అన్వేషించండి

Vizag Desalination Plant: విశాఖ నీటి కష్టాలకు చెక్.. సముద్రపు నీరు శుద్ధి.. ఇజ్రాయిల్ టెక్నాలజీతో డీశాలినేషన్ ప్లాంట్

విశాఖపట్నంలో డీశాలినేషన్ ప్లాంట్ రాబోతోంది. పెరుగుతున్న పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చడానికి ఏపీ ప్రభుత్వం వీలైనంత త్వరగా ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. GVMC PPP మోడల్‌లో నిర్మించనుంది.

Vizag Desalination Plant:  ఏపీలో ప్రధాన నగరంగా ఉన్న విశాఖలో తాగునీటి సమస్యను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నగరంలో డీశాలినేషన్‌ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టనుంది. ఎప్పటి నుంచో ఉన్న ఈ ప్రణాళికను కార్యరూపంలోకి తీసుకురావడానికి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ -GVMC కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 1,200 కోట్ల వ్యయంతో 100 ఎంఎల్‌డి (మెగాలిటర్స్ పర్ డే) సామర్థ్యం గల డిశాలినేషన్ ప్లాంట్‌ను నిర్మించడానికి ప్రణాళికలను వేగవంతం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రధానంగా పారిశ్రామిక అవసరాలను తీరుస్తుంది, తద్వారా గృహావసరాలకు కేటాయించే నీటిపై ఒత్తిడి తగ్గుతుంది.

వైజాగ్ లో ప్లాంట్ పెడుతున్న ఇజ్రాయెల్ సంస్థ

ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో చేపట్టనున్నారు. ప్రైవేట్ కంపెనీలు నిధులు సమకూర్చగా, జీవీఎంసీ భూమిని, ఇతర నిర్మాణ సహకారాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను, చర్చించడానికి జీవీఎంసీ, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (APUIAML), మరియు ఇజ్రాయెల్‌కు చెందిన ఐడిఈ టెక్నాలజీస్ అధికారులు సమావేశమయ్యారు. త్వరలోనే ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి RFP (Request for Proposal) జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 25 ఎకరాల స్థలంలో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. కొన్నాళ్ల పాటు వాళ్లు నిర్వహించిన తర్వాత దానిని ప్రభుత్వానికి బదలాయించే BOT ప్రక్రియలో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టును గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుగా చేపట్టాలన్న ఆలోచన కూడా ఉంది. అందుకే దీనికి అవసరమైన 20 మెగావాట్ల విద్యుత్‌ను  సోలార్ గ్రిడ్ ద్వారా సరఫరా చేయాలని జీవీఎంసీ యోచిస్తోంది.  విశాఖ సమీపంలోని అప్పికొండ లేదా పూడిమడక దగ్గర దీనిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.  IED  టెక్నాలజీస్ సంస్థ ముంబైలో 400 ఎంఎల్‌డి, తమిళనాడులో 60 ఎంఎల్‌డి డిశాలినేషన్ ప్లాంట్‌లను విజయవంతంగా నిర్మించిన అనుభవం కలిగి ఉంది.

పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలు

విశాఖపట్నంలో పరిశ్రమల అవసరాలు పెరుగుతున్నాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటు, విస్తరణతో పారిశ్రామిక అవసరాలకే ప్రతిరోజూ 500-600MLDల నీరు అవసరం అయిన పరిస్థితి. అందుకని  ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పరిశ్రమలకు నీటిని ఇచ్చి ఆ మేరకు గృహ అవసరాలపై ఒత్తిడిని తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విశాఖకు దగ్గరలో భారీ నీటి వనరులు లేవు. ప్రస్తుతం దగ్గరలోని మేఘాద్రి గడ్డ, ముడసర్లోవ, తాడిపూడి, రైవాడ వంటి జలాశయాలనుంచే నీరు వస్తోంది. పోలవరం పూర్తైతే.. ఎడమకాలువ ద్వారా వైజాగ్‌కు తాగునీరు చేరుతుంది.  ఈ లోగా పారిశ్రామిక అవసరాలకు కావలసిన నీటి సముద్ర నీటి శుద్ది ప్రాజెక్టుపై దృష్టి పెడుతున్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget