అన్వేషించండి

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో పోరాటం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పరమా?, సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

Somu Veerraju On Daspalla Lands : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దసపల్లా భూములపై పోరాటం చేసిన వైసీపీ అధికారంలోకి రాగానే 22ఏ ఎత్తివేయడం సరికాదని సోము వీర్రాజు అన్నారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ లేఖ రాశారు.

Somu Veerraju On Daspalla Lands : విశాఖ దసపల్లా భూముల వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్ కు లేఖ రాశారు. కబ్జాకు గురవుతున్న దసపల్లా భూములను కాపాడి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. విశాఖ నగర నడిబొడ్డున ప్రభుత్వ అతిథిగృహాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద దసపల్లా భూములను కొందరు బిల్డర్లకు అప్పగించటానికి రంగం సిద్ధమైందని, దీని వెనుక అధికార పార్టీ నాయకులకు, వారి బంధువర్గాలకు ప్రయోజనం చేకూరేలా కోట్లాది రూపాయల  కుంభకోణం దాగి ఉందని వార్తలు వస్తున్నాయని సోము వీర్రాజు అన్నారు. 2016లో సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయరాదని, వందల కోట్ల విలువైన భూములను రక్షించడానికి ప్రభుత్వం మరోసారి న్యాయపోరాటం చేయాలని సోము వీర్రాజు కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత మంత్రి  గుడివాడ అమర్నాథ్ .. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ భూములను ప్రభుత్వపరం చేయటానికి తగిన చర్యలన్నీ తీసుకుంటుందని పదే పదే చెప్పారని గుర్తుచేశారు.

వైసీపీ కూడా అదే భూదందా! 

సీఎం జగన్ తన పాదయాత్రలో ఆ భూముల విషయాన్ని ప్రస్తావించి, వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టటానికి చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు చేశారని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా నాడు వైసీపీ నేతలు చేసిన డిమాండ్లను విస్మరించి, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ అధికారులే నిషేధిత జాబితా (22 A) నుంచి ఆ భూములను తొలగించి వాటిని వైసీపీ అనుకూల బిల్డర్లకు అప్పగించటానికి ప్రయత్నిస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గత టీడీపీ ప్రభుత్వం ఆ భూములను తమ వారికి కట్టబెట్టడం కోసం చేసిన యత్నాలు బెడిసి కొట్టాయన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో భారీ భూదందా కు తెరలేపినట్లు స్పష్టం అవుతోందన్నారు. 

సుప్రీంకోర్టులో పిటిషన్ 

"ఇంత జరుగుతున్నా కూడా వాటిని జిల్లా అధికార యంత్రాంగం కనీసం అధికారికంగా ఖండించకపోవడంతో భూ కుంభకోణం వాస్తవమేనని  ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. విశాఖలోని దసపల్లా హిల్స్ భూముల పరిరక్షణకు వెంటనే ఉన్నతస్థాయి అధికారుల సమావేశం ఏర్పాటుచేసి భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. సీఎం జగన్ స్వయంగా ఉన్నతాధికారులతో  చర్చించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పునః సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి అధికారులతో  సిట్  ఏర్పాటు చేసి అవసరమయ్యే న్యాయ ప్రక్రియ చేపట్టాలి.  గతంలో టీటీడీ భూములు అన్యాక్రాంతం చేయడానికి కొందరు తిరుమల కొండపై ఉన్న భూములు మావే అంటూ, టీటీడీ భూములు ప్రైవేటు భూములుగా చూపే ప్రయత్నాన్ని టీటీడీ అధికారులు అడ్డుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా దసపల్లా హిల్స్ భూముల పరిరక్షణకు  సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలి. నిజాయితీగా పోరాటం చేసి భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను." సోము వీర్రాజు 

బీజేపీ ప్రజా ఉద్యమం 

రూ.1500 కోట్ల పైబడి విలువైన  దసపల్లా హిల్స్ భూముల పరిరక్షణకు ముందుగా స్టే తీసుకు వస్తే తర్వాత కొంత కసరత్తు చేసి భూములను రక్షించుకునే అవకాశం ఉంటుందని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాకానిపక్షంలో ఈ కుంభకోణంలో  అధికార పార్టీ నేతలే, జిల్లా యంత్రాంగంతో కుమ్మక్కై పావులు కదుపతున్నారని భావించవలసి వస్తుందన్నారు. అదే జరిగితే ఆ భూముల పరిరక్షణకు బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. తదుపరి పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Embed widget