అన్వేషించండి

Pawan Kalyan About CM Post: సీఎం పదవికి సిద్ధం, ఎన్నికల ఫలితాల తర్వాతే నిర్ణయం- పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Janasena Chief Pawan Kalyan: ఓట్లు చీలకూడదన్నదే జనసేన ఉద్దేశం అని, ఏదైనా సరే ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉంటాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Janasena Chief Pawan Kalyan: విశాఖపట్నం: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొత్తులు హాట్ టాపిక్ అవుతున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి పొత్తులపై స్పందించారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, టీడీపీ, బీజేపీతో జనసేన కలిసి వెళ్లడమా లేదంటే బీజేపీతో కలిసి పోటీ చేయడమా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు చీలకూడదన్నదే జనసేన ఉద్దేశం అని, ఏదైనా సరే ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉంటాయన్నారు. సీఎం పదవి పై నా ఆసక్తి ఇప్పటికే చెప్పాను.. సీఎం పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు తర్వాతే సీఎం పదవిపై నిర్ణయం ఉంటుందన్నారు. 
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘జగన్ ఒక వ్యాపారి, ఒక క్రిమినల్ అని ఆయన నేర విధానాన్ని కొనసాగిస్తున్నారు. మత్స్యకారుల వలసలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఇట్లాగే దోపిడీ జరిగింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తెలంగాణలో అడ్డగోలుగా దోపిడీ జరిగింది. అందుకే ఆంధ్రా వాళ్ళను తరిమేశారు.. వరంగల్ లో జగన్ ను తరిమేశారు. మూడు రాజధానులు అంటే ఎలా సాధ్యం అవుతుంది. వైసీపీ వాళ్ళు ఉత్తరాంధ్రలో ముప్పై వేల ఎకరాలు దోచేశారు. అందుకే ఈ ప్రాంతంపై వారికి ప్రేమ. స్థానిక నాయకులను అడ్డు పెట్టుకుని దోచేసే ప్రయత్నం జరుగుతోందని’ ఆరోపించారు. 

విశాఖలో క్రైం రేట్ పెరిగింది..
‘ప్రశాంతంగా ఉండే విశాఖలో క్రైం రేట్ పెరిగి పోయింది. రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయం. ఏదైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయటం లేదు. ఏపీ నేరాలకు నిలయం అయింది. ఇప్పుడు బిహార్ చాలా బాగుంది. ఉత్తరాంధ్ర భూ దోపిడీ పై మాట్లాడటానికి ఇక్కడ నాయకులు లేరు. అనకాపల్లలో ఖనిజ సంపద దోచేస్తున్నరు. అమ్మఒడికి డబ్బులు లేవు. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు ఖాతరు చేయడం లేదు. మకవరపాలెం మండలంలో 174 జీవో ద్వారా నిధులు మంజూరు. కానీ ఫారెస్ట్ లాండ్ లో నిబంధనలు ఖాతరు చేయకుండా దోపిడీ జరిగింది. ఖనిజ తవ్వకం ఒకరికి కేటాయిస్తే మరొకరికి ఇస్తోంది జగన్ ప్రభుత్వం. పోలీసులు చూస్తుండగా బోట్ తగలబెట్టారు. బ్రిటీష్ పాలన కంటే ఏపీ దారుణంగా తయారైంది.

కార్మికులకు రూ.5 వేలు జీతం కూడా ఇవ్వరు, కానీ వైసీపీ నేతలు వేల కోట్లు దోచేస్తారు. రాయల సీమలో వీలు పడదని, ఉత్తరాంధ్ర దోపిడికి శ్రీకారం చుట్టారు. గాజువాక లో నిర్మాణాల కోసం వైసిపి వారు ఒక రేటు పెట్టేశారు. అగనం పూడి టోల్ గేట్ 25 సంవత్సలుగా నడుస్తోంది... ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ కీ చెందిన కంపెనీ కి ఇచ్చేశారు. మద్యం మీద ఆదాయం భారీగా వస్తున్నా, అధిక శాతం దోపిడీ జరుగుతోంది. వాహన మిత్ర అందరికీ అందదని, డ్రైవర్ లు గ్రీన్ ట్యాక్స్ గురించి మాట్లాడటం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ప్రతి మూడు నెలలకు వేల రూపాయలు దోపిడీ. ఏపీలో పరిస్థితి మారాలంటే ప్రభుత్వం మారాలి. 

టీడీపీ హయాంలో తప్పు జరిగితే సీఎం జగన్ సరి చేయొచ్చు కదా. జనసేన గురించి అడగటానికి వాళ్లు ఎవరు అని పవన్ కళ్యా్ణ్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి క్యాప్టీవ్ మైన్స్ కోసం వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని అడగాలి అన్నారు. తాను రిపోర్టర్ కి రెస్పెక్ట్ ఇస్తానన్నారు. కానీ ఓట్లు చీలకూడదు అనడానికి కారణం సాక్షి పేపర్ ఓనరే కదా అని జగన్ పై వ్యాఖ్యలు చేశారు. 151 ఎమ్మెల్యేలు ఉండి అద్భుతమైన పాలన చేసి ఉన్న నేత జగన్ అయితే తాను చాలా సంతోషించే వాడ్ని అన్నారు. రాష్ట్రంలో 30 వేల అమ్మాయిలు, మహిళలు మిస్సింగ్ అయితే, ఎలాంటి సమీక్షలు పెట్టకుండా, పైగా ఈ విషయాన్ని బహిర్గతం చేసిన తనపై వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లడారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Rana Daggubati: తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
Romantic Destinations : రొమాంటిక్ డెస్టినేషన్స్.. మీ ప్రేయసితో కలిసి వెళ్లేందుకు ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే
రొమాంటిక్ డెస్టినేషన్స్.. మీ ప్రేయసితో కలిసి వెళ్లేందుకు ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే
New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Embed widget