అన్వేషించండి

Visakhapatnam: బోటు ప్రమాదం శోకం మిగిల్చిన రోజే కవలలకు జననం... సరిగ్గా రెండేళ్ల తర్వాత...

దేవుడి వరమో... కాకతాళీయమో... సరిగ్గా రెండేళ్ల తర్వాత ఘోర ప్రమాదం జరిగిన రోజే... ఇద్దరు పిల్లల్ని పొగొట్టుకున్న ఓ జంటకు కవలలు పుట్టారు.

2019 సెప్టెంబరు 15 గోదావరిలో జరిగిన బోటు ప్రమాదం.. ఇంకా కళ్ల ముందే కనబడుతుంది. వశిష్ట బోటు కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన దంపతులకు మళ్లీ అదే రోజు కవలలు పుట్టారు. ప్రమాదం జరిగిన రోజే కవలలు పుట్టడంతో ఇది దేవుడిచ్చిన వరమే అంటున్నారు దంపతులు. రెండేళ్ల క్రితం బోటు ప్రమాదంలో ఏ రోజేతై ఇద్దరు ఆడపిల్లలను కోల్పోయారో... సరిగ్గా అదే రోజున ఆ దంపతులకు ఇద్దరు ట్విన్స్‌ పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

అదే రోజున

2019 సెప్టెంబర్ లో ఏపీలోని భద్రాచలం దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగింది. వశిష్ట బోటు కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ బోటులో విశాఖ ఆరిలోవకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉన్నారు. తలారి అప్పలరాజు తన తల్లితో ఇద్దరు కూతుళ్లు గీతావైష్ణవి, ధాత్రి అనన్యలను భద్రాచలం రాముడి దర్శనానికి పంపారు. ఆ ప్రమాదంలో ఇద్దరు కుమార్తులు.. ఒకరికి మూడేళ్లు, మరొకరికి ఏడాదిన్నర, తల్లితో కలిపి మొత్తం 9 మంది కుటుంబసభ్యులు మృతి చెందారు. ఈ విషయం తెలిసిన అప్పలరాజు బోరున విలపించారు. అతని భార్య భాగ్యలక్ష్మికి అప్పటికే ట్యూబెక్టమీ ఆపరేషన్‌ జరిగింది. ఇంక పిల్లలు పుట్టరని ఆ దంపతులు కుంగిపోయారు. కృత్రిమ గర్భాధారణ ద్వారా పిల్లలు పుడతారని తెలుసుకున్న అప్పలరాజు విశాఖలో పద్మశ్రీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. సరిగ్గా ప్రమాదం జరిగిన తేదీ అంటే సెప్టెంబరు 15న ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరు బిడ్డలను కోల్పోయి శోకంలో ఉన్న తమకు ఆ దేవుడు మళ్లీ వరమిచ్చాడని అప్పలరాజు దంపతులు మురిసిపోతున్నారు. 

కవలలు జననం

కచ్చులూరు ప్రమాదం బంధువులందర్నీ కోల్పోయాక తమకు దేవుడిపై నమ్మకం పోయిందని అప్పలరాజు భార్య తెలిపారు. పిల్లలు చనిపోయాక నరకం అనుభవించామన్నారు. ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన రోజునే మళ్లీ ఇద్దరు కవలలకు జన్మనివ్వడం నిజంగా ఆ దేవుడి మహిమేనని భావిస్తున్నామన్నారు. ఆ ఇద్దరు పిల్లలు మళ్లీ పుట్టారని అందుకే వాళ్లకు గీతావైష్ణవి, ధాత్రి అనన్య పేర్లు పెడతామంటున్నారు. పిల్లలు పెద్దయ్యాక మళ్లీ భద్రాచలం సీతారాముల దర్శనానికి వెళ్తామని తెలిపారు. భాగ్యలక్ష్మికి ఈ నెల 20వ తేదీ డెలివరీ డేట్ అని వైద్యులు తెలిపారు కానీ ఆమెకు 15వ తేదీనే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయని వైద్యులు తెలిపారు. 

ఆ రోజు ఏంజరిగింది?  

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు మృతిచెందారు. సెప్టెంబర్ 15వ తేదీన తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం నుంచి పాపికొండలు విహారయాత్రకు లాంచీలు వెళ్లాయి. రాయల్ వశిష్ట బోటులో కూడా 77 మంది ప్రయాణికులు విహారయాత్రకు బయలుదేరారు. పాటలు, డాన్సులతో సందడి సాగుతున్న విహారయాత్ర ఒక్కసారిగా విషాదాంతం అయ్యింది. మధ్యాహ్నం సుమారు 1.45 గంటల సమయంలో కచ్చులూరు వద్దకు రాగానే ప్రమాదం బోల్తాపడింది. ఏం జరిగిందో అర్థం అయ్యేలోపే చాలా మంది జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదం నుంచి 26 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటివరకు 39 మంది మృతదేహాలు బయటకు తీశారు. మరో 12 మంది ఆచూకీ మాత్రం ఈ రోజుకూ దొరకలేదు.

Also Read: Telangana White Challenge: తెలంగాణలో వైట్ ఛాలెంజ్ రగడ... కొండా ఛాలెంజ్ కు బండి సంజయ్ ఓకే.. రేవంత్ రెడ్డి సవాల్ కు కేటీఆర్ స్ట్రాంగ్ రిప్లై

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Campaign Strategy : కేసీఆర్ ప్రచార వ్యూహమే  అమలు చేస్తున్న జగన్ - ఎంత వరకు మేలు చేస్తుంది?
కేసీఆర్ ప్రచార వ్యూహమే అమలు చేస్తున్న జగన్ - ఎంత వరకు మేలు చేస్తుంది?
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Campaign Strategy : కేసీఆర్ ప్రచార వ్యూహమే  అమలు చేస్తున్న జగన్ - ఎంత వరకు మేలు చేస్తుంది?
కేసీఆర్ ప్రచార వ్యూహమే అమలు చేస్తున్న జగన్ - ఎంత వరకు మేలు చేస్తుంది?
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
Embed widget