అన్వేషించండి

Araku News: ఉత్తరాంధ్రలో తొలి అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు, అరకులో ఆయనకే ఛాన్స్

Chandrababu Naidu: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున దొన్ను దొర పోటీ చేస్తారని స్పష్టం చేశారు.

Chandrababu First Candidate: రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. మరో పక్క వైసీపీ అధినేత జగన్‌, జనసేనాని కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఎంపికపైనా దృష్టి సారించాయి. ఇప్పటికే పలు విడతల్లో అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించగా, తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఆ దిశగా సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలోనే అరకు బహిరంగ సభకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో తొలి అభ్యర్థిని ప్రకటించారు. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున దొన్ను దొర పోటీ చేస్తారని స్పష్టం చేశారు. దీంతో ఉత్తరాంధ్రలో ఉన్న మొత్తం 34 నియోజకవర్గాల్లో ఇక్కడి నుంచే తొలి అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించడం విశేషం. 

మెజార్టీ స్థానాలపై దృష్టి

తెలుగుదేశం పార్టీ ఏజెన్సీ ప్రాంతాల్లో వెనుకబడి ఉంటోంది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కంచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. గడిచిన ఎన్నికల్లో అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలతోపాటు అరకు ఎంపీ స్థానాన్ని వైసీపీ కైవశం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బలంగా ఉన్న అభ్యర్థులను బరిలోకి దించాలని భావించిన చంద్రబాబు స్థానికంగా పేరున్న వ్యక్తులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో టీచర్‌గా పని చేసి రాజకీయాల్లోకి వచ్చిన దొన్ను దొరను అరకు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నిర్ణయం పార్టీకి మేలు చేస్తుందని కేడర్‌ భావిస్తోంది. ఇప్పటి వరకు పార్టీకి పని చేసిన శ్రావణ్‌కుమార్‌, అబ్రహంలకు సముచిత స్థానాన్ని కల్పిస్తామని చంద్రబాబు వేదికపై నుంచి హామీ ఇవ్వడంతో వారి అభిమానుల్లోనూ ఉత్సాహం కనిపించింది. 

వారం రోజుల్లో అభ్యర్థులపై స్పష్టత.. 

ఉత్తరాంధ్రలోని మెజార్టీ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒక స్పష్టతకు వచ్చారు. కొన్ని చోట్ల పోటీ ఉండడంతో అక్కడ సర్వేలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళంలో రెండు, విజయనగరంలో మరో రెండు, ఉమ్మడి విశాఖలో మూడు స్థానాల్లో పోటీ నెలకొంది. ఇక్కడ సీనియర్లకు కొత్తగా వచ్చిన నాయకుల నుంచి పోటీ ఉండడంతో ఎవరికి కేటాయించాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. వీటిపై స్పష్టత వచ్చాక అభ్యర్థులు ప్రకటన ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget