అన్వేషించండి

Bhogapuram Airport: వైజాగ్ టెక్ పార్క్, భోగాపురం ఎయిర్ పోర్ట్ కు మే 3న సీఎం జగన్ శంకుస్థాపన

భోగాపురం ఎయిర్ పోర్ట్ - వైజాగ్ టెక్ పార్క్ కు మే 3న ఏపీ సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఉత్తరాంధ్ర జిల్లాలకు తలమానికంగా నిలవనున్న వివిధ ప్రాజెక్టులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మే 3న శంకుస్థాపన చేయనున్నారని వైయస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చెప్పారు. సుమారు 3,500 కోట్ల రూపాయలతో విశాఖ ఐటీ సెజ్ లోని హిల్ నెంబర్ 4 మీద నిర్మించనున్న వైజాగ్ టెక్ పార్క్ ( అదానీ డేటా సెంటర్) కు సీఎం జగన్ వచ్చే నెల మూడో తేదీన శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి హిల్ నెంబర్ 3 మీద నిర్మిస్తున్న హెలిప్యాడ్ ను, హిల్ నెంబర్ 4 మీద నిర్మించనున్న డేటా సెంటర్ కు సంబంధించిన ఏర్పాట్లను వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశీల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కలెక్టర్ మల్లికార్జున, నగర్ పోలీస్ కమిషనర్ తదితరులు శనివారం ఉదయం పరిశీలించారు. 

అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పిందని, అన్నమాట ప్రకారమే వచ్చే నెల మూడో తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాకుండా, వెంటనే పనులు మొదలుపెట్టనున్నారని చెప్పారు. అలాగే విశాఖ నగరానికి పేరు తెచ్చే విధంగా వైజాగ్ టెక్ పార్క్( అదానీ డేటా సెంటర్) నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని ఆయన చెప్పారు. 134 ఎకరాలలో నిర్మిస్తున్న ఈ టెక్ పార్కు మూడు దశలలో ఏడేళ్లలో పూర్తి చేస్తామని సుబ్బారెడ్డి వివరించారు. ఈ టిక్ పార్క్ ద్వారా సుమారు 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించునున్నాయని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారని సుబ్బారెడ్డి అన్నారు.

టిడిపివి రాజకీయ ఫలకాలు : మంత్రి అమర్నాథ్
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసిన శిలాఫలకాలు కేవలం రాజకీయం కోసమే అని అన్నారు. ఆ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క భారీ ప్రాజెక్టునైనా ప్రారంభించి పూర్తి చేసిందా? అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని నమ్మలేదని, వచ్చే ఎన్నికల్లో కూడా టిడిపికి, చంద్రబాబు నాయుడుకి పలకలే మిగులుతాయని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు రెండోసారి శంకుస్థాపన చేస్తున్నామని జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రి అమర్నాథ్ స్పందిస్తూ 2019 మార్చి 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఫిబ్రవరి 15వ తేదీన శంకుస్థాపన చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు. తమది నిబద్ధతతో కూడిన ప్రభుత్వం కాబట్టే ఎన్నికలకు సంవత్సరానికి ముందే భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయడంతో పాటు, వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. 
2,200 ఎకరాలలో 35 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎయిర్ పోర్టుకు అన్ని రకాల అనుమతులు లభించాయని,  నిర్మాణ సంస్థకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుందని అమర్నాథ్ వివరించారు. అలాగే వైజాగ్ టెక్ పార్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సుమారు 40,000 మందికి ప్రత్యక్షంగా 50 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి అని చెప్పారు. టెక్ పార్కు అందుబాటులోకి వస్తే విశాఖ ఆర్థికంగా ఎంతో ఉన్నతిని సాధిస్తుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూలై నుంచి విశాఖలోనే ఉంటారని మంత్రి అమర్నాథ్ పునరుద్ఘాటించారు.

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకులకు సెల్ఫీలు పిచ్చి పట్టుకుందని, దమ్ముంటే ఆ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూడాలని సవాలు విసిరారు. అభివృద్ధి ఏమాత్రం పట్టని ఆ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని, వీలైతే రాష్ట్ర అభివృద్ధికి సలహాలు ఇవ్వాలి.. లేకుంటే మాట్లాడకుండా ఉండడం మంచిదని అవంతి హితవు పలికారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
AP Weather Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మరో రెండు రోజుల్లో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మరో రెండు రోజుల్లో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
AP Weather Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మరో రెండు రోజుల్లో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మరో రెండు రోజుల్లో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Embed widget