News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ఏపీ మృతుని కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా

ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి అమర్నాథ్

FOLLOW US: 
Share:

ఒడిశా రాష్ట్రంలోని బహనగ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ఆదివారం (జూన్ 4) ఉదయం ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో దెబ్బతిన్న మూడు ట్రాక్ ల పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుంది అని అధికారులను ప్రశ్నించగా, ఆదివారం సాయంత్రానికి ఒక ట్రాక్ అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. ఘటనా స్థలంలో ట్రాక్ మరమ్మతు తదితర కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్న సిబ్బందికి, అధికారులకు స్థానికులు అందిస్తున్న సహకారాన్ని చూసిన మంత్రి అమర్నాథ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదొక విషాదకరమైన సంఘటనని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇక్కడ జరిగిన రైలు ప్రమాదంలో మానవ తప్పిదం కచ్చితంగా ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డిజిటలైజేషన్ పురోగతిలో ఉన్న  నేపథ్యంలో ఇటువంటి ప్రమాదాలు జరగటం దురదృష్టకరమని అన్నారు. భారతీయ రైల్వే  వందే భారత్ వంటి అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్న సమయంలో ఇంత ఘోర ప్రమాదాన్ని నివారించడంలో రైల్వే శాఖ ఎలా విఫలమైందని అమర్నాథ్ ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించడం ద్వారా, ప్రజల్లో భారతీయ రైల్వే పై నమ్మకం సడలిపోకుండా చూడాలని ఆయన కోరారు.

కాగా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గురుమూర్తి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని, అలాగే క్షతగాత్రులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు.

Published at : 04 Jun 2023 02:02 PM (IST) Tags: Gudivada Amarnath Train Accident Odisha accident Coromandal Train

ఇవి కూడా చూడండి

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష

Fake Universities: దేశంలో నకిలీ యూనివర్సిటీల జాబితా వెల్లడి, ఏపీలో రెండు 'ఫేక్' వర్సిటీలు

Fake Universities: దేశంలో నకిలీ యూనివర్సిటీల జాబితా వెల్లడి, ఏపీలో రెండు 'ఫేక్' వర్సిటీలు

AP EDCET: బీఎడ్ కౌన్సెలింగ్, జాబితా నుంచి 18 కళాశాలలు తొలగింపు

AP EDCET: బీఎడ్ కౌన్సెలింగ్, జాబితా నుంచి 18 కళాశాలలు తొలగింపు

APBIE: ఇంటర్‌ విద్యార్థులకు 'స్టడీ అవర్స్', వారికి 'హాజరు' ఫీజు గడువు నవంబరు 30 వరకు

APBIE: ఇంటర్‌ విద్యార్థులకు 'స్టడీ అవర్స్', వారికి 'హాజరు' ఫీజు గడువు నవంబరు 30 వరకు

వైసీపీ మంత్రులు, నేతలు మరణశాసనం రాసుకుంటున్నారు: మాజీ మంత్రి గంటా

వైసీపీ మంత్రులు, నేతలు మరణశాసనం రాసుకుంటున్నారు: మాజీ మంత్రి గంటా

టాప్ స్టోరీస్

Lokesh No Arrest : లోకేష్‌కు అరెస్టు ముప్పు తప్పినట్లే - అన్ని కేసుల్లో అసలేం జరిగిందంటే ?

Lokesh No Arrest :   లోకేష్‌కు అరెస్టు ముప్పు తప్పినట్లే  - అన్ని  కేసుల్లో అసలేం జరిగిందంటే ?

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!