అన్వేషించండి

CPI Narayana: ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే వైసీపీ పని, వారిది ఫెవికాల్ బంధం

CPI Narayana: రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే అధికార పార్టీ పని అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. 

CPI Narayana: రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే అధికార పార్టీ వైసీపీ పని అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అలాగే సీఎం జగన్ నాడు అమరావతి రాజధాని అని చెప్పి నేడు మూడు రాజధానులు అని మాట మార్చడం సరికాదన్నారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజధానులపై నిర్ణయాలు మార్చడం చాలా తప్పని.. సీఎం జగన్ దిగజారుడుతనానికి ఇది నిదర్శనం అన్నారు. అలాగే విశాఖకు వచ్చిన ప్రధాని 11 వేల కోట్ల రూపాయల హామీకే మురిసిపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మరో వైపు విశాఖ ఉక్కు ప్రైవేటుకు అప్పగిస్తుంటే నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని నారాయణ విమర్శలు గుప్పించారు.

వారి బంధం ఫెవికాల్ లాంటిది ! 
పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, ఉమ్మడి ఆస్తుల పంపిణీపై ముఖ్యమంత్రి జగన్ ప్రధాన మంత్రి మోదీని ప్రశ్నించలేక పోయారని ఎద్దేవా చేశారు. వైసీపీ విజయానికి సహకరించేలా మోదీ వ్యవహరించారని విమర్శలు చేశారు. వైసీపీ, బీజేపీ బంధం ఫెవికాల్ అంత దృఢమైనది అని నారాయణ తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. 

మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని, ఆ సంస్థకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకంటోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపణలు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు చెందిన అనేక శాఖల్లో ఏపీ అధికారులు తనిఖీలు చేసినా  కూడా చిన్న పొరపాటు కూడా గుర్తించలేకపోయారని విమర్శలు చేశారు. రాజకీయాల కోసం ఇలాంటి దాడులు చేయడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి తీవ్రంగా తప్పుపట్టారు. 

ఒక్క హామీ అయినా నెరవేర్చారా? 
విశాఖను రాజధాని చేసి మరింత అభివృద్ధి చేస్తామని, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వైసీపీ నాయకులు, ఆ పార్టీ ప్రభుత్వం చెబుతోందని, కానీ అదే విశాఖలోని స్టీల్ పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ సర్కారు ఏమీ చేయలేకపోతోందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. విశాఖలోని రుషికొండను మొత్తానికి మొత్తం తవ్వేస్తున్నారని, ఇంకెక్కడి అభివృద్ధి అంటూ నారాయణ ప్రశ్నలు గుప్పించారు. 3 లక్షల కోట్ల రూపాయల విలువైన స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుంటే దానిపై ప్రశ్నించే సాహసం వైసీపీ సర్కారు చేయడం లేదని అన్నారు. విభజన చట్టంలో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా హామీ కేంద్ర సర్కారు నెరవేర్చడం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాయలసీమలోని వెనకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనూ అన్యాయం జరిగిందని అన్నారు.

అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడుస్తున్నా ఒక్క హామీని నెరవేర్చలేదని  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  విమర్శలు చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడాలంటే రాష్ట్రంలో టీడీపీ అనేది ఉండకూడదని బీజేపీ భావిస్తోందని నారాయణ ఆరోపించారు. టీడీపీ బలపడకుండా ఉండేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. అందుకే విశాఖపట్నానికి వచ్చిన ప్రధాని మోదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పక్క చూపులు చూడవద్దని తమ వైపే చూడమని చెప్పినట్లు ఉందని నారాయణ ఆరోపించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget