూర్ లో రైలు ప్రమాదం జరిగిందని, కానీ గూడ్స్ రైలు కావడంతో పెద్ద నష్టం జరగలేదన్నాడు దుర్గా ప్రసాద్. తమ విషయంలో ఇరు కుటుంబసభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pinkvilla Screen And Style Awards: ముంబయిలో ఘనంగా జరిగిన అవార్డుల వేడుక, విభిన్న డ్రెస్సుల్లో తారలుRajamouli Mahesh Babu Movie: జపాన్ లో RRR స్క్రీనింగ్స్ సందర్భంగా మహేష్ మూవీ అప్డేట్ ఇచ్చిన జక్కన్నShraddha Kapoor Pizza Paparazzi: పింక్ విల్లా స్క్రీన్ అండ్ స్టయిల్ అవార్డుల్లో ఆసక్తికర ఘటనAnupama Parameswaran Tillu Square Song Launch: అనుపమ మాట్లాడుతుంటే ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Home Loan: క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
Embed widget