అన్వేషించండి

Araku News: ఉత్తరాంధ్రలో తొలి అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు, అరకులో ఆయనకే ఛాన్స్

Chandrababu Naidu: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున దొన్ను దొర పోటీ చేస్తారని స్పష్టం చేశారు.

Chandrababu First Candidate: రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. మరో పక్క వైసీపీ అధినేత జగన్‌, జనసేనాని కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఎంపికపైనా దృష్టి సారించాయి. ఇప్పటికే పలు విడతల్లో అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించగా, తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఆ దిశగా సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలోనే అరకు బహిరంగ సభకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో తొలి అభ్యర్థిని ప్రకటించారు. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున దొన్ను దొర పోటీ చేస్తారని స్పష్టం చేశారు. దీంతో ఉత్తరాంధ్రలో ఉన్న మొత్తం 34 నియోజకవర్గాల్లో ఇక్కడి నుంచే తొలి అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించడం విశేషం. 

మెజార్టీ స్థానాలపై దృష్టి

తెలుగుదేశం పార్టీ ఏజెన్సీ ప్రాంతాల్లో వెనుకబడి ఉంటోంది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కంచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. గడిచిన ఎన్నికల్లో అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలతోపాటు అరకు ఎంపీ స్థానాన్ని వైసీపీ కైవశం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బలంగా ఉన్న అభ్యర్థులను బరిలోకి దించాలని భావించిన చంద్రబాబు స్థానికంగా పేరున్న వ్యక్తులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో టీచర్‌గా పని చేసి రాజకీయాల్లోకి వచ్చిన దొన్ను దొరను అరకు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నిర్ణయం పార్టీకి మేలు చేస్తుందని కేడర్‌ భావిస్తోంది. ఇప్పటి వరకు పార్టీకి పని చేసిన శ్రావణ్‌కుమార్‌, అబ్రహంలకు సముచిత స్థానాన్ని కల్పిస్తామని చంద్రబాబు వేదికపై నుంచి హామీ ఇవ్వడంతో వారి అభిమానుల్లోనూ ఉత్సాహం కనిపించింది. 

వారం రోజుల్లో అభ్యర్థులపై స్పష్టత.. 

ఉత్తరాంధ్రలోని మెజార్టీ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒక స్పష్టతకు వచ్చారు. కొన్ని చోట్ల పోటీ ఉండడంతో అక్కడ సర్వేలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళంలో రెండు, విజయనగరంలో మరో రెండు, ఉమ్మడి విశాఖలో మూడు స్థానాల్లో పోటీ నెలకొంది. ఇక్కడ సీనియర్లకు కొత్తగా వచ్చిన నాయకుల నుంచి పోటీ ఉండడంతో ఎవరికి కేటాయించాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. వీటిపై స్పష్టత వచ్చాక అభ్యర్థులు ప్రకటన ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget