News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

విశాఖలో సంపులో దూకి తల్లిపిల్లలు ఆత్మహత్య!

విశాఖ పట్టణంలో ఘోరం జరిగింది. ఇద్దరు పిల్లలతో పాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది. మర్రిపాలెంలోని ప్రకాష్‌ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్‌ లో చోటుచేసుకుంది.

FOLLOW US: 
Share:

విశాఖ పట్టణంలో ఘోరం జరిగింది. ఇద్దరు పిల్లలతో పాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మర్రిపాలెంలోని ప్రకాష్‌ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్‌ లో చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న మహిళను సంధ్యగా గుర్తించారు. 

సంధ్య, ఆమె భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఓ అపార్ట్‌మెంట్ లో ఉంటున్నారు. ఆ అపార్ట్ మెంట్‌ కి సంధ్య భర్త వాచ్ మెన్‌ గా ఉండగా, సంధ్య ఆ అపార్ట్‌ మెంట్‌ లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది.

వీరికి గౌతమ్‌ (9), అలేఖ్య  (5) అనే పిల్లలు ఉన్నారు. మంగళవారం ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. ఇద్దరు పిల్లలతో కలిసి సంధ్య ఆత్మహత్య చేసుకుంది. గత రాత్రి నుంచి పిల్లలు, సంధ్య కనపడకపోవడంతో భర్త ఆందోళనకు గురయ్యాడు. వెంటనే అందరికీ సమాచారం అందించాడు.

అపార్ట్ మెంట్ లోని నీటి సంపు డోర్‌ తీసి ఉంచడంతో అనుమానం వచ్చి అందులో వెతకగా.. మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో సంపులో నుంచి మృతదేహాలను బయటకు తీసి.. పోలీసులకు సమాచారం అందించారు. సంధ్యతోపాటు పిల్లలు కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అయితే సంధ్యకు, ఆమె భర్తకు ఎలాంటి విభేదాలు లేవని, ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమి లేవని అపార్ట్‌మెంట్‌ వాసులు చెబుతున్నారు. కానీ పిల్లలను స్కూల్ కి తీసుకుని వెళ్లే ఆటో వ్యక్తితో సంధ్య సన్నిహితంగా ఉండటంతో .. ఇది కరెక్ట్ కాదని హెచ్చరించినట్లు వారు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఇలా ఆమెతో పాటు ఏమీ తెలియని చిన్న పిల్లల్ని కూడా చంపడం దారుణమని అపార్ట్ మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కాగా ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సంధ్య భర్తని, ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాలను బయటకు తీసి కేజీహెచ్ కు తరలించారు.

Published at : 09 Aug 2023 02:36 PM (IST) Tags: Suicide Vishakhapatnam woman and children

ఇవి కూడా చూడండి

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

AP Politics: జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఈరోజు జనసైనికులు సైతం మోత మోగించాలి - నాదెండ్ల పిలుపు

AP Politics: జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఈరోజు జనసైనికులు సైతం మోత మోగించాలి - నాదెండ్ల పిలుపు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు