అన్వేషించండి

Botsa Satynarayana: జగన్ విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం, త్వరలోనే డేట్ ఫిక్స్: బొత్స సత్యనారాయణ

Andhra Pradesh News: ఏపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బలంగా వీచిందన్నారు.

Botsa Satynarayana Press Meet | వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, త్వరలోనే డేట్ ఫిక్స్ చేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు తెలిసింది మోసం, దగా, కుట్రలు అని, మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ చెప్పింది చేస్తారని పేర్కొన్నారు. టీడీపీ కూటమి ఎన్ని హామీలు ఇచ్చినా ఏపీ ప్రజలు వారిని నమ్మలేదని, అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేశారని చెప్పారు. మే 13న జరిగిన ఏపీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీచిందన్నారు.

ప్రజలు జగన్ ను మరోసారి ఆశీర్వదించారు 
ఏపీ ఎన్నికలపై మంత్రి బొత్స మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో సీఎం జగన్ ను మరోసారి ఆశీర్వదించిన ప్రజలకు ధన్యవాదాలు. టీడీపీ కార్యకర్తలు ఓటమి తెలిసి, సహనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారు. ఓడిపోతున్నారనే టీడీపీ నేతలు పల్నాడులో దాడులకు పాల్పడ్డారు.. మేం కనుక ఒక్క పిలుపు ఇచ్చి ఉంటే అంతా క్లోజ్.  సచివాలయ వ్యవస్థను అవినీతి రూపు మాపడానికి పెట్టాం. కార్యకర్తలు ఎప్పుడూ నేతల పక్కనే ఉంటారు. మహాత్మా గాంధీ కలలు కన్న వ్యవస్థే సచివాలయ వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థ కరోనా సమయంలో ఎన్నో సేవలు అందించింది. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం సేవలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందించారు వాలంటీర్లు.

ఎన్నికల సమయంలో టీడీపీ సహనం కోల్పోయినా, మనం సంయనంగా వ్యవహరించాలని వైసీపీ కార్యకర్తలకు సూచించాం. జగన్ ను అధికారంలోకి తీసుకురావాలి. మహిళలు, యువత, పేద వర్గాలకు మరో ఐదేళ్లు సంక్షేమాన్ని కొనసాగిస్తాం. కవ్వింపులు జరిగినా మా కార్యకర్తలు సహనంగా ఉన్నందుకు ఏపీలో భారీగా పోలింగ్ నమోదైంది. తులసివనంలో గంజాయి మొక్కలా కొందరు జర్నలిస్టులు ఉంటారు. ప్రజాధరణ ఎక్కువగా ఉన్న కారణంగానే నన్ను టీడీపీ కూటమి నేతలు నన్ను టార్గెట్ చేశారు. అది మా బలంగా భావిస్తాం. కానీ అది టీడీపీ శ్రేణుల బలహీనత. 

ఎవరిది కుటుంబ పాలన, మీరే ఆలోచించుకోండి 
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ నామినేటెడ్ పదవి తీసుకున్నాడు. కానీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గలేదు. చంద్రబాబు వదిన పురంధేశ్వరి మరో పార్టీలో అధ్యక్షురాలిగా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ, ఆయన అల్లుళ్లు లోకేష్, భరత్ లు రాజకీయాల్లో ఉన్నారు. కుటుంబ పాలన ఎవరిదో ఇప్పుడు చెప్పండి. ఈవీఎంలు ఎక్కడ భద్రపరచాలి అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. కానీ వ్యవస్థ మీద అవగాహన లేక ఈవీఎంలపై కామెంట్లు చేస్తున్నారని’ మండిపడ్డారు.

ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్స్ పెట్టవద్దని మంత్రి బొత్స సూచించారు. తాము గెలిచేస్తున్నామని టీడీపీ నేతలు ప్రచారం చేస్తే, అది నిజమని బెట్టింగ్ కాస్తే లక్షలు పోగొట్టుకుని, జీవితాలు కోల్పోతారని హెచ్చరించారు. జూన్ 4 వరకు ఆగితే ఫలితాలు ఎవరివైపు తేలుతుందని, వైసీపీ మరోసారి భారీగా సీట్లు సాధించి ఏపీలో అధికారంలోకి వస్తుందన్నారు. కేంద్రంలో ఎవరు వచ్చినా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధమని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలు తప్పా, రాజకీయ ప్రయోజనాలు తమకు ముఖ్యం కాదన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Eatala Rajender Vs Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మంటలు- ఈటల,బండి మధ్య మాటల యుద్ధం 
తెలంగాణ బీజేపీలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మంటలు- ఈటల,బండి మధ్య మాటల యుద్ధం 
iBOMMA One Website : iBOMMA పోయింది... iBOMMA One వచ్చింది - ఒక్కసారి క్లిక్ చేస్తే...
iBOMMA పోయింది... iBOMMA One వచ్చింది - ఒక్కసారి క్లిక్ చేస్తే...
Amaravati Happinest : అమరావతి హ్యాపీనెస్ట్ పునరుజ్జీవం – జనవరి నుంచి పనులు ప్రారంభం - సీఆర్‌డీఏ కీలక ప్రకటన
అమరావతి హ్యాపీనెస్ట్ పునరుజ్జీవం – జనవరి నుంచి పనులు ప్రారంభం - సీఆర్‌డీఏ కీలక ప్రకటన
iBOMMA Website Case: ఐ బొమ్మ లాంటి పైరసీ నుంచి రక్షణకు అదొకటే మార్గం! హైదరాబాద్‌ పోలీసుల కీలక ప్రకటన
ఐ బొమ్మ లాంటి పైరసీ నుంచి రక్షణకు అదొకటే మార్గం! హైదరాబాద్‌ పోలీసుల కీలక ప్రకటన
Advertisement

వీడియోలు

Suma about Her Retirement in Premiste Event | రిటైర్మెంట్ పై సుమ కామెంట్స్ | ABP Desam
BJP Madhavi Latha on SS Rajamouli : రాజమౌళి హనుమాన్ కామెంట్స్ పై మాధవీలత రియాక్షన్ | ABP Desam
WTC Final India | టీమిండియా టెస్ట్ చాంపియన్‌ షిప్ ఫైనల్ చేరాలంటే ఇదొక్కటే దారి
Ind vs SA Shubman Gill | రెండు టెస్ట్‌‌లో గిల్ ఆడటంపై అనుమానాలు.. అతడి ప్లేస్‌లో మరొకరు?
Dinesh Karthik Comments on Gambhir | గంభీర్.. అతడి కెరీర్ నాశనం చేస్తున్నావ్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Eatala Rajender Vs Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మంటలు- ఈటల,బండి మధ్య మాటల యుద్ధం 
తెలంగాణ బీజేపీలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మంటలు- ఈటల,బండి మధ్య మాటల యుద్ధం 
iBOMMA One Website : iBOMMA పోయింది... iBOMMA One వచ్చింది - ఒక్కసారి క్లిక్ చేస్తే...
iBOMMA పోయింది... iBOMMA One వచ్చింది - ఒక్కసారి క్లిక్ చేస్తే...
Amaravati Happinest : అమరావతి హ్యాపీనెస్ట్ పునరుజ్జీవం – జనవరి నుంచి పనులు ప్రారంభం - సీఆర్‌డీఏ కీలక ప్రకటన
అమరావతి హ్యాపీనెస్ట్ పునరుజ్జీవం – జనవరి నుంచి పనులు ప్రారంభం - సీఆర్‌డీఏ కీలక ప్రకటన
iBOMMA Website Case: ఐ బొమ్మ లాంటి పైరసీ నుంచి రక్షణకు అదొకటే మార్గం! హైదరాబాద్‌ పోలీసుల కీలక ప్రకటన
ఐ బొమ్మ లాంటి పైరసీ నుంచి రక్షణకు అదొకటే మార్గం! హైదరాబాద్‌ పోలీసుల కీలక ప్రకటన
Maoist encounter: ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
Nitish Kumar : రాజకీయాల నుంచి తప్పుకుంటాననే శపథం నుంచి పదోసారి ప్రమాణం వరకు నితీష్ కుమార్ పొలిటికల్‌ జర్నీ ఇదే !
రాజకీయాల నుంచి తప్పుకుంటాననే శపథం నుంచి పదోసారి ప్రమాణం వరకు నితీష్ కుమార్ పొలిటికల్‌ జర్నీ ఇదే !
AP 10th Class Exam Schedule: ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్ష షెడ్యూల్ రెడీ! పూర్తి సాంకేతికతతో ప్రక్రియ చేపడుతున్న ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్ష షెడ్యూల్ రెడీ! పూర్తి సాంకేతికతతో ప్రక్రియ చేపడుతున్న ప్రభుత్వం 
Telangana Finance Commission Funds: జరగని ఎన్నికలు - పంచాయతీలకు అందని నిధులు - పల్లెలపై ప్రభుత్వానికి కనికరం ఎప్పుడు ?
జరగని ఎన్నికలు - పంచాయతీలకు అందని నిధులు - పల్లెలపై ప్రభుత్వానికి కనికరం ఎప్పుడు ?
Embed widget